Tuesday 25 December 2012

బి.ఆర్‌ టి.యస్‌ ప్రయోజనకరంగా వినియోగించడానికి సూచనలు

                                                                    తేదీ 11.12.2012
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,
ఆర్యా,
విషయం: బి.ఆర్‌ టి.యస్‌ ప్రయోజనకరంగా వినియోగించడానికి సూచనలు

విజయవాడ నగరంలో బి.ఆర్‌.టి.యస్‌ (Bus Rapid Transit System (BRTS) వ్యవస్థను ఏర్పాటు చేసారు. దీనికోసం సుమారు 3 కి.మీ. రోడ్డు ప్రత్యేకంగా నిర్మించారు. మొత్తం బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు 15.5 కి.మీ. అందులో కొర్పొరేషన్‌ నిర్మించిన రోడ్డు 3 కి.మీ. మిగిలిన 12 కి.మీ.లు కారల్‌ మార్క్స్‌ రోడ్డు(ఏలూరు రోడ్డు), జాతీయ రహదారి (రింగ్‌ రోడ్డు), బందరు రోడ్డు (మహాత్మా గాంధీ రోడ్డు) లను వినియోగించబోతున్నారు. అవి కార్పొరేషన్‌కు సంబంధించిన రోడ్లు కావు. కనుక ఈ మొత్తం 15 కి.మీలలో సుమారు 12 కి.మీ.లు బి.ఆర్‌.టి.యస్‌ బస్సు సాధారణ రోడ్లపై నడవవవలసిందే. ఇది నగర ప్రజలకు అంత ప్రయోజనకరం కాదు. అంతే కాకుండా ఢిల్లీ లాంటి నగరాలలో ఈ వ్యవస్థ అంతగా ఉపయోగ పడలేదు. ఏ వ్యవస్థ అయినా నగర ప్రజలకు ప్రయోజనకరంగా ఉండాలి. ఇప్పటికే దీనిపై రు|| 80 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. ఇంత భారీ మొత్తంలో వెచ్చించిన తరువాత దాని ప్రయోజనం కూడా అదే స్థాయిలో ఉండాలి. అందువలన ఈ వ్యవస్థ నగర ప్రజలకు చేరువ అవటానికి, నగర ప్రజల నేటి అవసరాలతో బాటుగా భవిష్యత్‌ అవసరాలను కూడా సమర్ధవంతంగా తీర్చడానికి టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా కొన్ని సూచనలు చేయదలిచాము.

నగరాలలో వేగవంతమైన పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టు వ్యవస్థను ఏర్పాటు చేయటం. సిటీ బస్సులను నిరాటంకంగా, వేగంగా నడపటం ఈ వ్యవస్థ ఉద్దేశ్యమని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆనాటి కేంద్ర పట్టణాభివృధ్ధి శాఖామాత్యులు గౌెరవనీయులు శ్రీ జైపాల్‌ రెడ్డిగారు విజయవాడ నగరానికి వచ్చినసందర్భంగా స్పష్టంచేశారు. ఈ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ప్రస్తుతం మీరు ప్రారంభించబోతున్న బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థలో ఈ క్రింది లోపాలున్నాయి.

లోపాలు
1.బి.ఆర్‌.టి.యస్‌ బస్సు రోడ్డు అంచున కాకుండా, రోడ్డు మధ్యలో ఉన్న సెంటర్‌ డివైడర్‌కు ఇరువైపులా నిర్మించిన డివైడర్ల మధ్యన తిరగటంవలన ఈ వ్యవస్థలో ప్రజలకు అవసరమైన చోటల్లా బస్‌ స్టాప్‌లు నిర్మించుకునే అవకాశంలేదు. రోడ్ల కూడళ్ల వద్ద మాత్రమే బస్‌ స్టాప్‌ను నిర్మించాలి. ఈ బస్సు ఎక్కాలంటే రోడ్ల కూడళ్ల వరకు పోయి, జీబ్రా గీతల మీదుగా దాటి, బి.ఆర్‌.టి.యస్‌ బస్‌ స్టాప్‌లోకి ప్రవేశించాలి. దిగేటప్పుడు కూడా అదే పరిస్థితి. రోడ్ల కూడళ్ళలో దిగి, జీబ్రా గీతల మీదుగా దాటి, రోడ్టు అంచుకు చేరాలి. అందువలన ప్రజలకు అవసరమైన చోట బస్‌ స్టాప్‌లు ఏర్పాటు చేసే అవకాశం లేదు.

