Sunday 12 December 2010

Tax Payers' Association gives a call not to pay user charges for Solid waste management

చెత్త పన్ను కట్టవద్దు- ఆస్థి పన్ను మాత్రమే చెల్లించండి.

విజయవాడ నగర ప్రజలకు రౌండ్‌ టేబుల్‌ సమావేశం పిలుపు
మితృలారా!


ఈ అక్టోబరునుండి అర్ధ సంవత్సరానికి మీరు చెల్లించవలసిన ఆస్థి పన్ను నోటీసులు మీకు ఈ పాటికి వచ్చే ఉంటాయి. వాటిని వెంటనే చెల్లించకండి. చెల్లించబోయే ముందు ఒక్క సారి పరిశీలించండి. ఆనోటీసులో యూజర్‌ చార్జీల పేరుతో కొంత మొత్తం కలిపి ఉంటుంది. అదే చెత్త పన్ను. ఏదైనా పన్ను లేదా చార్జీలు విధించే ముందు

Thursday 2 December 2010

పేద, మధ్య తరగతి ప్రజలపై భారాలు - సంపన్నులకు సదుపాయాలు- ఇవే పట్టణ సంస్కరణలు

 కేంద్రం జవహర్‌లాల్‌ నెహ్రూ నేషనల్‌ అర్బన్‌ రెన్యువల్‌ మిషన్‌ (జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం) పథకంలో తొలుత హైదరాబాద్‌,విశాఖపట్టణం,విజయవాడ నగరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.తరువాత దశలో ఇతర పట్టణాలకు విస్తరింపజేస్తామన్నది.ఈ సంస్కరణలతో పట్టణాల రూపు రేఖలే మారిపోతాయని చెప్పింది. పౌరసదుపాయాలకు కరువే ఉండదని నమ్మబలికింది.కాని గత ఐదేళ్ళ అనుభవం చూస్తే అంతా తలకిందులైంది.నిధుల ఆశచూపి ప్రపంచ బ్యాంకు షరతులు రుద్దింది.పట్టణ ప్రజల జీవితాలను అతలాకుతలం .పట్టణాల అభివృద్ధికి ప్రపంచబ్యాంకు,కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నాయని ఊదర

Wednesday 17 November 2010

Press Note on GO No 450

ప్రచురణార్ధం                                                                   తేదీ:17.11.2010
                                         జీ.వో నెం. 450

కట్టడపు ఏరియాలో 10వ వంతు మున్సిపాలిటీకి తాకట్టు పెట్టాలంటూ జారీ చేసిన జీ.వో నెం. 450ని తక్షణమే రద్దు చేయాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింది.ఈ మేరకు మున్సిపల్‌ కమీషనర్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ లేఖలు వ్రాశింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వ్రాసిన లేఖ కాపీలను స్థానిక శాసన సభ్యులకు కూడా అందజేసి జీ.వోను రద్దు చేయించడానికి తగిన చర్యలు చేపట్టాలని కోరింది.ఆలేఖ కాపీలను ఈ రోజు పత్రికలకు విడుదల చేశారు.ఈ జీ.వో ప్రకారం 100చ.మీ.(అంటే సుమారుగా 120 చ.గ.) పైన ఉన్న స్థలాలలో ఇళ్ళు కట్టుకునేవారు నిర్మాణ స్థలంలో 10 శాతాన్ని తప్పని సరిగా

Saturday 13 November 2010

Urban Reforms in Vijayawada City and their impact on people

URBAN REFORMS INITIATED BY  VIJAYAWADA MUNICIPAL CORPORATION
Urban reforms were initiated in Vijayawada Municipal Corporation (herein after referred as VMC) immediately after the Municipal Elections had been over in September 2005. Though the Congress (I) has emerged a single Largest Party in VMC, CPI candidate took over the charge as Mayor as per the electoral seat adjustment. The Mayor from CPI continued for one year only. Later Candidate from Cong(I) took over as

Wednesday 3 November 2010

Statement of Tax Pyers' Association on Funds to be released to Vijayawada city by State Government

                 ప్రజలు చెల్లించిన పన్నుల నుండి రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ నగర పాలక సంస్థకు ఇవ్వలసిన నిధులను ఇవ్వకుండా,విజయవాడ నగరాన్ని అధోగతి పాలు చేసింది. గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి నగరపాలక సంస్థకు అందిన నిధుల వివరాలను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ పత్రికలకు విడుదల చేసింది. ఫైనాన్స్‌ కమీషన్‌ సిఫార్సుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఆదాయంలో (అంటే కేంద్ర గ్రాంటులు కాకుండా) 36.24 శాతం స్థానిక సంస్థలకు ఇవ్వాలి. దీని ప్రకారం గత 5 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరానికి రావలసిన మొత్తం రు1093కోట్లు.ఇవి ఏషరతులు లేకుండా నగరపాలక సంస్థకు రావలసిన నిధులు.కాని

J.N.N.U.R.M Grants VS Funds released to Vijayawada Municipal Corporation

J.N.N.U.R.M Grants received
from 2005-2006 to 2010-2011 (up to August)

                                                                                 In Rupees

Year               Govt India         Govt of AP       TOTAL RECIVED
                      Share (50%)      share (20%)
2005-2006          NIL                  NIL                         NIL                       

2006-2007    17,65,20,000       7,04,75,000          24,69,95,000

2007-2008     75,98,48,000     29,19,38,000        105,17,86,000

2008-2009     43,80,56,600      22,56,69540         66,37,26,140

2009-2010    164,49,76,140     44,77,76,720       209,27,52,860

2010-2011     46,40,87,500      18,56,35,000         64,97,22,500
(up to August)
TOTAL         348,34,88,240    122,14,94,260      470,49,82,500

Tuesday 2 November 2010

Govt Of Andhra Pradesh didn't release funds to Vijayawada Municipal Corporation as per Finnce Commition Recomondations

రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం(కోట్ల రులలో)-స్థానిక సంస్థలకు కేటాయింపులు-విజయవాడ నగరానికి రావలసిన, వచ్చిన నిధుల వివరాలు
సం         రాష్ట్ర సొంత     మొదటి ఫైనాన్స్‌   గ్రామాలకు,              జనాభా           విజయవాడ
              ఆదాయం       కమీషన్‌                పట్టణాభివృధ్ధికి      ప్రాతిపదికన       కార్పొరేషన్‌కు      
                                   సిఫార్సుల           వాటర్‌ శానిటేషన్‌     విజయవాడ     విడుదల 
                                  ప్రకారం స్ధానిక      అన్నీకలిపి              మున్సిపల్‌       చేసినది  
                                సంస్థలకు             కేటాయించినది       కార్పొరేషన్‌కు                 
                                ఇవ్వవలసిది                                        రావలసినది
                                  (39.24%)                                
2005-06    23898.77    9377.88        3355.94(14.04%)         104.75             లేదు
2006-07    30414.05  11934.47       4545.82(14.95%)         133.31              లేదు

2007-08    35858.18  14070.75       5881.53(16.40%)         157.17              7.24

2008-09    43041.69  16889.56       9856.64(22.90%)         188.66              లేదు

2009-10    53610.00  21036.56       8655.16(16.14%)         234.98              లేదు

2010-11    62701.80  24604.19     11069.21(17.65%)         274.83              లేదు
                                                                                  1093.70             7.24

Saturday 23 October 2010

Memorandum Submitted to Muncipal Commissioner demanding withdrawal of G.O. M.S No 450

                                                                                 తేదీ:23.10.2010
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,
ఆర్యా!

విషయం:- జీ.వో. యం.యస్‌. నెం. 450 తేదీ 13.10.2010 ని రద్దు చేయాలని కోరుతూ.....

      అక్రమ కట్టడాలను నిరోధించడమన్న సాకుతో 100 చ.మీ. ఆపైన ఉన్న స్థలంలో ఇళ్లు నిర్మించుకునేవారందరూ తప్పనిసరిగా నిర్మాణ స్థలంలో 10శాతాన్ని మున్సిపాలిటీకి తాకట్టు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం 13.10.2010 తేదీతో విడుదల చేసిన జీ.వో. యం.యస్‌. నెం.450 ప్రజల ప్రయోజనాలకు విరుధ్ధమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము స్పష్టం చేస్తున్నాము.నివాసం కోసం గృహాలు నిర్మించుకునేవారికి, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు ఈ జీ.వో ఇబ్బంది కలిగిస్తుందని తెలియజేస్తున్నాము.
 అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు వాటిని నిర్మాణ దశలోనే ఆపాలి. వాటిని ఆపవలసిన బాధ్యత మున్సిపల్‌

Monday 18 October 2010

Go No 450 dt 13.10.2010- Amended Building Rules

ORDER:


In the GOs 1st to 4th read above, Government have issued
Revised Common Building Rules for all Municipalities/ Municipal
Corporations and Urban Development Authorities in the State.

2. The Commissioner, Greater Hyderabad Municipal

Wednesday 29 September 2010

Notification Appointing Special Officers For Municipal Corporations- GO MS No 425 dt 29.09.2010

                                             NOTIFICATION

Whereas, the term of the Members of 11 Municipal Corporations in the State of Andhra Pradesh is going to expire by 29.10.2010 except Vijayawada Municipal Corporation Council, whose term is going to expire by 6.10.2010, as per sub-section (1) of Section 6 of the Greater Hyderabad Municipal Corporation Act, 1955 and clause (a) of sub-section (1) of Section 7 of Andhra Pradesh Municipal Corporations Act, 1994.

And whereas, according to sub-section (1) of Section 7 of the Greater Hyderabad Municipal Corporations

Friday 10 September 2010

Water Crisis In Manila, the Capital of Phillipains

నీటి ప్రయివేటీకరణతో సంక్షోభం- మనీలాలో దుస్థితి

ఇబ్బందుల్లో ప్రజలు - 1700 శాతం పెరిగిన ఛార్జీలు

                ప్రయివేటీకరణ దుష్ఫలితాలు అనేక దేశాల్లో బయటపడుతున్నప్పటికీ  మన ప్రభుత్వం ప్రయివేటీ కరణకు అర్రులు చాస్తున్నది.ప్రభుత్వం సరఫరా చేయాల్సిన మంచినీటిని ప్రయివేటుకు అప్పగిస్తే ఎంతటి దుష్పరిణామాలు తలెత్తుతాయో మెట్రో మనీలాలోని నీటి సంక్షోభం కళ్ళకు కడుతోంది.అక్కడ వర్షాలు కురిసిన అనంతరం కూడా ఈ నీటి సంక్షోభం తొలగిపోయే అవకాశాలు లేనట్టు భావిస్తున్నారు.జులైలో 30లక్షల మందికి

Monday 30 August 2010

Full Text of GO. Rt. No 973 issued by Government of Andhrapradesh to levy user charges for Garbage Collection in Vijayawada City

                    GOVERNMENT OF ANDHRA PRADESH


                                         ABSTRACT

Municipal Administration and Urban Development Department - Vijayawada Municipal Corporation, Vijayawada – Cancellation of Council Resolution No.134, dated 6.8.2009 –Orders – Issued.

- - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -

MUNICIPAL ADMINISTRATION  and URBAN DEVELOPMENT (H1) DEPARTMENT

G.O.Rt.No. 973 ,                                              Dated:21.08.2010.

                                                                       Read the following

1) From the Commissioner, Municipal Corporation,
Vijayawada, Letter No.F1-163019/2008, dated 17.09.2009.

2) Government Memo No.15787/K2/2009-1, Municipal Administration
and  Urban Development Department, dated 23.01.2010.

3) From the Mayor, Vijayawada Municipal Corporation, Vijayawada,
Letter No.17/2010, dated 15.02.2010.

4) Government Memo.No.15787/K2/2009-2, Municipal Administration
and Urban Development Department, dated 6.5.2010.

5) From the Mayor, Vijayawada Municipal Corporation, Vijayawada,
Letter No.48/2010, dated 15.05.2010.

6) Government Memo.No.15787/K2/2009-3, Municipal Administration
 and Urban Development Department, dated 14.6.2010.

7) From the Mayor, Vijayawada Municipal Corporation, Vijayawada,
 Letter No.48/2010, dated 25.06.2010.

