Saturday 8 June 2019

Press meet on 7.6.19


ప్రచురణార్ధం:                                                         తేదీ:07.06.2019 

రాష్ట్ర ఆదాయంలో స్థానిక సంస్థలకు 40 శాతం నిధులను కేటాయిస్తూ సిపార్సులను చేయవలసిందిగా టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ ఆంధ్రపదేశ్‌ 4 వ రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ ను కోరింది. ఈ మేరకు టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ ప్రతినిధిబృందం ఫైనాన్స్‌ కమీషన్‌ ఛైర్మెన్‌ ను కలిసి మొమొరాండం సమర్పించింది. ఫైనాన్స్‌ కమీషన్‌ తన సిఫార్సులను రూపొందించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలను ఆ మెమొరాండం
లో పొందుపరచింది. త్రాగునీటి వ్యవస్థ , పారిశుధ్ధ్యం, వీధిలైట్లను పూర్తిస్థాయి వ్యాపారాత్మకంగా మార్చటానికి యూజర్‌ చార్జీలను, పన్నులను ఎంత పెంచాలో సూచించమని రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్‌ కమీషన్‌కు టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో ఇవ్వటాన్ని టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ తప్పుబట్టింది. గ్రామీణ ప్రాంతాలలో మహిళలు త్రాగునీటి కోసం కిలోమీటర్ల కొలది దూరం వెళ్ళవలసివస్తన్నదని, అనేక పట్ణణాలలో రెండు మూడు రోజులకొకసారి మాత్రమే నీరు ఇస్తున్నారని, ఈ పరిస్థితిని చక్కదిద్దటానికి ఏంచేయాలో సిఫార్సులు చేయమని కోరవలసిన ప్రభుత్వం, ఉన్న నీటితో ఎలా వ్యాపారం చేయాలో సిఫార్సులు చేయమని అడగటం ప్రజా వ్యతిరేకచర్య అని టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ స్పష్టం చేసింది. త్రాగునీటి వ్యవస్థ , పారిశుధ్ధ్యం, వీధిలైట్లతో సహా రాజ్యాంగంలోని 11,12 వ షెడ్యూళ్ళలో ఉన్న విధులను వేటీనీ వ్యాపారాత్మకంగా మార్చటం కాని, ప్రైవేటీకరించటం కానీ చేయరాదని ఫైనాన్స్‌ కమీషన్‌ను కోరింది. 
టెర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌లో ప్రజా రవాణా వ్యవస్థను ప్రైవేటీకరించటంకోసం సిఫార్సులు చేయమని రాష్ట్ర ప్రభుత్వం కోరటాన్ని కూడా టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ తప్పుబట్టింది. ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వ రంగంలోనే బలోపేతం చేయాలని కోరింది. ఆస్తిపన్ను, వృత్తిపన్ను, వినోదపుపన్ను, రిజిస్ట్రేషన్‌ చార్జీలలో వాటా తదితర స్థానిక సంస్థల ఆదాయాలను స్థానిక సంస్థలకే వదిలేయాలని,రోడ్డు టాక్స్‌లో 10 శాతం వాటాను స్థానిక సంస్థలకు ఇవ్వాలని టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ కోరింది. రోడ్లు త్రవ్వి కేబుళ్ళు, పైపులైన్లు వేసే ప్రైవేటు సంస్థలనుండి అద్దెను వసూలు చేసుకునే అధికారం స్థానిక సంస్థలకు ఉండాలని, మంచినీటి సరఫరాకు వినియోగించే విద్యుత్‌కు గృహావసరాలకు వసూలుచేసే చార్జీలనే వసూలు చేయాలని కోరింది.పేదలకు గృహనిర్మాణానికి అయ్యే ఖర్చును స్థానిక సంస్థలపై రుద్దరాదని, స్థానిక సంస్థలలోని ఉద్యోగుల జీత భత్యాలను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కోరింది. ఆస్తిపన్ను. డ్రైనేజిచార్జీలు, నీటిచార్జీలు తదితర పన్నులు, చార్జీలను వసూలు చేసే అధికారం స్థానిక సంస్థలకే ఉండాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ఆస్తులకు చెల్లించవలసిన ఆస్తిపన్ను చెల్లించక పోతే, స్థానిక సంస్థ కఠిన చర్యలు తీసుకొనే విధంగా చట్టసవరణలు చేయాలని కోరింది. స్థానిక సంస్థలలో ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని విడనాడాలని, పట్ణణాలు, గ్రామాల అభివృధ్ధికి ఒక నిర్థిష్టమైన యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించి అమలు జరపాలని కోరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో స్థానిక సంస్థలు చేయవలసిన పనులను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా చేపట్టరాదని, స్థానిక సంస్థల ద్వారానే ఆ పనులను చేయించాలని కోరింది. సిఫార్సులు చేసేటప్పుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ ఆసోసియేషన్‌ రాష్ట్ర ఫైనాన్స్‌ కమీషన్‌ను కోరింది.