2. బి.ఆర్‌.టి.యస్‌ బస్సు ఒక సర్కులర్‌ బస్సులాగా కేవలం ఆ నిర్ణీత మార్గంలోనే తిరుగుతుంది. నివాస ప్రాంతాలనుండి బి.ఆర్‌.టి.యస్‌ బస్సు బయలు దేరే అవకాశం లేదు. నివాస ప్రాంతాల నుండి ప్రజలను ఎక్కించుకోని వేగంగా వారివారి గమ్యస్థానాలకు చేరవేయటం చాలా అవసరం. ఇదే పబ్లిక్‌ ట్రాన్స్‌ పోర్టు వ్యవస్థలో కీలకం. బస్సులను కేవలం బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డులోనే వేగంగా త్రిప్పటం వలన ఇది నెరవేరదు.

3.ప్రస్తుతమున్న బి.ఆర్‌.టి.యస్‌ ప్లాను ప్రకారం బి.ఆర్‌.టి.యస్‌ లేన్‌లో బి.ఆర్‌.టి.యస్‌ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు మాత్రమే తిరుగుతాయి. వీటి చార్జీలు అధికంగా ఉంటాయి. ఢిల్లీ నగరంలో 19 కి.మీ.లు ఉన్న బి.ఆర్‌.టి.యస్‌ మార్గంలో బస్సు చార్జీ రు|| 35లవరకు ఉంది. ఇదే మామూలు బస్సులో (పల్లె వెలుగు) విజయవాడ బస్‌ స్టాండ్‌ నుండి కొండపల్లి రైల్వే స్టేషన్‌ వరకు (20 కి.మీ) చార్జీ రు|| 9/-లుగా ఉన్నది. అత్యధిక చార్జీలు సాధారణ ప్రజలు భరించ గలిగినవి కావు.

4.ఈ బస్సులో విద్యార్ధులకు, వికలాంగులకు రాయితీలు వర్తించవు. వర్తింప జేసినా అవి సాధారణ బస్సు చార్జీలతో సమానంగా కాని, అంతకన్నా ఎక్కువగాని ఉంటాయి. నెలవారీ జనరల్‌ పాస్‌ ధరకూడా అత్యధికంగా ఉంటుంది. పైగా కూడళ్ళలో తప్ప బస్సులు ఆగనందున ఈ పాస్‌లు ఇచ్చినా ప్రయోజనం ఉండదు.

5.నగరాలలో ధనవంతులు కార్లు అధికంగా కొంటున్నారని. దీనివలన ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతుందని, ఈ సమస్యను పరిష్కరించాలంటే ఎ.సి. బస్సులను త్రిప్పటంవలన, ధనవంతులు ఆ బస్సులు ఎక్కుతారని,కార్లు కొనటం తగ్గిపోతుందని వాదన వినిపించారు. ఇంతకంటే హాస్యాస్పదమైన వాదన ఇంకొకటి లేదు. కారు కొనదలుచుకున్న వారెవ్వరూ ఎక్కడో ఆగే బస్సుల కోసం ఎదుచూస్తూ నిలబడరు. కారు తన గమ్య స్థానం వరకూ తీసుకెళుతుంది. అదేవిధంగా ద్విచక్ర మోటారు వాహనాలు కూడా వారివారి గమ్యస్థానాలవరకు నేరుగా చేర్చుతారు. అందువలననే ప్రజలు వ్యక్తిగత వాహనాలు కొంటున్నారు. బి.ఆర్‌.టి.యస్‌ బస్సు తన గమ్య స్థానం వరకు వెళ్ళదు. ఢిల్లీ లాంటి నగరాలలో కూడా ఇప్పటికిే నిర్మించిన బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డులో ధనవంతులు కార్లు వదలి బి.ఆర్‌.టి.యస్‌ బస్సులో ప్రయాణం చేస్తున్న దాఖలాలులేవు. కేవలం ఒక రూట్లో వేగవంతమైన బస్సులు త్రిప్పినంత మాత్రాన ప్రజలు వ్యక్తిగత వాహనాలను కొనకుండా మానరు. నగరం మొత్తంలో అన్ని ప్రాంతాలనుండి అన్ని ప్రాంతాలకు బస్‌ నెట్‌వర్కును ఏర్పాటుచేయటం, బస్‌లు ప్రజలకనుకూలంగా సమయపాలన పాటించడం ద్వారానే వ్యక్తిగత వాహనాల కొనుగోళ్ళను తగ్గించవచ్చు.