****

O R D E R:-

Whereas, in the letter 1st read above, the Commissioner,
Vijayawada Municipal Corporation, Vijayawada has
reported that Vijayawada Municipal Corporation is spending
huge amounts for Solid Waste Management in the City. The
recovery of the Operation &Maintenance charges is
very low at one third of the total expenditure. The Vijayawada
Municipal Corporation is already facing many financial constraints
in meeting various requirements and also committed to reforms
under JNNURM for 100% recovery of O&M expenditure
for various services provided by the Vijayawada Municipal
Corporation. The Municipal Council had also earlier accepted
for JNNURM project including reforms;
2. And whereas, the Commissioner, Vijayawada Municipal
Corporation, Vijayawada has further reported that an office
proposal was placed before the Municipal Council, with
estimated service / user charges of Rs.8.12 Cr per Annum.
The Vijayawada Municipal Council vide CR.No.134,
dated 06.08.2009 had rejected the proposal resolving that
the Vijayawada Municipal Corporation is already collecting
various taxes from the citizens. Such action of the council
rejecting the office proposals involving financial matter will
not only worsen the financial situation but also leave a message
 that no service charges will be levied for any service of
Vijayawada Municipal Corporation and is contrary to the
spirit of reforms undertaken by the Vijayawada Municipal
Corporation;
3. And whereas, the Commissioner, Vijayawada Municipal
Corporation, Vijayawada has finally requested the Government
to cancel the Council Resolution No.134, dated 06.08.2009
by invoking provisions under section 679-A of HMC Act 1955
so that user charges can be levied for Municipal Solid Waste
Management in the best interest of Vijayawada Municipal
Corporation;
4. And whereas, Government consider that it is appropriate
to cancel the Council Resolution No.134, dated 06.08.2009
of Vijayawada Municipal Corporation under sub-section
(1) of Section 679-A (1) of Greater Hyderabad Municipal
Corporation Act, 1955 (AP Act II of 1956), read with 
 section 7 of the Vijayawada Municipal Corporation Act,
1981 (AP Act 23/1981) as it is contrary to the spirit of reforms
undertaken by the Vijayawada Municipal Corporation and also
causes financial loss to the Corporation;
5. And whereas, in the letters 2nd, 4th and 6th cited, show
cause notices have been issued to the Mayor, Vijayawada
Municipal Corporation to explain within 15 days from the date
of receipt of this notice as to why its Council Resolution No.134,
dated 06.08.2009 should not be cancelled, as it is contrary
to the spirit of reforms undertaken by the Vijayawada Municipal
Corporation and also causes financial loss to the Corporation;

6. And whereas, in the letter 7th read above, the Mayor, Vijayawada
 Municipal Corporation has reported that at present Under Ground
Drainage works taken up under Jawaharlal Nehru National Urban
Renewal Mission are in rapid progress covering more than 70% of
the Vijayawada Municipal Corporation area. Due to the same, the
citizens of Vijayawada are facing inconvenience in Transportation
and attending other daily routine affairs. All Under Ground Drainage
works will be finished by December, 2010 as revealed during review
meetings conducted with Vijayawada Municipal Corporation officers.
Most of the Corporators are of the opinion that the proposed levy of
user charges under Solid Waste Management may be taken up
only after total completion of the Under Ground Drainage works.
The citizens of Vijayawada City are also expressing the same opinion
 that it will be apt only to levy such user charges after completion
of the Under Ground Drainage and providing other amenities. Further,
 it is felt that the tariff proposed by the Commissioner, also needs a
re-look into the suggested slabs so as to provide relief to the poorer 
 and unaffordable sections of the population of Vijayawada city.
Therefore, they have decided to levy and collect the user charges
of Solid Waste Management from December, 2010 onwards before
the next council meeting and requested the Government to
re-examine the issue and cancel the said showcause notice to
enable the Council of Vijayawada Municipal Corporation to consider
and approval of user charges on its own;

7. And whereas, Government after careful consideration of the
matter decided to cancel  the above council resolution;

8. Now, therefore, in exercise of the powers conferred under
sub-section (1) of Section 679-A(1) of Greater Hyderabad
Municipal Corporations Act, 1955 (AP Act II of 1956), read
with section 7 of the Vijayawada Municipal Corporation Act,
1981 (AP Act 23/1981), the Government hereby cancel the
Council Resolution No.134, dated 06.08.2009 of Vijayawada
Municipal Corporation;

9. The Commissioner, Vijayawada Municipal Corporation shall
take further necessary action to collect the proposed amount as
additional fee on account of Solid Waste Management.

(BY ORDER AND IN THE NAME OF THE GOVERNOR OF ANDHRA PRADESH)

                                                    T.S.APPA RAO,

                    PRINCIPAL SECRETARY TO GOVERNMENT (UD).

To

The Mayor,

Vijayawada Municipal Corporation,

Vijayawada.

The Commissioner, Vijayawada Municipal Corporation, Vijayawada.

Copy to:

The Special Secretary to CM.

The Private Secretary to M(MA&UD).

The Private Secretary to Principal Secretary to Govt., (UD), MA&UD Department.

The Private Secretary to Principal Secretary to Govt., (MA), MA&UD Department.

Law (A) Department.

Sc/Sf.

                                                           //FORWARDED::BY ORDER//

                                                              SECTION OFFICER

Friday 27 August 2010

Press Note on G.O.Rt No 973 dt 21.08.2010

ప్రచురణార్ధం                                              తేదీ:25.08.2010

    చెత్త తొలగింపుపై చార్జీల ప్రతిపాదనను తిరస్కరిస్తూ నగరపాలక సంస్థ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీ.వో  ఇవ్వడం ప్రజాస్వామ్య విరుధ్ధమని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది. ఈ మేరకు నగర మేయర్‌కు టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఒక మెమొరాండాన్ని సమర్పించింది.  డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేసుకోవచ్చని,అనేక మంది కార్పొరేటర్లు, విజయవాడ నగర పౌరులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని నగర మేయర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయటాన్ని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ తప్పు పడుతున్నది. నగర పాలక సంస్థ చేసిన తీర్మానంపై రాష్ట్ర ప్రభుత్వం  సంజాయిషీ  కోరినప్పుడు సంజాయిషీ ఇవ్వవలసింది నగర కౌన్సిల్‌ తప్ప నగరమేయర్‌ వ్యక్తిగతంగా కాదు. రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన సంజాయిషీ లేఖను నగర కౌన్సిల్‌ లోపెట్టి చర్చించి కౌన్సిల్‌ నిర్ణయాన్ని సమాధానంగా పంపాలి. అందుకు భిన్నంగా మేయర్‌ గారు లేఖ వ్రాయటం, అందులో   డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు విధించుకోవచ్చని అనేకమంది కార్పొరేటర్లు అభిప్రాయ పడుతున్నారని,విజయవాడ నగర ప్రజలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని  వ్రాయటం దారుణం. నిజానికి  నగరపాలక సంస్థ ఏనాడు ఈ విషయంపై ప్రజల అభిప్రాయాన్ని కోరలేదు. నగరంలో అపార్టుమెంట్‌ అసోసియేషన్లు, కాలనీల అసోసియేషన్లు, ఉద్యోగ కార్మిక సంఘాలు, వర్తక వాణిజ్యవర్గాల సంఘాలు అనేకం ఉన్నాయి. వీరెవరినీ సమావేశ పరిచి సంప్రదించలేదు.  పైగా  ఈ ప్రతిపాదన కౌన్సిల్‌ ముందుకు వచ్చిన సందర్భంగా సి.పి.ఐ(యం) వారు ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. 70 వేలమందికి పైగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ  ఓటుచేశారు.  ఎవరితోనూ సమావేశాలు  నిర్వహించకుండా, ఏవిధమైన అభిప్రాయ సేకరణ జరగకుండా, యు.జి.డి. పనులు అయిన తర్వాత చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేయటం సమంజసంగా ఉంటుందని విజయవాడ నగర ప్రజలు అభిప్రాయ పడుతున్నారని మేయరుగారు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయటం  ప్రజాస్వామ్య విరుధ్ధం. ఈవిషయంపై  మేయరుగారు 25.06.2010 న రాష్ట్ర్నపభుత్వానికి సంజాయిషీ ఇస్తూ  వ్రాసిన  లేఖను పూర్తిగా ప్రజల ముందుంచాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండు చేస్తున్నది.

     చార్జీల ప్రతి పాదనను కౌన్సిల్‌ తిరస్కరించటం విజయవాడ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ చేపట్టిన సంస్కరణల స్పూర్తికి విరుధ్ధమని జీ.వోలో పేర్కొనటంపట్ల టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న ప్రజలపై మరల ప్రతి పనికి లెక్కగట్టి వసూలు చేయటమే సంస్కరణల స్పూర్తి అయితే, ఆ సంస్కరణలు నగర ప్రజలకు అక్కరలేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్లున్నది.  ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండి స్థానిక అవసరాలకై స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకుండా, స్థానిక సంస్థలు చేసే ప్రతి పనికి రేటుగట్టి వసూలు చేసుకోండని చెప్పటమే రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల ఉద్దేశ్యం.దీనిని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ తిరస్కరిస్తున్నది. తాము చెల్లిస్తున్న పన్నులనుండి నగరపాలక సంస్థకు రావలసిన నిధులను క్రమం తప్పకుండా పూర్తిగా విడుదల చేయటం, ప్రణాళికాబధ్ధమైన అభివృద్ధి జరగటం కోసం నిర్ధిష్ట చర్యలు చేపట్టడానికి తగిన సంస్కరణలు నగర ప్రజలకు కావాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

     ఆర్ధిక విషయాలతో ముడిపడి ఉన్న ప్రతిపాదనలను కౌన్సిల్‌ తిరస్కరించటం మూలంగా కార్పొరేషన్‌ ఆర్ధిక స్థితి దిగజారటమేకాకుండా,  కార్పొరేషన్‌ చేసే ఏపనికి చార్జీలు విధించదన్న సంకేతం నగర ప్రజలకు వెళుతుందని ఈ జీ.వో లో ఇచ్చారు. ఇది నగర పాలక సంస్థ ప్రజాతంత్ర పనివిధానాన్ని, నగర ప్రజలను అవమాన పరచటంగానే టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ భావిస్తున్నది.  నిజానికి స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్నారు. కనుక నగర ప్రజలు కార్పొరేషన్‌ చేసే ఏపనికి మరల చార్జీలు చెల్లించనవసరంలేదు.  స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండి విజయవాడ నగర అభివృద్ధికి, స్ధానిక సంస్థలకు ఎందుకు నిధులివ్వరని, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు విడుదల చేయక పోవటం, ప్రాధాన్యతలను ఎంచుకోకుండా, సరైన ప్రణాళిక లేకుండా పనులు నిర్వహించటం నగర పాలక సంస్థ అర్ధిక స్థితి క్షీణించ డానికి కారణాలు తప్ప, చెత్త సేకరణకు పన్ను విధించక పోవటం వలన కాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేస్తున్నది.

    ఇప్పటికైనా కౌన్సిల్‌ తీర్మానాన్ని గౌరవించి, జీ.వో. ఆర్‌.టి. నెం.973 ను రద్దు చేయాలని  టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేస్తున్నది. రద్దు చేయటానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేలా చూడవలసినదిగా మేయరు గారిని, నగర కార్పోరేటర్లను, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరుతున్నది.

                         

           (వి. సాంబిరెడ్డి)                                  (యం.వి.ఆంజనేయులు)

             అధ్యక్షులు                                      కార్యదర్శి        

Wednesday 25 August 2010

చెత్త సేకరణకు పన్ను విధించాల్సిందేనంటూ రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసిన జీ. వో.నెం.973 ను రద్దు చేయాలని డిమాందు చేస్తూ నగర మేయర్ కు సమర్పించిన మెమొరాండం.

                                                                    తేదీ: 24.08.2010
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ మేయర్  గారికి,
ఆర్యా!

విషయం:- నగరంలో చెత్త తొలగింపుకు చార్జీలు విధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ జీ.వో. ఆర్‌.టి. నెం.973 కు సంబంధించి.........

      విజయవాడ నగరంలో చెత్త తొలగింపుకు చార్జీలు విధించరాదంటూ విజయవాడ నగర కౌన్సిల్‌ 6.8.2009 న ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నగర పాలక సంస్ధ కౌన్సిల్‌ ఆమోదించిన తీర్మానాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 21.8.2010 న జీ.వో. ఆర్‌.టి. నెం.973 ను విడుదల చేసింది. నగర పాలక సంస్ధ కౌన్సిల్‌ ఆమోదించిన తీర్మానాన్ని రద్దు చేయమని 17.9.2009 న కమీషనర్‌ లెటరు వ్రాశారని, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మీ సంజాయిషీ కోరగా మీరు డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేసుకోవచ్చని, అనేక మంది కార్పొరేటర్లు,అదేవిధంగా విజయవాడ నగర పౌరులు కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లుగా మీరు సమాధానం పంపారని ఆ జీ.వో లో పేర్కొన్నారు.దానిని ఆధారం చేసుకొని నగర పాలక సంస్ధ కౌన్సిల్‌ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తనకున్న అధికారాలను వినియోగించి రద్దు చేసింది. మీరు పంపిన ఈ లెటర్‌ పూర్తిగా అప్రజాస్వామికమని, నగర ప్రజల అభిప్రాయానికి విరుధ్ధమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మీదృష్టికి తీసుకు వస్తున్నాము.

జీ.వో. ఆర్‌.టి. నెం.973 లో ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

" And Where as, in the letter 7th read above, the Mayor, Vijayawada Municipal Corporation has reported that .....................All Under Ground Drainage works will be finished by December 2010 as revealed during reveiw meetings conducted with Vijayawada Municipal Corporation Officers. Most of the Corporators are of the opinion that the proposed levey of user charges under Solid Waste Management may be taken up only after total completion of Under Ground Drainage Works. The Citizens of Vijayawada City are also expressing the same opinion that it will be apt only to levy such user charges after completion of the Under Ground Drainage and providing other amenities."

        నగరపాలక సంస్థలో నిర్ణయాలు చేయటానికి కౌన్సిల్‌ ప్రజాస్వామ్య వేదిక. ప్రజాస్వామ్యంలో మెజారిటీ నిర్ణయం తీర్మానమవుతుంది. నగరంలో ఇప్పటికే అనేక పన్నులు విధిస్తున్నందున చెత్త తొలగింపుకు చార్జీలు విధించరాదంటూ నగరపాలక సంస్థ కౌన్సిల్‌లో సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసారు.మాదృష్టికి వచ్చినంతవరకు డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేసుకోవచ్చని, ఏ తేదీన జరిగిన కౌన్సిల్‌ సమావేశంలోనూ తీర్మానించలేదు. కౌన్సిల్‌లో తీర్మానం చేయకుండా డిశంబరు 2010 నుండి చెత్త తొలగింపుకు చార్జీలు విధించుకోవచ్చని అనేకమంది కార్పొరేటర్లు అభిప్రాయ పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వ్రాశారు. అదేవిధంగా విజయవాడ నగర ప్రజలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేమేనాడు ఈ ప్రతిపాదనను ఆమోదించలేదు. దీనిపై అభిప్రాయ సేకరణ కోసం మీరు నగరంలోని అపార్టుమెంట్‌ అసోసియేషన్ల సమావేశాలుగాని,కాలనీల అసోసియేషన్ల సమావేశాలుగాని,ఉద్యోగ కార్మిక సంఘాల సమావేశాలుగాని,వర్తక వాణిజ్యవర్గాల సమావేశాలుగాని నిర్వహించలేదు. పైగా ఈ ప్రతిపాదన కౌన్సిల్‌ ముందుకు వచ్చిన సందర్భంగా సి.పి.ఐ(యం) వారు ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు.70వేలమందికి పైగా ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఓటుచేశారు.ఎవరితోనూ సమావేశాలు నిర్వహించకుండా,ఏవిధమైన అభిప్రాయ సేకరణ జరగకుండా,యు.జి.డి.పనులు అయిన తర్వాత చెత్త తొలగింపుకు చార్జీలు వసూలు చేయటం సమంజసంగా ఉంటుందని విజయవాడ నగర ప్రజలు అభిప్రాయ పడుతున్నారని మీరు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ వ్రాయటం ఆశ్ఛర్యంగా ఉంది.ఇది ప్రజాస్వామ్య విరుధ్ధమని మీదృష్టికి తెస్తున్నాము.

దీనితో బాటుగా జీ.వోలో ఉన్న మరోక విషయాన్ని కూడా మీదృష్టికి తెస్తున్నాము. జీ.వోలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా పేర్కొంది.

" Such action of the Council rejecting the office proposals involving financial matters will not only worsen the financial situation but also leave a massage that no service charges will be leveid for any service of Vijayawada Municipal Corporation and is contrary to the spirit of reforms undertaken by the Vijayawada Municipal Corporation"

         ఇది నగర పాలక సంస్థ ప్రజాతంత్ర పనివిధానాన్ని, నగర ప్రజలను అవమాన పరచటంగానే భావిస్తున్నాము. నగర పాలక సంస్థ కౌన్సిల్‌లో ఉన్న వాళు నగరపాలక సంస్థ ఆర్ధిక పరిస్థితి గమనించకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహారిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ జీ.వోను ఇచ్చినట్లుగా ఉన్నది. అంతే కాకుండా కార్పొరేషన్‌ చేసే ఏపనికి చార్జీలు విధించదన్న సంకేతం నగర ప్రజలకు వెళుతుందని ఈ జీ.వో లో ఇచ్చారు. స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న నగర ప్రజలు కార్పొరేషన్‌ చేసే ఏపనికి మరల చార్జీలు విధించరాదనే కోరుకుంటున్నారు. ఇది తప్పు కాదు. ఇది నగర ప్రజల సమంజసమైన కోరిక. ఒకవైపు పన్నులు వసూలు చేస్తూనే మరొకవైపు ప్రతిపనికి మరల యూజర్‌ చార్జీలు, సర్వీస్‌ చార్జీలు, ఫీజుల పేరుతో వసూలు చేస్తామని అటు కార్పొరేషన్‌, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు పంపింది. ఆచరణకూడా ప్రారంభించాయి. స్థానిక అవసరాలతో సహా, రాష్ట్ర అవసరాలకోసం తాము చెల్లిస్తున్న పన్నులనుండి మా నగర అభివృద్ధికి ఎందుకు నిధులివ్వరని,మామీద మరలా ఎందుకు భారాలు మోపుతున్నారని నగర ప్రజలు ప్రశ్నిస్తే నగర ప్రజలకు సపమాధానం చెప్పవలసిన బాధ్యత కార్పొరేషన్‌ మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో తగినన్ని నిధులు విడుదల చేయక పోవటం, ప్రాధాన్యతలను ఎంచుకోకుండా, సరైన ప్రణాళిక లేకుండా పనులు నిర్వహించటం నగర పాలక సంస్థ అర్ధిక స్థితి క్షీణించ డానికి కారణాలు తప్ప, ప్రజల మీద చెత్త సేకరణకు పన్ను విధించక పోవటం వలన కాదు.

         ఇక చార్జీల ప్రతి పాదనను కౌన్సిల్‌ తిరస్కరించటం విజయవాడ మున్సిపల్‌ కార్పొ రేషన్‌ చేపట్టిన సంస్కరణల స్పూర్తికి విరుధ్ధమని జీ.వోలో పేర్కోన్నారు. ఇప్పటికే పన్నులు చెల్లిస్తున్న ప్రజలపై మరల ప్రతి పనికి లెక్కగట్టి వసూలు చేయటవేు సంస్కరణల స్పూర్తి అయితే, ఆసంస్కరణలు నగర ప్రజలకు అక్కరలేదని స్పష్టం చేస్తున్నాము. తాము చెల్లిస్తున్న పన్నులనుండి నగరపాలక సంస్థకు రావలసిన నిధులను క్రమం తప్పకుండా పూర్తిగా విడుదల చేయటం,ప్రణాళికాబధ్ధమైన అభివృద్ధి జరగటం కోసం నిర్ధిష్ట చర్యలు చేపట్టడానికి తగిన సంస్కరణలు నగర ప్రజలకు కావాలి. ప్రజలు చెల్లిస్తున్న పన్నులనుండి స్థానిక అవసరాలకై స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకుండా, స్థానిక సంస్థలు చేసే ప్రతి పనికి రేటుగట్టి వసూలు చేసుకోండని చెప్పటవేు రాష్ట్ర ప్రభుత్వ సంస్కరణల ఉద్దేశ్యం. దీనిని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా వేుము తిరస్కరిస్తున్నాము.

          ఇప్పటికైనా కౌన్సిల్‌ తీర్మానాన్ని గౌరవించి, జీ.వో. ఆర్‌.టి. నెం.973 ను రద్దు చేయటానికి ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టేలా చూడవలసినదిగా కోరుతున్నాము.

                                                                           అభివందనాతో
                                                                    యం.వి.ఆంజనేయులు
                                                                             కార్యదర్శి



        

Sunday 15 August 2010

Worl Bank Loan to Andhra Pradesh- Its Impact

ఆంధ్రప్రదేశ్‌ పై ప్రపంచబ్యాంకుకు అంత ప్రేమెందుకో?


2010-2011 ఆర్ధిక సంవత్సరంలో ప్రపంచ బ్యాంకు వివిధ రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం= రు9841.5 కోట్లు.
దీనిలో
01.ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించింది.
పురపాలక సంస్థలలో సంస్కరణల అమలుకు ఇచ్చిన ఋణం = రు 1350 కోట్లు
రోడ్‌ సెక్టార్‌ ప్రాజెక్టుకు ఇచ్చిన ఋణం                                 = రు1440 కోట్లు
గ్రామీణ నీటి సరఫరాకు ఇచ్చిన ఋణం                              = రు  675 కోట్లు
నాగార్జున సాగర్‌ ఆధునికీకరణకు ఇస్తున్న ఋణం                = రు 2025 కోట్లు
                                                     మొత్తం ఋణం        = రు 5490 కోట్లు
ఇతర రాష్ట్రాలకు కేటాయించినది.

02. ముంబయి అర్బన్‌ ట్రాన్స్‌పోర్టు కోసం కేటాయించింది             = రు 1935.0 కోట్లు
03. తమిళనాడు రోడ్‌ సెక్టారుకు, ఆరోగ్య రంగానికి కేటాయించింది = రు 755.5 కోట్లు
04. కర్ణాటక ఆర్‌.డబ్ల్యు.యస్‌ పథ కానికి కేటాయించింది             = రు 675.0 కోట్లు
05. రాజస్థాన్‌ వాటర్‌ సెక్టార్‌కు కేటాయించింది                           = రు   86.0 కోట్లు
06. బెంగాల్‌ పంచాయతీ రాజ్‌ సంస్థల కోసం కేటాయించింది      = రు  900.0 కోట్లు
                        ఇతర రాష్ట్రాలన్నిటికీ కలిపి ఇస్తున్నఋణం       =రు4351.5 కోట్లు

పై కేటాయింపులను పరిశీలిస్తే ఈ సంవత్సరం రాష్ట్రాలకు కేటాయించిన మొత్తంలో 56శాతం ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌కే కేటాయించింది. అది కూడా విషమ షరతులతో.మున్సిపాలిటీలు చేసే ప్రతిపనికీ రేటుకట్టి వసూలు చేయాలని,నాగార్జున సాగర్‌ కాలువకు నీటి మీటర్లు పెట్టి రైతులకు ఇచ్చే ప్రతి నీటిచుక్కకు రేటుకట్టి వసూలు చేయాలని ప్రపంచబ్యాంకు విధించిన షరతులకు మన రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఈ ఋణం తెచ్చింది.పశ్చిమ బెంగాల్‌ లాంటి రాష్ట్రాలు షరతులు లేని ప్రాజెక్టు లోను తెచ్చుకుంటే,మనరాష్ట్రం మాత్రం ప్రజావ్యతిరేక షరతులతో కూడిన ఋణం తెచ్చింది.దీని దుష్ప్రభావాలు మనరాష్ట్రంలోని పట్టణ ప్రజలు ఇప్పటికే అనుభవిస్తున్నారు.పట్టణాలలో నీటి మీటర్లుపెట్టడం,చెత్త ఎత్తివేయటానికి పన్ను వసూలు చేయటం,పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాన్ని ఎత్తివేయటం,రిజిష్ట్రేషన్‌విలువను తగ్గించి ,భూములవిలువలు పెంచటం లాంటివన్ని ఈ ఫరతులలో భాగమే. ఈ దుష్ప్రభావాలను ఇప్పుడు పట్టణ ప్రజలతో బాటుగా రైతులు కూడా అనుభవించబోతున్నారు. షరతులను ఎదుర్కొనకపోతే మనరాష్ట్ర ప్రజలకు విముక్తి లేదు.

ఇది కాక మన కేంద్ర ప్రభుత్వం ప్రపంచబ్యాంకు వద్ద మరో 31855.5కోట్లు ఋణం తీసుకున్నది.దీనితో కలిపి 2010-2011లో మన దేశం తీసుకున్న మొత్తం ఋణం రు41,697కోట్లు అయింది.ప్రజావ్యతిరేక షరతులకు అంగీకరించి అసలీ ఋణంతీసుకోవలసిన అవసరం ఉందా అంటే లేదు.ఈ సంవత్సరంతో కూడా కలుపుకొని గత 4సంవత్సరాలలో స్వదేశీ,విదేశీ గుత్తసంస్థలకు ఇచ్చిన రాయితీల మూలంగా క్రేంద్ర ఖజానాకు 17 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరాలే దీనికి ఆధారం. ఒకవైపు ఈ కంపెనీలకు లక్షల కోట్ల రాయితీలిస్తూ, మరోవైపు ప్రజలమీద భారాలు మోపే విషమ షరతులకు అంగీకరించి అప్పుల మీద అప్పులు తెస్తున్నారు.ఈ అప్పులను మళీ మనవేు తీర్చాలి.ఈ అప్పులతో,ప్రైవేటీకరణలతో భారత ప్రజల బ్రతుకులు పరాధీనమౌతున్నాయి.ఈ విధానాలు మారితేనే ఈ దేశ ప్రజలకు విముక్తి లభిస్తుంది.ఈ విధానాల మార్పుకోసం పోరాడటమే   మన కర్తవ్యం.


ట్రాఫిక్ రద్దీ పరిష్కారంకై మున్సిపల్ కమీషనర్ కు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్ లేఖ

గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,


ఆర్యా!