ఈ లోపాలను అధిగ మిస్తూ బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకోవటానికి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నాము.
01. బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డుకు రెండు వైపుల ఫుట్‌ పాత్‌లను నిర్మించాలి. వాటిని ఆక్రమణలకు గురికాకుండా పాద చారులు నిరాటంకంగా నడవటానికి వీలుగా ఏర్పాటు చేయాలి. పాదచారులు ఎక్కడ పడితే అక్కడ ఫుట్‌ పాత్‌ దిగకుండా రైలింగ్‌ ఏర్పాటు చేయాలి.
02. జంక్షన్‌ వద్ద బస్‌ స్టాప్‌లు కాకుండా ప్రజలకు అవసరమైన ప్రతి చోట ఫుట్‌ పాత్‌ల వైపు బస్‌ స్టాప్‌లను నిర్మించాలి.
03. బి.ఆర్‌.టి.యస్‌ బస్సు నడిచేటందుకు వీలుగా ప్రత్యేకమైన లేన్‌ను ఫుట్‌ పాత్‌ల వైపు డివైడర్‌ ద్వారా ఏర్పాటు చేయాలి.
04. అలా ఏర్పాటు చేసిన బి.ఆర్‌.టి.యస్‌ బస్‌ లేన్‌ లోకి మరే ఇతర వాహనాన్ని అనుమతించరాదు. మరే ఇతర వాహనమైనా ఆలేన్‌ లోకి వస్తే వాటిపై తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలి.
05. బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డులో అందరికీ అందు బాటులో ఉండేవిధంగా సాధారణ సిటీ బస్సులను మాత్రమే త్రిప్పాలి.
06 ఇతర ట్రాఫిక్‌ మొత్తం బి.ఆర్‌.టి.యస్‌ డివైడర్‌కు, సెంట్రల్‌ డివైడర్‌కు మధ్య వెళ్ళాలి.
07. ఎడమవైపునుండి కుడివైపుకు, కుడివైపునుండి ఎడమ వైపుకు ప్రయాణీకులు వెళ్ళటానికి రోడ్డు క్రింద సబ్‌ వేలు నిర్మించాలి.
దీని నమూనా డ్రాయింగ్‌ను చివరి పేజీలో ఇస్తున్నాము.

ఈ విధంగా బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థను రూపొందిస్తే ఈ క్రింది ప్రయోజనాలు చేకూరుతాయి.

01.నగర ప్రజలకు వేగవంతమైన ప్రజారవాణా వ్యవస్థ లభిస్తుంది.
02.100 అడుగులు, 80 అడుగులు వెడల్పుగల ప్రతి రోడ్డ్లులో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు.
03.బి.ఆర్‌.టి.యస్‌ కోసం ప్రత్యేకమైన బస్సులను కొననవసరంలేదు. సాధారణ సిటీ బస్సులనే వేగంగా నిరాటంకంగా ఈ లేన్‌లలో త్రిప్పవచ్చు. దీనివలన అదనపు బస్సులు కొనే ఖర్చు తగ్గుతుంది.
04. బి.ఆర్‌.టి.యస్‌ లేన్‌నుండి నగరంలోని నివాస ప్రాంతాలలోకిి కూడా బస్‌ను త్రిప్పవచ్చు. నివాస ప్రాంతంలో ప్రజలను ఎక్కించుకొని బయలు దేరిన బస్సు బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డు వద్దకు రాగానే బి.ఆర్‌.టి.యస్‌ లేన్‌లోకి ప్రవేశించి వేగంగా వెళుతుంది. తిరిగి నివాస ప్రాంతంలోకి వెళ్ళాలంటే బి.ఆర్‌.టి.యస్‌ రోడ్డునుండి ఇతర ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా నివాస ప్రాంతాలవైపుకు మళ్ళుతుంది.

అందువలన విజయవాడలో బి.ఆర్‌.టి.యస్‌ వ్యవస్థను పైవిధంగా మార్పు చేయాలని కోరుతున్నాము.


                         అభివందనాలతో

(వి. సాంబిరెడ్డి)                                  (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                         కార్యదర్శి

డి&ఓ ట్రేడ్‌ లైసెన్స్‌ పై యూజర్‌ చార్జీల విధింపుకు అభ్యంతరములు తెలియజేస్తూ మునిసిపల్ కమిషనర్ కు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్రాశిన లేఖ

                                                                 తేదీ 27.11.2012
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి,
ఆర్యా,
విషయం: డి&ఓ ట్రేడ్‌ లైసెన్స్‌ పై యూజర్‌ చార్జీల విధింపుపై అభ్యంతరములు

మీరు వ్యాపార సంస్థలకు డి&ఓ ట్రేడ్‌ లైసెన్స్‌పై యూజర్‌ చార్జీలను విధించి ఉన్నారు. సదరు వ్యాపార సంస్థలవారు కొన్ని అభ్యంతములు మీ ముందుంచినారు. వాటికి మీకార్యాలయం 19.10.2012 తేదీతో RCF9-144147 నెంబరుగల ఎండార్సుమెంట్‌ ద్వారా జవాబును పంపియున్నారు. సదరుఎండార్సుమెంట్‌ లో మీ కార్యాలయం పేర్కొన్న అంశాలపై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా కొన్ని విషయాలను మీ ముందుంచుతున్నాము.