విషయం:- నగరంలో రోడ్ల వెడల్పుకు సంబంధించి.........


విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేటందుకు రోడ్ల విస్తరణకు తగిన చర్యలు చేపట్టాలని మీరు అధికారులను ఆదేశించినట్లుగా పత్రికలలో చూచాము. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను మీదృష్టికి తెస్తున్నాము.

01. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించటానికి రోడ్ల విస్తరణ ఒక్కటే మార్గంగా కార్పొరేషన్‌ ఎంచుకుంటున్నది. ఇది సరికాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా వేుము అభిప్రాయపడుతున్నాము. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించటానికి అనేక ప్రత్యామ్నాయాలున్నాయి. వీటిని గురించి కార్పొరేషన్‌ పట్టించుకోవటం లేదు. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించటానికి ప్రత్యామ్యాయాలను గురించి ఆలోచించాలని కోరుతున్నాము.

02.సాధారణంగా రోజువారి ట్రాఫిక్‌ రద్దీ సమస్యను పరిష్కరించడానికి కార్పొరేషన్‌ అధికారులు పోలీస్‌ యంత్రాంగం కూర్చొని తగిన చర్యలు చేపట్టవచ్చు. కాని ట్రాఫిక్‌ రద్దీ సమస్య శాశ్వత పరిష్కారానికి తీసుకునే చర్యలు నగరం మొత్తంపై ప్రభావం చూపుతుంది. ట్రాఫిక్‌ రద్దీ సమస్య పరిష్కారానికి రోడ్లు వెడల్పు చేయడం, దానికై స్థలసేకరణ జరపడం అన్నవి విధానపరమైన నిర్ణయాలు. రోడ్ల విస్తరణకై సేకరించే స్థలం కేవలం ప్రభుత్వ భూమి మాత్రవేు కాదు. అందులో పట్టా భూములు కూడా ఉన్నాయి. భవనాలు ఉన్నాయి. భవనాలను కూలగొట్టి పట్టాభూములను లాగేసుకోవడం అనేది విధానపరమైన చర్య. నగరం మొత్తంమీద ప్రభావంచూపే విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు నగరంలో చర్చ జరగాలి. అది జరగటం లేదు. కేవలం కార్పొరేషన్‌ అధికార యంత్రాంగం అనుకున్న విషయాలను అమలు జరపడానికి ప్రయత్నిస్తున్నారుతప్ప, నగరంలో ప్రజలకు ఎలా సౌకర్యంగా ఉంటుంది, నగర ప్రజలు తమకేం కావాలని అభిప్రాయపడుతున్నారో తెలుసుకుని వాటికి అనుగుణంగా నిర్ణయాలు జరగటం లేదు. ఇది అనేక సందర్భాలలో ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నది. నగరపాలక సంస్థకుకూడా నష్టం వాటిల్లుతున్నది. అందువలన ట్రాఫిక్‌ రద్దీ సమస్య పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై నగరంలోని వివిధ అపార్టుమెంట్ల అసోసియేషన్లు, కాలనీ అసోసియేషన్లు, టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌, వర్తక వాణిజ్య అసోసియేషన్లు, ఛిల్డ్రన్‌ స్కూల్స్‌ అసోసియేషన్లు, మోటారు ట్రాన్స్‌ పోర్టు ప్రతినిధులు, మహిాళా సంఘాలు, వివిధ ట్రేడ్‌యూనియన్‌లతో సంయుక్తంగా చర్చ జరిపి వచ్చిన అభిప్రాయానికనుగుణంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.

03. ట్రాఫిక్‌ రద్దీ సమస్య పరిష్కారానికి బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మాణంపై 19.02.2010న ది ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ హాలులో టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. నగరంలోని వర్తక వాణిజ్య వర్గాల ప్రతినిధులు, ఛార్టెడ్‌ ఎకౌంటెట్లు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లు, మాజీవేుయర్‌ శ్రీ జంధ్యాల శంకర్‌, ఆ పరిసర ప్రాంతాల నివాసులు, పీపుల్‌ ఫర్‌ ఇండియా ప్రతినిధులు, ఛిల్డ్రన్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలవారు, మోటారు ట్రాన్స్‌ పోర్టు ప్రతినిధులు ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశం సమావేశంలో పాల్గొన్నారు. వారందరు వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి రాష్ట్రప్రభుత్వానికి లేఖ వ్రాశాము. ఆలేఖ కాపీ తమ పరిశీలనార్ధం దీనితో జతచేసి పంపుతున్నాము.


పై విషయాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ రద్దీ సమస్య పరిష్కారానికి ప్రత్యామ్యాయాలను పరిశీలించాలని, ప్రత్యామ్నాయాలతో బాటుగా పరిష్కారానికి తీసుకోవలసిన చర్యలపై నగరంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో చర్చలు జరిపిన అనంతరం మాత్రమే  రోడ్ల వెడల్పు లాంటి తదుపరి చర్యలు చేపట్టవలసినదిగా కోరుతున్నాము.

                                       అభివందనాతో

(వి. సాంబిరెడ్డి)                                             (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                                         కార్యదర్శి

Tax Payers' Association writes to Chief Minister of A.P.on Flyover at Benz Circle

బెంజ్ సర్కిల్ వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణ విషయంలో ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య గారికి  వ్రాశిన లేఖ.         
                                                                                                                
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ కె. రోశయ్య గారికి,
ఆర్యా!

విషయం:- బెంజి సర్కిల్‌ వద్ద ప్లైఓవర్‌ నిర్మాణానికి సంబంధించి.........

                    విజయవాడ నగరంలోని మహాత్మా గాంధీరోడ్డును బెంజి సర్కిల్‌ వద్ద దాటుకుంటూ 5వ నెంబరు జాతీయ రహదారి వెళుతున్నది. మద్రాసు నుండి కలకత్తావెళ్ళే   భారీవాహానాలు,  హైదరాబాద్   వైపునుండి  9 వ నెంబరు జాతీయ రహదారి ద్వారా కలకత్తా, మరియు మచిలీపట్టణం వెళ్ళే భారీవాహానాలు 5వనెంబరు జతీయ రహాదారి ద్వారావచ్చి బెంజి సర్కిల్‌ వద్ద చీలుతాయి. అందువలన  బెంజి సర్కిల్‌ వద్ద విపరీతంగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడి నిలిచి పోతున్నది. దీనితో నగరవాసులకు విపరీతమైన అసౌకర్యం కలుగుతున్నది.అందువలన బెంజి సర్కిల్‌ వద్ద ప్లైఓవర్‌ను నిర్మించాలని విజయవాడ నగరవాసులు ఎంతో కాలంగా కోరుతున్నారు.అయినప్పటికీ అది ఆచరణకు నోచుకోలేదు.

అయితే ఇటీవల బెంజి సర్కిల్‌ వద్ద ప్లైఓవర్‌ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్నదని,నటరాజన్‌ గుల్జార్‌ రోడ్డు (టిక్కిల్‌ రోడ్డు)నుండి ప్రారంభించి,బెంజి సర్కిల్‌ మీదుగా పటమట యన్‌.టి.ఆర్‌.విగ్రహాం వరకు మహాత్మా గాంధీ రోడ్డు మీద ఈ ప్లైఓవర్‌ను నిర్మించబోతున్నారని పత్రికలలో చూచాము.

ఈ విషయంపై ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి 19.02.2010న ది ఆంధ్రా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ హాలులో టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది.నగరంలోని వర్తక వాణిజ్య వర్గాల ప్రతినిధులు, ఛార్టెడ్‌ ఎకౌంటెట్లు, వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని వివిధ పార్టీల ఫ్లోర్‌ లీడర్లు, మాజీ మేయర్‌ శ్రీ జంధ్యాల శంకర్‌,ఆ పరిసర ప్రాంతాల నివాసులు,పీపుల్‌ ఫర్‌ ఇండియా ప్రతినిధులు,ఛిల్డ్రన్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, ఉద్యోగ సంఘాలవారు,మోటారు ట్రాన్స్‌ పోర్టు ప్రతినిధులు ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశం సమావేశంలో పాల్గొన్నారు.వారందరు వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి తమ పరిశీలనార్ధం మీముందుంచుతున్నాము.
  అభిప్రాయాలు:

01. జాతీయ రహాదారి మీద వస్తున్న భారీ వాహానాల వలననే బెంజి సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతున్నది. కారణ మేమంటే మహాత్మా గాంధీ రోడ్డు మీద బెంజి సర్కిల్‌ వద్ద ఎలాంటి వాహానాలు ఆగవు.ఆగే అవసరం కూడా లేదు.అందువలన మహాత్మా గాంధీ రోడ్డు మీద వచ్చే స్థానిక వాహానాల వలన ట్రాఫిక్‌ సమస్య తలెత్తడం లేదు.ట్రాఫిక్‌ సమస్యకు కారణం జాతీయ రహాదారి మీద వస్తున్న భారీ వాహానాలే.కనుక భారీ వాహానాలను మహాత్మా గాంధీ రోడ్డు మీద వచ్చే ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా చేస్తే అక్కడ ట్రాఫిక్‌ సమస్య ఉండదు.అందువలన మహాత్మా గాంధీ రోడ్డు మీద కాకుండా జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ను నిర్మిస్తే ఈసమస్య పరిష్కారమౌతుంది.

02. మహాత్మా గాంధీ రోడ్డు మీద ప్లైఓవర్‌ నిర్మించి, మహాత్మా గాంధీ రోడ్డుమీద వచ్చే ట్రాఫిక్‌ను జాతీయ రహాదారిపై వచ్చే ట్రాఫిక్‌ అంతరాయం కలుగకుండా చేసినా బెంజి సర్కిల్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమవుతుంది.అయితే దీని ప్రయోజనం పరిమితంగా ఉండటవేు కాకుండా ట్రాఫిక్‌కు కొత్త ఇబ్బందులు తలెత్తుతాయి.ఇటీవలనే మహాత్మాగాంధీ రోడ్డును 120అడుగులుండేవిధంగా వెడల్పు చేశారు.ఆ సందర్భంగా పట్టా భూములలో నిర్మించుకున్న ఇళను సైతం తొలగించి వెడల్పు చేసారు.ఈ రోడ్డు మీద సిటీ బస్సులు,చిన్న కార్లు,మోటారు సైకిళు,ఆటోలు,సైకిల్‌ రిక్షాలు,పాల వాహానాలు, ఫైరింజన్లు, అంబులెన్స్‌లు ,స్కూల్‌బస్సులు తిరుగుతుంటాయి. నగరంలో ఇది ఒక ప్రధాన రహాదారి.నగరంలో అనేక ప్రాంతాలకు వెళే సిటీ బస్సులు ఈ రోడ్డు ద్వారానే వెళ్లాలి. నగర భౌగోళిక పరిస్థితి దృష్ట్యా,ఇతర మార్గాలలో వెళే అవకాశం కూడా లేదు.అలాంటి ఈ రోడ్డు మీద ప్లైఓవర్‌ నిర్మిస్తే ఈ రోడ్డు మరల ఇరుకుగా తయారవుతుంది.జాతీయ రహాదారినుండి మహాత్మా గాంధీ రోడ్డులోకి ప్రవేశించే సిటీ బస్సులు,ఇతర వాహానాలకు తీవ్రమైన ఆటంకం కలుగుతుంది.ఇది మరల ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతుందే తప్ప పరిష్కారం కాదు.అదే జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మిస్తే అటు జాతీయ రహాదారిపై వెళే వాహానాలకు గాని,ఇటు మహాత్మా గాంధీ రోడ్డు మీద వెళే ట్రాఫిక్‌కుగాని ఎలాంటి ఆటంకం ఉండదు.సమస్య పరిష్కార మవుతుంది.

03. అంతేకాకుండా, నటరాజన్‌ గుల్జార్‌ రోడ్డు (టిక్కిల్‌ రోడ్డు) నుండి బెంజి సర్కిల్‌ మీదుగా పటమట యన్‌.టి.ఆర్‌. విగ్రహాం వరకు మహాత్మాగాంధీ రోడ్డుపై 3 ప్రధానమైన బస్సు స్టాపులు ఉన్నాయి. వీటిని తరలించే అవకాశం కూడా లేదు.మహాత్మా గాంధీ రోడ్డు మీద ప్లైఓవర్‌ నిర్మిస్తే ఈ బస్సు స్టాపులను రద్దు చేయవలసి ఉంటుంది.దీనివలన నగరంలోని అత్యధిక బస్సు ప్రయాణీకులకు ఇది ఇబ్బందులను తెచ్చి పెడుతుంది.

04. మహాత్మాగాంధీ రోడ్డులో బి.ఆర్‌.టి.యస్‌ బస్సు కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. ఒకవైపు ప్లైఓవర్‌ నిర్మించి,మరోవైపు బి.ఆర్‌.టి.యస్‌ బస్సులకు డెడికేటెడ్‌ లైన్‌ ఏర్పాటు చేస్తే,ఇక ఇతర వాహానాలకు తావుండదు. ట్రాఫిక్‌ సమస్య విపరీతంగా పెరుగుతుంది.