01. మీ కార్యాలయం వ్రాశిన సదరు ఎండార్సుమెంట్‌ లో ''నగర ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు పారిశుధ్ధ్యముపై ప్రత్యేక దృష్టితో ప్రతి దినము మురుగు కాల్వలు శుభ్ర పరచుట , రోడ్లు ఊడ్చుట, ప్రధాన ప్రాంతములలో 24 గంటలు శానిటేషన్‌ నిర్వహించుట, ప్రతి ఇల్లు మరియు వ్యాపార సంస్థల వారి వద్ద నుండి స్వయముగా పబ్లిక్‌ హెల్త్‌ వర్కర్‌ల ద్వారా చెత్తను సేకరించుట జరుగుచున్నది. చెత్త సేకరించువారికి వృత్తిపరమైన రక్షణ చర్యలతో బాటు, పరిశుభ్రమైన పరిస్థితులలో వ్యర్ధములను సేకరించుట, తరలించుట సురక్షిత విధానములో డిస్పోజ్‌ చేయు ప్రక్రియలు నిర్దేశిత నిబంధనలమేర అమలు చేయవలసిన ఆవశ్యకత కలదు'' అని పేర్కొనియున్నారు. ఇది Solid Waste Management Rules మరియు GHMC Act 1955 ప్రకారం నగరంలో శానిటేషన్‌ నిర్వహించ వలసిన పధ్ధతిని తెలియ జేస్తున్నది. ఇందులో ప్రత్యేకత ఏదీలేదు. నగరంలో పబ్లిక్‌ హెల్త్‌ను కాపాడవలసిన బాధ్యత కార్పొరేషన్‌కు ఉన్నది. దానికి ఎటువంటి పధ్ధతులనవలంబించాలన్నది కార్పొరేషన్‌ మరియు అర్బన్‌ మంత్రిత్వ శాఖలలోని నిపుణులు నిర్ణయించే అంశాలు. దీనికీ, మీరు విధిస్తున్న యూజర్‌ చార్జీలకు సంబంధంలేదు. కార్పొరేషన్‌ నిర్వహణలో శానిటేషన్‌ ఒక భాగం. కార్పొరేషన్‌ నిర్వహణకు కావలసిన ఆదాయ మార్గాలుకూడా GHMC Act 1955లో ఇవ్వబడినవి.Solid Waste Management Rules  లోగాని, GHMC Act 1955 లోగాని ఎక్కడా శానిటేషన్‌కు యూజర్‌ చార్జీలు విధించమని పేర్కొనలేదు. కనుక కార్పొరేషన్‌గా చట్టప్రకారం నిర్వహించవలసిన బాధ్యతను నిర్వహించడానికి, చట్టపరిధిలో లేని యూజర్‌ చార్జీలను ప్రజలనుండి వసూలు చేయటం సరైంది కాదని తెలియ జేస్తున్నాము.

02. వ్యర్థపదార్ధముల యాజమాన్య విధానము (Solid Waste Management Rules)నందు, ఆవ్యర్ధాల ఉత్పత్తికి కారణమైనవారు, ఆవ్యర్థ పదార్ధముల తొలగింపునకు అగు ఖర్చు భరించవలసియుండునని సదరుఎండార్సుమెంట్‌లో పేర్కొన్నారు. వ్యర్థపదార్ధముల యాజమాన్య విధానము(Solid Waste Management Rules) అనునది వ్యర్థపదార్ధములను నశింపజేయుటకు ఉద్దేశించిన విధానమును నిర్దేశించినదేతప్ప, ఆర్థిక వ్యవహారాలను నిర్ధేశించలేదు(Solid Waste Management Rules deal with only the procedural aspect of the disposal of Solid Waste, but do not deal with financial aspect).. కనుక వ్యర్థపదార్ధముల యాజమాన్య విధానము(Solid Waste Management Rules)  ప్రకారము యూజర్‌ చార్జీలను వసూలు చేయుట చట్టవిరుధ్ధమని తెలియ జేయుచున్నాము.