05.జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మిస్తే మరికొన్ని సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. బెంజ్‌ సర్కిల్‌తో బాటుగా నిర్మలా కాన్వెంట్‌ రోడ్డు,ప్రభుత్వ ఐ.టి.ఐ.నుండి గురునానక్‌నగర్‌ వెళే రోడ్డు జాతీయ రహాదారిని దాటుతున్నాయి.ఈ మధ్యలో ఉన్న కాలనీలలో ఇంకా అనేక చిన్న రోడ్లు ఉన్నాయి.ఈ ప్రాంతంలో అనేక ముఖ్యమైన విద్యాలయాలు కూడా ఉన్నాయి.జాతీయ రహాదారిమీద స్క్యూ బ్రిడ్జినుండి మొదలై హెల్త్ యూనివర్శిటీవరకు ప్లైఓవర్‌ నిర్మిస్తే నగరంలో ట్రాఫిక్‌ సమస్య తీరుతుంది. ప్రస్తుతం జాతీయ రహాదారి వలన, నగరం జాతీయ రహాదారికి తూర్పు, పడమర ప్రాంతాలుగా చీలి ఉన్నది. జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మిస్తే ఈ రెండు ప్రాంతాలు కలిసి పోతాయి.ఆటోనగర్‌లోకి భారీ వాహానాలు ప్రవేశించడానికి గురునానక్‌ రోడ్డు ప్రత్యామ్నాయ  రోడ్డుగా అభివృద్ధి చెంది, పడమటలో ట్రాఫిక్‌ వత్తిడి తగ్గుతుంది. రోడ్డుకు ఇరు వైపులనున్న కాలనీల నుండి వచ్చే రోడ్లు కలిసి పోవడంతో కొన్ని రోడ్ల మీదనే ఏర్పడుతున్న ట్రాఫిక్‌ వత్తిడి తగ్గుతుంది.అందువలన జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మించడమే  సరైనది.

06. నగరానికి ఒక ముఖ్యమైన ప్లైఓవర్‌ నిర్మించేటప్పుడు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్యపై సమగ్రమైన అధ్యయనం జరిపి ప్లైఓవర్‌ నిర్మిస్తే అది నగర ప్రజలకు ఎంతో మేలు చేకూర్చుతుంది.గతంలో వి.జి.టి.యం.ఉడా వారు ఒక అధ్యయనం జరిపి మాస్టర్‌ ప్లాన్‌ను రూపొందించారు. ఈ మాస్టర్‌ ప్లానులో కూడా జాతీయ రహాదారి మీదనే ప్లైఓవర్‌ నిర్మించాలని సూచించారు.

07. నగరంలో నిర్మించే ప్లైఓవర్‌ నగర ప్రజలకు సౌకర్యయుతంగా ఉండటవేు కాకుండా, నగర అందాన్ని ఇనుమడింపజేసేదిగా కూడా ఉండాలి. జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మిస్తేనే నగర ప్రజలకు సౌకర్యంతో బాటుగా, నగరానికి వన్నె తెచ్చేదిగా ఉంటుంది.

08. జాతీయ రహాదారిపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరుగుతున్నందున గతంలో 2 లైన్లుగా ఉన్న 5వనెంబరు జాతీయ రహాదారిని 4 లైన్లుగా మార్చారు. ప్రస్తుతం 6 లైన్లుగా మార్చుతున్నారు. జాతీయ రహాదారిపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిందనే దీనర్ధం. ట్రాఫిక్‌ విపరీతంగాపెరిగినప్పుడు దానిని పరిష్కరించవలసిన బాధ్యత జాతీయ రహాదారుల సంస్థ(నేషనల్ హైవే అథారిటి ఆఫ్ ఇండియా ) పై ఉన్నది.చెన్నై నుండి కలకత్తా మధ్యలో,విజయవాడతో పోల్చినప్పుడు చాలాతక్కువ ట్రాఫిక్‌ ఉన్న పట్టణాలకు,కొన్ని పల్లెటూళ్ళకు సైతం జాతీయ రహాదారుల సంస్థరింగ్‌ రోడ్డులను నిర్మించింది.కాని రెండు జాతీయ రహాదారుల కూడలిగా ఉండి, ట్రాఫిక్‌ సమస్య విపరీతంగా ఉన్న విజయవాడ నగరానికి మాత్రం రిండ్‌ రోడ్డును నిర్మించలేదు.విజయవాడ నగరానికి రింగ్‌ రోడ్డును నిర్మించి ఉన్నట్లైతే ఈ సమస్య చాలావరకు పరిష్కారమయ్యేది.

09. జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ను నిర్మించవలసింది జాతీయ రహాదారుల సంస్థ . అది జరిగితే అటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు నగరపాలక సంస్థకు ఆర్ధిక భారం తప్పుతుంది. నగర ప్రయోజనం నెరవేరుతుంది.
పైవన్నీ 19.02.2010న జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఏకాభిప్రాయంగా వచ్చిన అభిప్రాయాలు.గతంలో విజయవాడ నగరంలో ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండా పోలీస్‌ కంట్రోల్‌ రూంనుండి వినాయకుని గుడివరకు 16 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్లైఓవర్‌ నిర్మించారు.కాని అది ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించక పోగా కొన్ని చోట్ల ట్రాఫిక్‌ సమస్యకు అదే కారణమవుతున్నది. ఇప్పుడు నిర్మించబోయే ప్లైఓవర్‌ అంతకంటే ముఖ్యమైనది.అందువలననే ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దానికోసవేు ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని జరిపాము.ఏవిధంగా చూచినా బెంజి సర్కిల్‌ వద్ద జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ నిర్మించడవేు నగర ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారమని అందరూ అభిప్రాయపడ్డారు.

నగర ప్రజల అభిప్రాయాన్ని ,నగర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని మహాత్మా గాంధీ రోడ్డుకు బదులుగా స్క్యూ బ్రిడ్జి నుండి బెంజి సర్కిల్‌ మీదుగా హోల్త్‌ యూనివర్శిటీవరకు 5వనెంబరు జాతీయ రహాదారిపై ప్లైఓవర్‌ను నిర్మించడానికి తగిన చర్యలు చేపట్టవలసినదిగా కోరుతున్నాము.
                                     అభివందనాతో
(వి. సాంబిరెడ్డి)                                          (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                                        కార్యదర్శి  

తేదీ: 22.02.2010










Thursday 29 July 2010

" Convert the Urban Development in to Bussiness" World Bank

నగరాభివృద్ధి ప్లాన్‌లను బిజినెస్‌ అభివృద్ధి ప్లాన్‌లుగా మార్చండి 
స్థానిక సంస్థలకు ప్రపంచ బ్యాంకు హుకుం

కేంద్రప్రభుత్వందేశంలో63నగరాలు,పట్టణాల్లోచేపట్టినజవహర్‌లాల్‌నెహ్రూపట్టణపునర్నిర్మాణపథకం(జె.ఎన్‌.ఎన్‌. యు.ఆర్‌.ఎం) కు ప్రపంచబ్యాంకు నుంచి 60వేల కోట్ల రుణం తీసుకోవాలని కేంద్రం నిర్ణయించింది.ఈ మేరకు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యు.పి.ఎ-2 ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో ఇప్పటికే ఒక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రపంచబ్యాంకు మొదటి విడతగా వందకోట్ల డాలర్ల రుణం ఇస్తుంది.

ప్రస్తుతం అమలులో ఉన్నజెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం కాలపరిమితి మరో రెండేళ్ళలో ముగియనుంది.2005డిసెంబర్‌ నుండి ఇప్పటి వరకు దీని కింద దేశంలో 63నగరాల్లో రు.1.20లక్షల విలువగల ప్రాజెక్టులను ఆమోదించారు. జెఎన్‌యుఆర్‌ఎంకు కేటాయించిన నిధులు అయిపోయాయి  కాబట్టి ప్రపంచబ్యాంకు రుణం అవసర మయిందని కేంద్రం చెబుతోంది.

ప్రపంచబ్యాంకు రుణంతో జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం 'ప్లస్‌'అనే పేరుతో ఈ పథకాన్ని ఇకనుండి నడపబోతున్నారు. ఇది రెండోదశ. రుణం ఇచ్చే ముందు ఇప్పటివరకు పథకం అమలు తీరు, సంస్కరణలు, బడ్జెట్‌లు, అకౌంట్సు, ఆడిట్స్‌, ఇ-గవర్నెన్స్‌, పన్నుల వసూళ్ళు,ప్రైవేటీకరణ అమలు వివిధరంగాల్లో ఎలా ఉన్నది తదితర అంశాలను ప్రపంచబ్యాంకు బృందం సమీక్షిస్తోంది.దేశంలో పూర్తి స్థాయిలో జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం ప్రాజెక్టులు, సంస్కరణలు చేపట్టిన 23 నగరాలను అది పరిశీలిస్తున్నది. దీనిలో భాగంగా మన రాష్ట్రంలోని విశాఖ, హైదరాబాద్‌ నగరాల్లో ఈ బృందం ఇటీవలే పర్యటించింది.ఇప్పటికే చేపట్టిన పనులు,సంస్కరణల అమలు తీరు గురించి అడిగి తెలుసుకుంది.వివిధ శాఖల పనితీరు,వాటిల్లో ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యం ఎలా ఉందో కూడా పరిశీలించింది. షరతులతో కూడిన రుణాలను తరువాత మంజూరు చేస్తుంది.

రాష్ట్రంలో జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం పథకం కింద ఉన్న హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ నగరాలు ప్రపంచ బ్యాంకు  రుణం కోసం ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించాయి. విశాఖ నగరపాలక సంస్థ6,700కోట్లు,విజయవాడ నగరపాలక సంస్థ 3,300 కోట్లు, హైదరాబాద్‌ నగరపాలక సంస్థ 9వేల కోట్లతో ఇందుకు సంబంధించిన సవివరమైన నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాయి.

జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం అమలు తీరును ఒకసారి పరిశీలిద్దాం.వీటి నిధులతో పట్టణాలు,నగరాల్లో మౌలిక సదుపాయాలను బ్రహ్మాండంగా మెరుగుపరచినట్లు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది.మురికివాడల అభివృద్ధి,మాలిక వసతుల కల్పన, ఇల్లులేని పేదలకు ఇల్లు కల్పిస్తున్నట్లు ఊదరగొడుతున్నది.ఆఖరికి ప్రధానమంత్రి కూడా జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం నిధులతో దేశంలోని ఉన్న నగరాలు వరల్డ్‌క్లాస్‌ సిటీలుగా మారబోతున్నాయని చెబుతు న్నారు.ఇక స్థానిక అధికార పార్టీ నాయకులు ఈ పథకం ద్వారా నిధులు వరదలా వచ్చేస్తున్నాయని చెప్పని రోజంటూ లేదు.గడచిన 5ఏళ్ళలో ఈ పథకం ద్వారా మంజూరైన వివిధ ప్రాజెక్టు పనులను పరిశీలిస్తే ఈ ప్రచారానికి, క్షేత్రస్థాయిలో భౌతిక వాస్తవ పరిస్థితికి పొంతనే లేదు.

2005 నుండి 2010 జూన్‌ నాటికి జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం పథకంలో మౌలికసదుపాయాల మిషన్‌ కింద 58,029 కోట్లు విలువగలిగిన 515ప్రాజెక్టులు మంజూరయ్యాయి. అలాగే పట్టణపేదల ప్రాథమిక సేవలు (బి.ఎస్‌.యు.పి), సమీకృత  మురికి వాడల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణ పథకం (ఐ.హెచ్‌.ఎస్‌.బి.పి) రెండింటి కింద 35,088 కోట్ల విలువ గల అభివృద్ధి పనులను ఆమోదించారు.వీటిల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కిింద (పిపిపి)15శాతం నిధులతో 68 ప్రాజెక్టులు చేపట్టారు.
ఈ అయిదేళ్ళలో బి.ఎస్‌.యు.పి.,ఐ.హెచ్‌.ఎస్‌.డి.పి కింద కింద 15లక్షల 25వేల ఇళ్ళు మంజూరు చేయగా వీటిలో ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభించినది 7లక్షల85వేల ఇళ్లు మాత్రమే.ఇప్పటివరకు వాటిలో సగం కూడా పూర్తి కాలేదు. ఈ నిర్మాణాలు కూడా నగరాలకు సూదూర ప్రాంతాల్లో చేపట్టడం వల్ల పేదలకు అంతగా ఉపయోగం లేకుండా పోతున్నాయి.విశాఖపట్నంలో లక్షా35వేలు, విజయవాడలో లక్షా 20వేలు,హైదరాబాద్‌లో 3.5లక్షల మంది లబ్ధిదారులను గుర్తించారు. నిర్మిస్తున్న ఇళ్లను సర్వే ద్వారా గుర్తించిన వారికి ఇవ్వడానికి బదులు ఇప్పటికే రైల్వే, ఇతరప్రభుత్వ స్థలాల్లోనూ, కొండలమీద, కాలువగట్ల పక్కన, గెడ్డల పక్కన ఉన్న ఇళ్ళను కూల్చి వారికి కేటాయిస్తున్నారు. బి.ఆర్‌.టి.యస్‌ రోడ్ల వెడల్పు వల్ల ఇళ్లు, షాపులు, స్థలాలు కోల్పోయిన వారికి కూడా వీటినే కట్టబెడుతున్నారు. ఇల్లులేని పట్టణ పేదలకు జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం లో స్థానమే లేకుండాపోయింది.