03.వ్యాపార సంస్థల నుండి ఉత్పత్తి అగు చెత్త (Trade Refuse) తొలగింపునకు మరల ప్రత్యేకముగా వసూలు చేయరాదని శ్రీయుత ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టువారు Laxmi Lodge, Warangal and others vs Government of AP and another (2002 (6) ALD 605- W.P. NO 20789/1998)  కేసులో తీర్పు వెల్లడించిన విషయం మీదృష్టికి తీసుక వస్తున్నాము. ఈ తీర్పును కూడా మీరు పరిశీలించవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా GHMC Act 1955 ప్రకారం వ్యాపార సంస్థలనుండి ఉత్పత్తి అగు చెత్తను (Trade Refuse) కూడా తొలగించవలసిన బాధ్యత కార్పొరేషన్‌దేనన్న విషయం మీకు తెలియందికాదు.

04. జీ.వో ఆర్‌టి నెంబర్‌ 973 తేదీ 21.08.2010 అనేది ప్రభుత్వం జారీ చేసిన చట్ట బధ్ద ఉత్తర్వులని మీరు ఆ ఎండార్సుమెంట్‌ లో పేర్కొన్నారు. అది చట్టవిరుధ్ధమని మేము భావిస్తున్నాము. అది చట్టబధ్ధమా లేక చట్ట విరుధ్ధమాయన్న విషయాన్ని తేల్చవలసింది న్యాయస్థానము మాత్రమే. అందువలననే ఈ వివాదాన్ని నెం.33550/2011గా గల రిట్‌ పిటీషన్‌ ద్వారా శ్రీఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు వారిముందు ఉంచిన విషయం మీకు తెలుసు. ఈ రిట్‌ పిటీషన్‌ శ్రీ హైకోర్టు వారి వద్ద పెండింగులో ఉన్నది. ఆ వివాదం పరిష్కారమయ్యేవరకు వేచిచూడకుండా, సదరు జీ.వో చట్టబధ్దమేనన్న వాదనను సమర్ధించుకుంటూ యూజర్‌ చార్జీలను విధించుకుంటూ కొన సాగుతున్నారు. వివాదం కోర్టు పరిధిలో ఉండగా మీరు కొనసాగించడం సరైందికాదు. కనుక కోర్టువారి తీర్పు వెలువడేవరకు ఈ జీ.వో అమలును నిలిపి వేయాలని కోరుతున్నాము.

పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని కోర్టు తీర్పు వెలువడే వరకు యూజర్‌ చార్జీలను వసూలును నిలిపి వేయవలసినదిగా కోరుతున్నాము.
అభివందనాలతో

(వి. సాంబిరెడ్డి)                                            (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                                             కార్యదర్శి

Sunday 8 April 2012

కృష్ణానదిపై 4 లైన్ల రోడ్డు బ్రిడ్జిని నిర్మించాలని కోరుతూ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, వివిధ రాజకీయ పార్టీలకు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్రాసిన లేఖ

                                                                 తేదీ:16.03.2012
గౌరవనీయులైన కృష్ణా జిల్లా కలెక్టరు గారికి,
ఆర్యా!
విషయం:- కృష్ణ నదిపై 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణాన్ని గురించిన ప్రతిపాదన

     విజయవాడ నగరం నానాటికి పెరుగుతున్నది. దీనితో విజయవాడ నగరానికి బయటి ప్రాంతాలనుండి వచ్చిపోయే వారి సంఖ్యకూడా పెరుగుతున్నది. కృష్ణానదికి దక్షిణం వైపున మంగళగిరి, అమరావతి మధ్యలో అనేక గ్రామాలున్నాయి. వీరిలో అత్యధికులు ప్రతి రోజు విజయవాడ ఏదో ఒక పనిమీద వచ్చి పోతుంటారు. ముఖ్యంగా సీతానగరం, తాడేపల్లి, ఉండవల్లి, ప్రకాశ్‌ నగర్‌, డోలాస్‌ నగర్‌, అంబటినగర్‌, రామానగర్‌, శ్రీనగర్‌,ఎర్రుబాలెం, పెనుమాక, నవులూరు, కృష్ణాయపాలెం తదితర గ్రామాలనుండి ప్రతి రోజు విజయవాడ వచ్చి పనులు చేసుకొని పోతుంటారు. వీరిలో అత్యధికులకు నివాసం ఆగ్రామాలలో ఉంటే, ఉపాధి మాత్రం విజయవాడలో ఉంటుంది.అందువలన వీరు అనివార్యంగా విజయవాడ రావలసియున్నది.

       తంలో ఈ గ్రామాలనుండి ప్రకాశం బ్యారేజిమీదుగా అత్యధికంగా బస్సులు ఉండేవి. అవి ఆప్రాంత ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉండేవి. ఆతరువాత ప్రకాశం బ్యారేజిమీద బస్సుల రాక పోకలను నిలిపి వేశారు. దీనితో ఆప్రాంత ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. కేవలం మంగళగిరినుండి మాత్రమే కనక దుర్గమ్మ వారధి మీదుగా బస్సులు రావటానికి వీలుంది. కాని సీతానగరం, తాడేపల్లి, ఉండవల్లి, ప్రకాశ్‌ నగర్‌, డోలాస్‌ నగర్‌, అంబటినగర్‌, రామానగర్‌, శ్రీనగర్‌, నవులూరు,ఎర్రుబాలెం,పెనుమాక, కృష్ణాయపాలెం, అమరావతి తదితర గ్రామాలనుండి నేరుగా విజయవాడకు బస్సులు రావటానికి మార్గం లేదు. ఒకటి రెండు బస్సులు మాత్రం ఉండవల్లి సెంటరునుండి కాలువ కట్టమీదుగా, రైలు పట్ల్టాల క్రిందుగా తిరిగి జాతీయ రహదారిలో కలసి కనక దుర్గమ్మ వారధి మీదుగా విజయవాడకు రావలసి వస్తున్నది. ఇది చుట్టు తిరుగుడు ప్రయాణంగా ఉండటం, సమయం అధికంగా తీసుకోవటం, సౌకర్యంగా లేకపోవటంతో ప్రజలు ఆటోలను ఆశ్రయించవలసి వస్తున్నది. కొంతమంది ఆ గ్రామాలలో ఉన్న తమ ఇళ్లను వదలి విజయవాడలో అద్దెకు ఇళ్ళు తీసుకొని నివశిస్తున్నారు. విజయవాడ వచ్చి పోవటానికి సరౖౖెన రహదారిలేక పోవటం వలననే ఆ ప్రాంతాల ప్రజలు ఇలాంటి ఇబ్బందులకు గురి కావలసి వస్తున్నది.

      నగరానికైనా ఇతర ప్రాంతాలనుండి ప్రజలు నిరంతరం వచ్చి పోతుంటేనే ఆ నగరం అభివృధ్ధి చెందుతుంది. కనుక ప్రజలు నగరానికి వచ్చి పోవటానికి తగిన రహదారి ఏర్పాటు చేయవలసి ఉన్నది. అంతే కాకుండా విజయవాడ నగరం గన్నవరం, కంకిపాడుల వైపుమాత్రమే విస్తరిస్తున్నది. కాని దక్షిణం వైపు విస్తరించడానికి కృష్ణానది అడ్డుగా ఉన్నది. నగరం దక్షిణం వైపుకూడా విస్తరించాలంటే నదికి దక్షిణం ప్రాంతంలోని గ్రామాలను విజయవాడ నగరంతో అనుసంధానం చేస్తూ రహదారి ఏర్పాటు చేయాలి. ఆ ప్రాంతాలనుండి సత్వర రవాణా సౌకర్యం ఏర్పాటు చేయాలి.

       అంతే కాకుండా విజయవాడ, గుంటూరు ప్రధాన నగరాలుగా ఉన్నాయి. కృష్ణా,గుంటూరు జిల్లాలను కలుపుతూ కృష్ణా నదిపై ఈ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రిడ్జి లేదు. ఉన్న కనకదుర్గమ్మ వారధి జాతీయ రహదారులకు చెందినది. జాతీయ రహదారి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల అవసరాలకు అనుగుణంగా అది ఉపయోగించుకునే అవకాశంలేదు. కనుక ఈ ప్రాంతంలో కృష్ణా నదిపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన బ్రిడ్జి అవసరం ఉంది.

  పైవిషయాలను దృష్టిలో ఉంచుకొని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా ఒక ప్రతిపాదనను మీ ముందుంచుతున్నాము. కృష్ణా నదికి దక్షిణం వైపున ఉన్న సీతానగరం నుండి, నదికి ఉత్తరం వైపున ఉన్న శనైశ్వరస్వామి గుడివరకు కృష్ణానదిపై 4 లైన్ల బ్రిడ్జిని నిర్మిస్తే నదికి దక్షిణం వైపు ఉన్న గ్రామాల నుండి రాక పోకలు సజావుగా సాగుతాయి. బస్సు సౌకర్యం ఏర్పడుతుంది. రాక పోకలు సజావుగా సాగితే ఆగ్రామాల ప్రజలు విజయవాడకు నివాసం మార్చే అవసరం ఉండదు. విజయవాడ నగరం దక్షిణం వైపుకు కూడా విస్తరించడానికి ఈ బ్రిడ్జి దోహద పడుతుంది. కనుక కనుక మా ప్రతిపాదనను పరిశీలించవలసిందిగా కోరుతున్నాము. కృష్ణానదిపై 4 లైన్ల బ్రిడ్జిని నిర్మించడానికి తగిన చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాము.
                             అభివందనాలతో