ఈ పథకం ఎవరి ప్రయోజనాల కోసమో తెలుసుకునేందుకు ఒక చిన్న ఉదాహరణ. ఆర్థ్ధిక సంక్షోభం వల్ల దేశంలోని ఆటో, మోటారు కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాయనే పేరుతో కేంద్ర ప్రభుత్వం వాటికి ప్రత్యేక ఆర్థ్ధిక ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకుగాను జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం 15 వేల బస్సులు కొనుగోలు చేస్తామని అశోక్‌, టాటా, స్వరాజ్‌,ఇచ్చార్‌, మహేంద్ర అండ్‌ మహేంద్ర, హిందుస్థాన్‌ మోటార్‌ సంస్థలకి హామీ ఇచ్చింది.ఇందుకోసం సుమారు రు.25వేలకోట్లు ఖర్చు చేస్తున్నది.ఇప్పటికే దేశంలో ప్రధాన నగారాల్లో జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం సింబల్‌తో  బస్సులు వచ్చాయి.ఈ అయిదేళ్లలో 63నగరాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులకు విడుదల చేసింది ఎంతో తెలుసా?జూన్‌ నాటికి 20,121కోట్లు మాత్రమే.దీనిని బట్టి ఈ పథకం అసలు ఉద్దేశమేమిటో మనం అర్థ్ధం చేసుకోవచ్చు.ఈ పథకం ద్వారా ఇచ్చే నిధులు సంస్కరణలతో ముడిపడినవి.గడచిన అయిదేళ్ళల్లో రాష్ట్ర,నగర స్థాయిల్లో కొన్ని సంస్కరణలు చేపట్టారు.1978లో రూపొందించిన పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టాన్ని రద్దుచేశారు. దీంతో పట్టణ ప్రాంతాల్లో భూ కేంద్రీకరణ పెరిగిపోయింది.దీనికి అనుబంధంగానే స్టాంప్‌డ్యూటీని 12శాతం నుండి 8శాతానికి తగ్గించారు. వాస్తవంగా 5శాతానికి తగ్గించాలని షరతు. కొన్ని రాష్ట్రాలు 5 శాతానికి తగ్గించాయి. దీనివల్ల నగరపాలక సంస్థలకు స్టాంపుడ్యూటీ ద్వారా వస్తున్న ఆదాయానికి భారీగా గండిపడింది.ఆస్తిపన్ను మదింపు పద్ధ్దతి విస్తీర్ణాన్ని బట్టి కాక ''యూనిట్‌ విలువ''ఆధారంగా విధించే పద్ధ్దతికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసు కుంటున్నది.దీని అమలు నివేదికకై ఇప్పటికే హైదరాబద్‌లోని ఆర్థ్ధిక -సామాజిక అధ్యయనాల కేంద్రం (సెస్‌)కి బాధ్యత అప్పజెప్పింది.

ప్రపంచబ్యాంకు షరతుల అమల్లో భాగంగానే ఇంటిపన్ను,నీటిచార్జీలను పెంచారు.అనేక నగరాల్లో కొళాయిలకు మీటర్లు బిగించారు. వీధి కొళాయిలు తొలగిస్తున్నారు. ''డస్ట్‌బిన్‌ ఫ్రీ సిటీ'' పేర డస్ట్‌బిన్‌లను తొలగిస్తున్నారు. ప్రతి ఇంటి నుండి చెత్త తీసుకెళ్ళినందుకు చార్జీలు వసూలు చేస్తున్నారు. పారిశుధ్య రంగాన్ని ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టారు. భూగర్భ డ్రైనేజీకి యూజర్‌ చార్జీల వసూలు ప్రారంభించారు. నగరాలను పార్కింగ్‌ ఫీజులమయం చేశారు. బి.ఆర్‌.టి.యస్‌ రోడ్లు పూర్తయితే యూజర్‌ చార్జీలు ప్రవేశపెడతామని ప్రకటించారు.ఇంకా అనేక పన్నులు, యూజర్‌ చార్జీల విధింపుకు ఉద్యుక్తులౌతున్నారు.మూడవ,నాలుగో విడత నిధుల కోసం ప్రపంచబ్యాంకు షరతుల్ని  మరింత జోరుగా అమలు చేయనున్నది.

జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం పథకంవల్ల నగరాల అభివృద్ధి కన్నా అవినీతి విచ్చలవిడిగా పెరిగింది. పాలక పార్టీలు, అధికారులు, కాంట్రాక్టర్ల అక్రమ సంపాదనకు రాజమార్గంగా మారింది. ప్రాజెక్టుల వ్యయాన్ని అధికంగా చూపించటం, తమకిష్టమొచ్చిన వారికి ప్రాజెక్టులు అప్పజెప్పటం ఇందులో ప్రత్యేకత.ప్రతిదానికి సర్వేలపేర ప్రైవేట్‌ సంస్థలకి కాసులవర్షం కురిపిస్తున్నది.ప్రజల అవసరాలకన్నా లాభాలు అధికంగా వచ్చే పనులకే అధిక ప్రాధాన్యత లభిస్తున్నది.

రెండోదశ జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం ప్లస్‌ పథకం కఠినమైన షరతులతో కూడినది.ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టే పనులన్నీ ప్రభుత్వ-ప్రైవేట్‌ భాగస్వామ్యం (పిపిపి)తో చేపట్టాల్సి ఉంటుంది.నీటి సరఫరా,భూగర్భడ్రైనేజీ, బిఆర్‌టిఎస్‌, ఏదైనప్పటికీ అన్నీ పిపిపి కిందే చేపట్టాలి.రాబోయే ప్రాజెక్టులే కాదు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వాటిని కూడా పిపిపి కిందకి మార్చాలని ప్రపంచబ్యాంకు వత్తిడితెస్తుంది.ప్రస్తుతం జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకంలో మంజూరయ్యే ప్రాజెక్టులకు కేంద్రం 50శాతం,రాష్ట్రం 20శాతం మిగిలిన 30శాతం స్థానిక సంస్థలు భరించాలి.ప్రపంచబ్యాంకు స్థానిక సంస్థలు భరించాల్సిన 30శాతం మ్యాచింగ్‌ గ్రాంటును ప్రైవేట్‌ సంస్థ్ధల నుండి అంటే పిపిపి ద్వారా భర్తీచేసుకోవాలని సూచిస్తున్నది.ఇది ఒక నిబంధనగా ఇప్పుడు ముందుకు రాబోతున్నది.

ఇప్పుడే జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథóకంలో చేపట్టిన ప్రాజెక్టులకు మ్యాచింగ్‌ గ్రాంట్స్‌ సమకూర్చుకోలేక అనేక నగరాలు అప్పుల ఊబిలో కూరుకు పోతున్నాయి.విద్యా,ఆరోగ్య,మురికివాడల అభివృద్ధి,పేదల సంక్షేమం వంటి వాటికి నిధులు కేటాయించలేక పోతున్నాయి.విశాఖపట్నం నగరపాలక సంస్థ మ్యాచింగ్‌ గ్రాంట్‌ కోసం 100కోట్లు మున్సిపల్‌ బాండ్లు సేకరించింది.ఇవి ఏ మూలకు  రాలేదు.ప్రస్తుతం బ్యాంకుల నుండి 200కోట్ల రుణం తీసుకో వటానికి ఒప్పందాలు చేసుకుంది.విజయవాడ నగరపాలక సంస్థ కూడా 100కోట్ల హడ్కో రుణం కోసం ఆస్తులను తాకట్టుపెట్టింది.హైదరాబాద్‌ నగరపాలక సంస్థ్ధ కూడా ఇదే దారిలో ఉంది.మొత్తంగా జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం పథకం నగరాలను అప్పుల ఊబిలోకి దించింది.ప్రపంచబ్యాంకు నిధులతో చేపట్టబోయే పనులకు మరిన్ని అప్పులు చేయాల్సివస్తుంది.ప్రపంచబ్యాంకు లక్ష్యమే ఇది.అందుకే ప్రతిప్రాజెక్ట్‌ వ్యయంలో కనీసంగా 15శాతం అప్పు చెయ్యొచ్చని సలహా ఇచ్చింది.ఈ విధంగా నగరపాలక వ్యవహారాల్లో ప్రపంచబ్యాంకు ప్రత్యక్ష జోక్యం చేసుకో బోతున్నది.ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం.పౌర సౌకర్యాలు,సంక్షేమం కుదింపు,సేవలకు వెలకట్టడం, పన్నుల వడ్డింపు,యూజర్‌చార్జీలు,ఫీజుల పెంపు వంటి చర్యలతో ప్రజలపై ఎనలేని భారాన్ని మోపుతాయి.రెండోదశలో ప్రపంచబ్యాంకు రుణంతో అమలు చేయబోతున్న ఈ జె.ఎన్‌.ఎన్‌.యు.ఆర్‌.ఎం ప్లస్‌ పథకం నగర, పట్టణ పరిపాలన,తదితర విభాగాలపై ప్రభుత్వ,స్థానిక సంస్థల అజమాయిషీకి బదులు ప్రైవేటు సంస్థల పెత్తనం పెరుగుతుంది.నగరాభివృద్ధి ప్లాన్‌లను బిజినెస్‌ అభివృద్ధి ప్లాన్‌లుగా మార్చాలన్న ప్రపంచబ్యాంకు ఆదేశంలో ఆంతర్యమిదే!

Thursday 22 July 2010

Necessity of Public Lands for Democratic process

ప్రభుత్వ ఖాళీ స్థలాలు హరించడమంటే ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే 
       మనిషి సంఘ జీవి.మనిషి జీవించాలంటే అనివార్యంగా ఇతరులతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి.ఇతర మానవులతో సంబంధాలు లేకుండా ఏ మనిషి జీవించలేడు.ఇతర మానవులతో సంబంధాలు కలిగి ఉండాలంటే వారిమధ్య సమచారం ఇచ్చి పుచ్చుకోవడం తప్పనిసరి. ఈ సమాజం ఎలా నడవాలి అన్న విషయం మీద, అలాగే సమాజంలోని వివిధ విషయాల మీద చర్చ జరుగుతుంది. విషయాలను అధ్యయనం చేసిన వారు, తాము అధ్యనం చేసిన విషయాలను పది మందికీ చెప్పాలనుకుంటారు. అలాగే విషయాలపై పది మందితో చర్చించాలనుకుంటారు. అలా చెప్పుకోవడం లేదా చర్చించు కోవడం కోసం పది మంది ఒకచోట కలవడాన్నే సభ లేక సమావేశం అంటాము. అందువలన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం మానవ హక్కు.మానవ సమాజ హక్కు.
       సభలు, సమావేశాలు జరగాలంటే స్థలం కావాలి. స్థలం లేకుండా సభలు, సమావేశాలు జరగవు. కనుక సభలు, సమావేశాలకోసం స్థలం ఏర్పాటు చేసుకోవడం సమాజ అవసరం.సభలు,సమావేశాల ద్వారా పరస్పర అవగాహన కల్పించు కోవడాన్ని, చర్చించి నిర్ణయాలు తీసుకోవడాన్ని ప్రజాతంత్ర పద్ధతి అంటాము.కనుక సభలు,సమావేశాలు నిర్వహించడం, వాటికి కావలసిన స్థలాన్ని పొందటం ప్రజలకున్న ప్రజాతంత్ర హక్కు.ఈ ప్రజాతంత్ర హక్కును  మన విజయవాడ నగర పాలక సంస్థ కాలరాస్తున్నది.అదెలాగో చూద్దాం.
       ఎన్నోబహిరంగసభలకు,ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన స్వరాజ్యమైదానం కాల గర్భంలో కుంచించుక పోయింది.కొంత భాగాన్ని రైతు బజారు ఆక్రమించింది.మరి కొంత భాగాన్ని ఫైర్ స్టేషన్ ఆక్రమించింది.ఇలా సగభాగం ఆక్రమణలకు గురైంది.ఇక మిగిలిన సగభాగంలోమాత్రమేసభలు,సమావేశాలుజరుపుకునేఅవకాశముంది.పైకి  అవకాశమున్నట్లుకనుపిస్తున్నా,వాస్తవానికి  ఆ అవకాశం అందరికీ అందుబాటులో లేదు.కారణమేమంటే ప్రభుత్వం ఇచ్చే ప్రతిసేవకూ,ప్రతిదానికి పూర్తి ధరను వశూలు చేయాలని ప్రపంచ బ్యాంకు మన ప్రభుత్వాలనాదేశించింది.ఫ్రజాప్రయోజనాలను ఫణంగా పెట్టి,మనప్రభుత్వాలు ఆ ఆదేశాలకు తలొగ్గాయి.దాని ఫలితంగానే స్వరాజ్య మైదానానికి కూడా రేటు నిర్ణయించారు.పూర్తి ధరను వశూలు చేయాలన్న ఆదేశానుసారం స్వరాజ్య మైదానానికిఅద్దెను రోజుకు రు.50,000లుగా నిర్ణయించారు.అంటే ఒకరోజు బహిరంగసభ నిర్వహించాలంటే రు.50,౦౦౦ లను మనం ఇరిగేషన్ డిపార్టుమెంటుకు చెల్లించాలన్నమాట. మా నగరంలో ఉన్న ఈ స్థలం మానగర ప్రజల ప్రజాతంత్ర అవసరాలకు అందుబాటులో ఉండాలని,దీనికి ఎటువంటి చార్జీలు వశూలు చేయరాదని,మన విజయవాడ నగర పాలక సంస్థ కనీసం ఒక తీర్మానం కూడా చేయలేకపోయింది.
       ఇక జింఖానా గ్రౌండ్స్ విషయం.ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోనే ఉన్నది. అయినప్పటికీ దీని అద్దె కూడా ఎక్కువే. ఇందులో సభలు,సమావేశాలు జరపాలన్నా వేల రూపాయలు చెల్లించవలశిందే.
       పాత బస్ స్టాండ్ స్థలాన్ని ఒక మంచి పార్కుగా ఏర్పాటు చేయడం ద్వారా నగర ప్రజలు ఒకచోట చేరి ముచ్చటించుకునే కూడలిగా ఏర్పాటు చేయవచ్చు.బహిరంగ కార్యక్రమాలకు సభాస్థలిగా తయారు చేయవచ్చు.కాని దానిని ఆర్.టీ.సీ. వారు అంబికా గ్రూపుకు అప్పగించేశారు.వారు షాపింగ్ మాల్ కడతారట.దీనివలన అంబికా గ్రూపు వారికి లాభం తప్ప,మన నగర ప్రజలకేమి ఒరుగుతుంది?నగరప్రజలప్రజాతంత్ర హక్కును కాపాడటం కన్న అంబికా గ్రూపు వారి లాభాలే మన పాలకులకు ముఖ్యమైనాయి. మన విజయవాడ నగర పాలక సంస్థ,మా నగర ప్రజల ప్రజతంత్ర అవసరాలకు ఇది అవసరమని ఒక్క మాటకూడా మాట్లాడలేక పోయింది.
     స్వరాజ్య మైదానినికి ఎదురుగా, ఇరిగేషన్ డిపార్ట్ మెంటుకు చెందిన కెనాల్ గెస్ట్ హౌస్ ఊండేది. ఇప్పుడాస్థలాన్ని లైలా గ్రూపు సంస్థలకు ఇచ్చారు. వారు అక్కడ ఒక మల్టీప్లెక్స్ ధియేటర్ నిర్మిస్తున్నారు. ధియేటర్ నిర్మించేది లాభాలు సంపాదించుకోవడానికి. లాభాలు పొందాలనుకునేవారు స్థలం కొని కట్టుకుంటారు.నగర ప్రజల ప్రయోజనాలను గాలికి వదలి,ప్రభుత్వ స్థలాలను ప్రైవేటువారి లాభాలకోసం ఇవ్వ వలసిన అవసరమేముంది? దీనిని చిన్నపాటి సభాస్థలిగా ఎందుకు మార్చకూడదు?
        ఇలాంటి స్థలాలు నగరంలో చిన్నవి పెద్దవి అనేకమున్నాయి. బృందావన కాలనీలో, ఏ.పి.ఐ.ఐ.సి. కాలనీలో ఉన్న స్థలాలను వివిధ పేర్లతో ప్రైవేటు వారికి అప్పగిస్తూ నగరపాలక సంస్థ కౌన్సిల్లో తీర్మానాలు చేశారు.
       గతంలో పాఠశాలలకున్న ఖళీ స్థలాలలో చిన్నచిన్న సభలు, సమావేశాలు  జరుగుతూ ఉండేవి. ఇప్పుడు వాటి అద్దెలుకూడా రు.1000నుండి రు.1500లు చేశారు.కళాక్షేత్రం అద్దె రు 15,000లు.ఇతర మున్సిపల్ కల్యాణ మంటపాల అద్దె రు.10,000లకు పైమాటే.
       ఖాళీ స్థలాలను ప్రైవేటు వారికి ధరాదత్తం చేయడం, ఉన్న స్థలాలు, కళ్యాణ మంటపాల అద్దెలను భారీగా పెంచడం మూలంగా,ధనవంతులు తప్ప సామాన్యులు సభలు,సమావేశాలు జరుపుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఇది ప్రజస్వామ్యానికి విఘాతం. సభలు, సమావేశాలు ఎంత ఎక్కువగా జరిగితే ఆ సమాజం అంత సజీవంగా ఉంటుంది. సభలు, సమావేశాలు జరగని సమాజం నిస్తేజమౌతుంది. అందువలన సభలు, సమావేశాలు జరగడానికి తగినన్ని స్థలాలు నగరంలో ఉందాలి. ఖాళీ స్థలాలను ప్రైవేటు వారికి ధరాదత్తం చేయడానికి, అద్దెల పెంపుదలకు వ్యతి రేకంగా పోరాడాలి.




Monday 19 July 2010

Necessity of Public Lands for Childrens' welfare

విలువైన భూములను  బడా వ్యాపారులకు ధారాదత్తం చేస్తున్న 
విజయవాడ నగరపాలక సంస్థ
లక్షల సంఖ్యలో ప్రజలు నివసించే ప్రాంతాన్ని నగరం అంటారని మనకు తెలుసు.  లక్షల సంఖ్యలో ప్రజలు నివసిస్తున్నప్పుడు వారు స్వేచ్ఛగా మసలటానికి తగిన ఖాళీ స్థలాలు కావాలి. పిల్లలు ఆడుకోవడానికి, ప్రజలు విశ్రాంతి  తీసుకోవడానికి, ప్రజలు సభలు, సమావేశాలు జరుపుకోవడానికి  ఖాళీ స్థలాలు అవసరం. 
 01 .   పిల్లలు సాయం సమయాలలో , ఖాళీ సమయాలాలో ఖచ్చితంగా ఆటలు  ఆడుకోవాలి.  ఆడటం ద్వారా వారికి శారీరక మానసిక ఎదుగుదల బాగా ఉంటుందని మానసిక శాస్త్ర వేత్తలందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు.ఆచరణలో కూడా అది రుజువైంది.  విద్య ప్రైవేటీకరణ  జరిగిన నేపధ్యంలో పాటశాలలలో క్రీడా స్థలాలు లేవు. గతంలో పాటశాలను ఏర్పాటు చేసేటప్పుడు విధిగా క్రీడా స్థలం ఉండే విధంగా చూసే వారు.ఇప్పుడు అది పోయింది.ఏవిధమైన క్రీడా స్థలాలు లేకుండానే పాటశాలలకు అనుమతులిస్తున్నారు.అపార్టుమెంట్లలో అనేక క్లాసులు నడిపేస్తున్నారు.పిల్లకు క్లాసు రూములు జైలు గదులులాగా తయారయ్యాయి.అందువలన వారు ఆడుకోవడానికి వారి నివాస ప్రాంతాలలో క్రీడా స్థలాలు కావాలి.వారికి క్రీడా స్థలాలను అందుబాటులో ఉంచవలసిన బాధ్యత స్థానిక సంస్థలపై ఉన్నది. కాని మన విజయవాడ నగరపాలక సంస్థ ఉన్న ఖాళీ స్థలాలను కూడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నది తప్ప పిల్లల మానసిక వికాసాన్ని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. విజయవాడ నగరంలో ఉన్న ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం సామాన్యుల పిల్లలకు అందుబాటులో లేదు.ఫీజులు చెల్లించ గలవారి పిల్లలే ఇందులో ఆడుకోగలరు. స్వరాజ్య మైదానం (పీ.డబ్ల్యు గ్రౌండ్) లో ఎప్పుడూ ఏదో  కార్యక్రమాలతో నిండి ఉంటుంది. సింగ్ నగర్ లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియం కొంత మేరకు పిల్లలకు అందుబాటులో ఉన్నది.అదికూడా వామపక్షాలు క్ద్దుకోవడం వలననే ఆమేరకైన పిల్లలకు అందుబాటులో ఉన్నది. 52చ.కి.మీ.కు విస్తరించి ఉన్న నగరంలో ఎక్కడో కొన్ని స్థలాలున్నంత మాత్రాన ప్రతి రోజు పిల్లలు అక్కడకు వెళ్లి ఆడుకోవడం సాధ్యమా? అందుకే క్రీడా స్థలాలు వారి నివాసాలకు దగ్గరలో ఉండాలి. ఇది నగరపాలక సంస్థ బాధ్యత.




Wednesday 14 July 2010

అవసరాలకు మించి భూములు కట్టబెట్టడం ప్రభుత్వానికి రివాజుగా మారింది.