 వి. సాంబిరెడ్డి                                      యం.వి.ఆంజనేయులు 
అధ్యక్షులు                                                 కార్యదర్శి

టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌ ఈ బ్రిడ్జి విషయమై క్రింది వారికి లేఖలను వ్రాశింది.
కృష్ణా జిల్లా
01. కలెక్టర్‌, కృష్ణా జిల్లా
02. మున్సిపల్‌ కమీషనర్‌, విజయవాడ
03. వైస్‌ ఛైర్మెన్‌, వి.జి.టి.యం. ఉడా
04. శ్రీ లగడపాటి రాజగోపాల్‌, యం.పి. విజయవాడ
05. శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్‌, శాసన సభ్యులు, విజయవాడ పశ్చిమం.
06. శ్రీ మల్లాది విష్ణు, శాసన సభ్యులు, విజయవాడ సెంట్రల్‌.
07. శ్రీ యలమంచిలి రవి, శాసన సభ్యులు, విజయవాడ తూర్పు.
08. కాంగ్రెస్‌ (ఐ) పార్టీ, విజయవాడ
09. తెలుగు దేశం పార్టీ, విజయవాడ
10. సి.పి.ఐ., విజయవాడ
11. సి.పి.ఐ(యం), విజయవాడ
12. లోక్‌ సత్తా పార్టీ, విజయవాడ

గుంటూరు జిల్లా
01. కలెక్టర్‌, గుంటూరు జిల్లా
02. మున్సిపల్‌ కమీషనర్‌, తాడేపల్లి
03. మున్సిపల్‌ కమీషనర్‌,మంగళగిరి   
04. శ్రీ రాయపాటి సాంబశివరావు, ఎం.పి. గుంటూరు
05. శ్రీమతి కె.కమల, శాసన సభ్యురాలు, మంగళగిరి.


Wednesday 18 January 2012

కాళేశ్వరరావు మార్కెట్టును తాకట్టు పెట్ట వద్దని మున్సిపల్ అధికారులకు టాక్స్ పెయర్స్ అసోసియేషన్ వ్రాసిన లేఖ

Date :16.01.2012
To
The Special Officer of Vijayawada Municipal Corporation
and District Collector, Krishna Dt.
Camp: Vijayawada