అవసరాలకు మించి కంపెనీలకు భూములు కట్టబెట్టడం ప్రభుత్వానికి రివాజుగా మారింది.ఈ రివాజుకు ప్రజల ప్రతిఘటన రూపమే సోంపేట కాల్పుల ఉదంతం.  శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం గొల్లగండి వద్ధ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటును వ్యతిరేకించిన స్థానిక ప్రజానీకంపై పోలీసులు జరిపిన కాల్పులలో ఇద్దరు చనిపోయారు .ఇంకా అనేక మంది గాయ పడ్డారు.బుధవారం నాటి (14.07 .2010) ఈ అమానుష సంఘటనతో రాష్ట్రంలో ప్రైవేట్‌ రంగంలో థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటు,వాటికి భూములను కట్టబెట్టే ప్రభుత్వ విధానం మరోసారి చర్చనీయాంశమైంది. సోంపేట మండలం గొల్లగండి వద్ద 2,640 మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆ గ్రామం, ఆ చుట్టుపక్కల వున్న పలాసపురం,లక్కవరం తదితర గ్రామాల్లో 920ఎకరాల ప్రభుత్వ భూమితో సహా 1540 ఎకరాల భూములను సేకరించింది. దీంట్లో ప్రభుత్వ భూమిని నామమాత్రపు లీజుకు కంపెనీ తీసుకుంది. గ్రామస్థుల నుంచి లక్షల విలువ చేసే రెండు పంటలు పండే భూములను ఉద్యోగాలు ఎరగా చూపి చౌకగా తీసుకునేందుకు వారి నుంచి అంగీకారం పొందింది. ఉద్యోగాలు, పరిహారం, పునరావాసం, కాలుష్యం తదితర అంశాల్లో ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానం తీసుకోవాలని స్థానిక తెలుగుదేశం ఎమ్మెల్యే,ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి సభ్యులు అభ్యంతరాలు తెలిపినా ఖాతరుచేయ లేదు.ఈ విద్యుత్‌ ప్లాంట్‌ను వ్యతిరేకిస్తూ గత 230 రోజులుగా స్థానికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం కళ్లు తెరవలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే నేడు సోంపేటలో పరిస్థితి కాల్పుల దాకా వెళ్లింది. దీనికంతటికీ కీలకం భూమి. కాబట్టి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి ఎంత భూమి అవసరమో అంతే సేకరించాలి. స్థల ఎంపికలో కూడా జాగ్రత్తవహించాలి. అధికారులచే తప్పుడు నివేదికలు ఇప్పించి రైతులను కానీ,మత్స్యకారులను కానీ రోడ్డున పడేసే పద్ధతి సరికాదు.ఈ భూముల సేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన సమగ్ర విధానం అవసరం.ఒంగోలు సమీపంలో నాలుగువేల మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ధర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి 4000ఎకరాల భూమి (ప్రభుత్వ భూమితో సహా) సేకరించుకునేందుకు ఎలా అనుమతించింది?
           సమీపంలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి గానీ అంత స్థలం అవసరమా? ఇటీవల తమిళనాడులో తూత్తుకుడి జిల్లా ఉదంగూడిలో 800 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 2 యూనిట్లు అంటే 1600 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని తమిళనాడు విద్యుత్‌బోర్డు,భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా నెలకొల్పాయి. అందుకోసం వారు సేకరించిన భూమి 939ఎకరాలు (యాజమాన్య నివేదిక పేజీ 1)అంటే ఒక మెగావాట్‌ విద్యుత్తుకు 0.6ఎకరం కంటే తక్కువ చాలని వారు నిర్ధారించారు.ఆ లెక్కన ఒంగోలు సమీపంలోని విద్యుత్తు ప్రాజెక్టుకు 2,400 ఎకరాలు చాలు. కాని ఇన్నిన్ని ఎకరాల సేకరణకు ఎలా అనుమతించారు? అంటే ఈ విద్యుత్‌ ప్రాజెక్టుల పేరుతో ఈ అదనపు  భూమిని పెద్ద పెద్ద కంపనీలకు  కట్టబెట్టడానికేనన్నది స్పష్టం.
             పరిశ్రమలు స్తాపించాలంటే భూమి అవసరం. అది  ప్రభుత్వరంగమైన, ప్రైవేటు రంగమైన ఒకటే. పరిశ్రమంటూ పెట్టాలంటే భూమి కావలసిందే.అందులో యే సందేహమూ లేదు.కాని భూమిని సేకరించాలంటే  దానికీ ఒక పద్ధతి ఉంది.  అలాంటప్పుడు దీనికి వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమిస్తే దానిని ఎలా తప్పు పట్టగలం?థర్మల్‌స్టేషన్‌ స్థాపన వల్ల లాభనష్టాలేమిటన్న చర్చ కూడా జరుగుతోంది.ఏ రాష్ట్రమైనా, దేశమైనా పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలంటే విద్యుత్తు చాలా కీలకం అనడంలో ఎలాంటి సందేహమూలేదు. మెట్ట ప్రాంతాలలో ధాన్యం పండించడానికి బోరు బావులు, మోటార్లే శరణ్యం. వాటికి కూడా అధిక విద్యుత్తు కావాలి. ఇక గృహావసరాలకు, వాణిజ్యావసరాలకు, ఒకటేమిటి? నిత్య జీవితంలో ప్రతి నిమిషం విద్యుత్తుతోనే ముడిపడి ఉంటుంది. మన దేశంలో బొగ్గు నిల్వలు అపారంగా ఉన్నందున బొగ్గుతో తయారయ్యే థóర్మల్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసే కేంద్రాలు అనివార్యం.అయితే అభివృద్ధి అనే ఫలాన్ని చూపి,పాలకులు ప్రజల ఆర్థిక అంశాలతోనూ, ఆరోగ్యంతోనూ చెలగాటమాడుతున్నారు. దీనిని మనం అంగీకరించరాదు.
                ఇక థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల స్థాపన వల్ల ప్రజల ఆరోగ్యాలకు హాని కలుగుతుందా? థóర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలలో బొగ్గు కార్బన్‌ నిరంతరం మండించడం వల్ల కార్బన్‌డయాక్సైడ్‌ (సిఓ2) వాయువు చాలా పెద్ద మొత్తంలో విడుదలవుతుంది.ఒక అణువు కార్బన్‌ మండేటప్పుడు రెండు అణువుల ఆక్సిజన్‌తో కలిసి ఒక అణువు కార్బన్‌డయాక్సైడ్‌గా మారుతుంది. ఈ ప్రకారం ఉదంకూడిలో 1600 మెగావాట్ల విద్యుత్పత్తికి రోజుకు 18,465 టన్నుల బొగ్గు మండుతున్నదని లెక్కించారు.(యాజమాన్య నివేదిక పేజీ4)అంటే 4000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రోజుకు 46,162 టన్నుల బొగ్గు అవసరం. రోజుకు దానికి 4 రెట్లు, అంటే 1,84,648 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ తయారవుతుంది.థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాలలో విడుదలయ్యే సిఓ2 ప్రపంచమంతా కొద్ది గంటలలో విస్తరిస్తుంది. కొద్ది భాగం మాత్రం అక్కడే కొద్దిసేపు ఉండే అవకాశముంది. ఆ వాయువును నిర్వీర్యం చేయడానికి, విద్యుత్‌ కేంద్రం మొత్తం విస్తీర్ణంలో నాలుగో వంతు భూమిలో, ఎకరానికి 600 చెట్లను నాటితే, అవి సిఓ2ను పీల్చుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తాయనీ, అంతేకాక ఆ చెట్ల కారణంగా ఆ ప్రాంతంలో వేడిమి 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు పడిపోతుందనీ వాతావరణ శాస్త్రజ్ఞులు తెలియజేస్తున్నారు. దీనికి ఉదాహరణ రామగుండం. వేసవిలో ఉష్ణోగ్రతలు అంతకుముందు కంటే 3 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఎక్కువ పెరిగాయి. అప్పుడు విద్యుత్‌ కేంద్ర అధికారులు శాస్త్రీయంగా ఎకరానికి 600 చెట్లు చొప్పున, 25శాతం భూమిలో పెంచడంతో సిఓ2శాతం,అలాగే ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గాయి. ఒంగోలు సమీపంలోని విద్యుత్‌ కేంద్రంలో 25 శాతం భూమిని, అంటే 600 ఎకరాల భూమిని పచ్చదనానికి కేటాయించి, దానిలో ఎకరానికి 600 చెట్లు పెంచితే సిఓ2 సమస్య, అధిక ఉష్ణోగ్రత సమస్య నివారించబడుతుంది. ఇక విద్యుత్‌ ఉత్పత్తి సమయంలో చిమ్నీల నుండి వెలువడే ధూళి, సల్ఫర్‌డయాక్సైడ్‌, నెట్రస్‌ ఆక్సైడ్‌ ఆ సమస్యలను ఆధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రోస్టాటిక్‌ ప్రెసిపిటేటర్లు (ఇఎస్‌పిలు) అమరిస్తే అధిóగమింవచ్చు. ప్రస్తుతానికి ఇవి ఉదంగూడి విద్యుత్‌ కేంద్రం, పాల్వంచలోని కెటిపిస్‌, ఇబ్రహీంపట్నం (కృష్ణాజిల్లా)లోని డా!!నార్ల తాతారావు విజయవాడ ధర్మల్‌ పవర్‌ స్టేషన్లలో వున్నాయి.ఉద్గారాలు పరిమితుల్లో ఉంటే నష్టం వుండదు. పరిమితికి మించితేనే సమస్య. కాబట్టి ఆధునికమైన పరికరాలనమర్చడానికి ప్రైవేటు యాజమాన్యాలపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రతి జిల్లాలో కలెక్టరు నాయకత్వంలో పౌర సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దానికై కర్మాగారాల స్థాపన సమయంలో ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి. అవసరమైతే ఉద్యమించాలి. అలాంటి పౌర సంఘాలు లేకుంటే విషవాయు ఉద్గారాలు విపరీతంగా పెరిగి చర్మవ్యాధులు, శ్వాసకోస వ్యాధులు, చివరకు రకరకాల క్యాన్సర్లు కూడా పెరిగే ప్రమాదముంది.

Saturday 10 July 2010

ప్రతి మనిషికీ ఉండవలసిన లక్షణం

కం!!   వినదగు  నెవ్వరు చెప్పిన  
         వినినంతనే వేగ పడక వివరింప దగున్,
         కని, కల్ల, నిజము తెలిసిన
         మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ!

తా. ముందుగాప్రతివాడు చెప్పేది  వినాలి.చెప్పినదాని మీద ఆధారపడి తొందర పాటుగా నిర్ణయాలు చేయకూడదు. చెప్పిన విషయాన్ని వివరంగా పరిశీలించాలి. అందులో నిజమేమిటో,అబద్ధ మేమిటో తెలుసుకోవాలి.అలా తెలుసు కొని నిర్ణయాలు   చేసే మనిషే ఈ భూమిమీద నీతిపరుడవుతాడు.

      అంటే మనం వాస్తవాల మీద ఆధారపడి నిర్ణయాలకు రావాలి. ఊహల మీద ఆధార పడి, చెప్పుడు మాటల మీద ఆధారపడి  నిర్ణయాలకు రాకూడదు.విషయాల గతిని,తార్కికంగా పరిశీలించాలి.అప్పుడే నిజా నిజాలు మనకు గోచరిస్తాయి.విషయాల చలనాన్ని పరిశీలిస్తూ, వాస్తవాల మీద ఆధార పడి నిర్ణయాలకు రావడాన్నే గతి తార్కిక పధ్ధతి అంటాము.  దీనినే భౌతిక వాదం అని  కూడా  అంటారు.భౌతికవాదిగా ఉండే మనిషి ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటాడు.అర్ధం చేసుకొని మసులుకుంటాడు.ఈ ప్రపంచం లోని విషయాలను మార్చడానికి ప్రయత్నిస్తాడు. అతడే జ్ఞాని. అతడే విజ్ఞుడు.

      జ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది  మొదటిది ప్రకృతికి సంబంధించిన జ్ఞానం.రెండవది సమాజానికి సంబంధించిన జ్ఞానం.ఈ రెండూ తప్ప మరో రకమైన జ్ఞానం లేదు.మనం చెప్పుకునే అన్ని రకాల జ్ఞానాలు  ఈ రెండు జ్ఞానలకే లోబడి ఉంటాయి. గతి తార్కిక పరిశీలన మీద ఆధారపడి  విశ్వ విజ్ఞానాన్ని,సమాజ విజ్ఞాన్ని పొందినవాడే విజ్ఞుడు,  ప్రాజ్ఞుడు అవుతాడు.
    


Wednesday 7 July 2010

Components of Petrol Price-Burdening Taxes

Dear Readers,
Government of India deregulated the Petrol and diesel prices by hiking the prices on 25.06.2010. Retail Petrol Price comprise of 8 components Let me analyse Petrol price at Vijayawada after hiking on 25.06.2010

Basic Price.................... ...Rs 23.00
Central Excise Duty..........Rs 14.35 (Central Govt Tax fixed in Budget)
Education cess................. Rs 00.43 (Central Govt Tax- 3% on Rs 14.35)
Crude oil Customs Duty... Rs 01.15 (Central Govt Tax- 5% on Basic Price)
Custums Duty on Petrol... Rs 01.73 (Central Govt Tax- 7.5% on Basic Price)
VAT............................  .. .. Rs 07.59 (A.P State Govt Tax- 33% on Basic Price)
Dealer Commission ....  .. ..Rs 01.05
Trasportation Charges .... ..Rs 07.03
Total...........................    ......Rs 56.33

Value Added Tax (VAT), and Transportation Charges vary from State to state So we see different prices in different places in the Country. Here what we have to observe is that the Cetral Government is collecting taxes Rs 17.66 (76.78% on Basic Price) on 1 ltr petrole while Andhra Pradesh State Government is collecting Rs 7.59 ( 33% on Basic Price) with a total of Rs 25.25 ( 109.78% on Basic Price). Actual Petrole Cost is Rs 23.00, Taxes on it are Rs 25.25. So, Petrole Prices are becoming burden to people not beacuse of increase in Crud oil Prices but because of these huge taxes only.

Subsidies - A myth
In Real terms Government is not giving subsidy to the people on petroleum products. The Central Government collected in the form of Taxes of Rs 58,789Crs in 2002-2003, Rs 62,875Crs in 2003-2004, Rs 70,051Crs in 2004-2005, Rs 76,085Crs in 2005-2006, Rs 85,839Crs in 2006-2007, Rs 96,486 Crs in 2007-2008 ,Rs 84,298 Crs in 2008-2009, Rs 71,768Crs in 2009-10(as per written statement made by Namo Narayan Meena state minister for finance in Rajyasabha on 03.08.10) and Rs 1,20,000 Crs in 2010-2011(Budget Estimates)on petroleum products only. At the same time,the Government allotted to the petroleum Sector including subsidies Rs 57,535 Crs in 2008-2009, Rs 58,120 Crs in 2009-10( out of wich only Rs 28,789 crs towards Subsidies) , and Rs 69,495 Crs in 2010-2011. Out of huge amounts collected in the form of taxes on petroleum products from people,small amounts are given as subsidies. So it is wrong that the Government is subsiding more and the oil companies are getting losses due to these subsidies. Subsidies are declared by the Government. So Government is bound to repay the amount of subsidies to the oil companies, Unfortunately the Government is collecting taxes and is not paying the subsidy amounts to oil companies. Despite all these things, Public Sector Oil companies are getting profits, For example in 2008-2009, IOC got the net profit of Rs 2,950 Crs. In 2009-10, it got Rs 10,998 Crs and the total of its reserves Rs 49,472 Crs. These are Audited figures. The other oil companies HPC, BPC are in same line of Profits. So the propaganda that the oil companies are getting losses is false.
Now the Government is talking of under recoveries. it is advocated that due to these subsidies, public sector oil companies are making under recoveries. Under recovery does not mean that they are making losses. Under recovery means the difference of income between the amount assumed profit and acutal profit. Assumed profit means the profit they could earn if all the subsidies were removed and deregulated. So it ie evident that under recovery is not loss. The Government has taken this move to abolish the subsidies to the people in the name of losses/under recoveries. So that, the Private oil companies Like Reliance, Essar can freely market their products, so to say they can freely rob the people.
Let us awake. Let us join our hands to fight till the the removal of the taxes are achieved.

M.V.Anjaneyulu
Secretary,
Tax Payers' Association
Vijayawada
email: veeranjaneyulumatcha@gmail.com