Dear Sir,
Reg:  Kaleswararao Market in Vijayawada- Mortgage Issue

            We came across in the news papers that Vijayawada Municipal Corporation has decided to mortgage Kaleswararao Market to Corporation Bank in order to get the Loan. As Tax Payers’ Association, we tender our objection to mortgage the Public Assets for the following reasons.
01. Vijayawada Municipal Corporation (VMC) has opted for mortgage of Kaleswararao Market, a public Asset, in order to get the loan sanctioned from Corporation Bank to meet the expenses of Corporation in general and that of Corporation Share to JNNURM Projects undertaken in City in particular. In this connection we bring to your kind notice that the Amounts which are due to come to VMC have not been coming. We like to enumerate hereunder the amounts which are due to come to VMC from Government of Andhra Pradesh.
a)   Amounts to come as per the State Finance Commission (SFC) Recommendations- Rs 1130.11 Cr if allocated as per recommendations of 1st SFC or Rs 707.10Cr if allocated as per recommendations of 2nd SFC from 2005-2006 to 2010-2011
b)   95% of Profession tax collected in the city: As per commercial tax Department, the total amount of profession tax collected in the city from 2005-2006 to 2010-2011 is Rs 68.84cr. Out of that amount, 95% i.e., Rs 65.40 cr have to come to VMC.
c)   10% of the Motor vehicle tax collected in the Vijayawada City has to come to VMC. As per The Dy Transport Department statistics, Motor Vehicle Tax Collected in the city from 2005-2006 to 2010-2011 is Rs 804.07cr. Out of this amount, Rs 80.41cr have to come to VMC.
The total amount of above all would be Rs 1275.92 cr if allocated as per 1st SFC, or Rs 852.91 cr if allocated as per 2nd SFC.     
Unfortunately, the actual amount released by Government of Andhra Pradesh  under All heads of Accounts to VMC from 2005-2006 to 2010-2011 is as meager as Rs 32.84 cr.  Surprising thing is that the Government of Andhra Pradesh released nothing as per the SFC recommendation during the said period. This is the main reason that VMC is suffering the financial crunch.
Here it shall be pertinent to mention that the very purpose of the constitution of SFC under Article 243Y of Constitution of India is to make recommendations as to the distribution between the State and the Municipalities of the net proceeds of the taxes, duties, tolls and fees leviable by the State, which may be divided between them under this Part and the allocation between the Municipalities at all levels of their respective shares of such proceeds; the determination of the taxes, duties, tolls and fees which may be assigned to, or appropriated by, the Municipalities; and the grants-in-aid to the Municipalities from the Consolidated Fund of the State.
But the Government of Andhra Pradesh has been paying no heed to the recommendations of SFC,particularly in respect of allocation of its share from tax and nontax revenues to Local Bodies. People are paying the Taxes to the State Government for the purpose of development of state. Development of State includes the Development of the living standards/ living conditions of the people. Living conditions of the people include availability of protected water, good sanitation, road facilities, lighting facilities, parks, parking facilities, facilities to cater to the cultural needs, creation of play grounds, health, education facilities etc… People are living in Panchayaths, Municipalities and Municipal Corporations. Development of Living conditions of the people shall be looked after by Local Bodies as they are immediate administrative agencies of the State Government existing close to the inhabited areas.   Development of State Government can not be expected without the Development of Living conditions of the people. It is the bounden duty of the state Government to develop the state including the development of Living conditions of the people by expending the money collected in the form of Taxes and non taxes. So the State Government should allocate the funds from the amounts of Taxes and non taxes collected to the Local Bodies. Unfortunately, the Government is not doing so. Instead, these amounts which are to be allocated and released to Local Bodies are diverted to some other purposes. Consequently, local Bodies are made subject to starvation of Funds even for their routine expenses. VMC is also, it appears, not making any effort to get these funds from state Government.
02.  There are other options to VMC to get its resources augmented.
a)   Collecting Taxes from Tax Defaulters: VMC is not taking measures to collect the taxes from tax defaulters for years together. As per the VMC, the defaulted amount including interest thereon of top 100 property tax defaulters as on 27.04.2011 was Rs 18,93,65,507.05 . These are the dues to the Corporation for the years together. VMC is not initiating any action against such defaulters. It is unfortunate that the responsible organizations and many Government offices are also not paying the property tax years together. If proper measures are taken to collect the taxes properly in the descending order, VMC will get more income. 

b)   Arrest of Financial mismanagement:  CAG report disclosed how VMC has been mismanaging the Funds, wasting the public money and losing the income due to negligence. If VMC takes measures to arrest such wastages, shows prudence in expending public money and take care in managing funds VMC will save more of public money which will be useful for another works.

c)   Tax Payers’ Association suggested many other ways in its  letter dated 14.2.2011 addressed to Special Officer of VMC and presented to  the Commissioner in the meeting conducted by VMC to take opinions on the occasion of Municipal Budget for F.Y. 2011-2012
03. Leaving all the above narrated ways to get income, VMC has been resorting either to mortgage the properties to get the loans or to impose the financial burdens on tax payers in the name of user charges or hike in taxes. By now, some valuable properties like Vastralatha and I.V.Palace have been mortgaged to HUDCO to get loan. Some properties have been handing over to private parties in the name of PPP. Now the turn comes to Kaleswararao Market. Once the loan is raised, that has to be repaid with interest by VMC. It would be another burden on VMC. Had the Government of Andhra Pradesh given the counter guarantee for obtaining loan from any financial Institution, the necessity for mortgaging public properties would not have arisen. As the Government stopped giving counter guarantee, VMC is compelled to have recourse to mortgage.  Given the attitude of the Government, there is no guarantee that the Government will not raise the occasion to save the VMC from the mire of debt. Then VMC will be compelled to pass the burden on to the people. The ultimate sufferers will be the people of Vijayawada. VMC has been gradually moving towards bankruptcy not because of the people of Vijayawada. Because of the non-release of funds as a share from state taxes and of the amounts due to VMC under the head of assigned revenues, this crisis comes to VMC.
            Keeping in view all the above narrated things, Tax payers’ Association has been opposing the mortgage of VMC properties. We request your goodselves to look in to matter once again and refrain from mortgaging Kaleswararao Market.  In stead, we request you to consider the ways we suggested to augment the revenue of VMC.
            At the same time we request you to convey to the State Government our demand that the Government of Andhra Pradesh should release the funds due to come to VMC forthwith.
                                Thanking You 
                               Yours truly,   
                                                      
V.Sambi Reddy                                             M.V.Anjaneyulu
   President                                                       Secretary