Friday 8 November 2013

టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ చెప్పింది నిజం


రాష్ట్రంలో 2012 నాటికి మున్సిపాలిటీలు, మున్సిప‌ల్ కార్సొరేష‌న్‌లు క‌లిసి 130 ఉన్నాయి.  మొద‌టి రాష్ట్ర   ఫైనాన్స్ క‌మీష‌న్ సిఫార్సుల ప్ర‌కారం రాష్ట్ర ప్ర‌భుత్వం స్థానిక సంస్థ‌ల‌కు నిధులు కేటాయించి ఉన్న‌ట్ల‌యితే  2005-2006 నుండి 2012-2013 వ‌ర‌కు రు. 44,227.71 కోట్లు ఈ 130 ప‌ట్ట‌ణాల‌కు న‌గ‌రాల‌కు వ‌చ్చుండేవి. అదే 2 వ  రాష్ట్ర   ఫైనాన్స్ క‌మీష‌న్ సిఫార్సుల ప్ర‌కారం  కేటాయించి ఉన్న‌ట్ల‌యితే రు.27,672.76 కోట్లు వ‌చ్చుండేవి. కాని రాష్ట్ర ప్ర‌భుత్వం ఈ 130 ప‌ట్ట‌ణాల‌కు న‌గ‌రాల‌కు వాస్త‌వంగా విడుద‌ల చేసింది  కేవ‌లం రు. 215.22 కోట్లు మాత్ర‌మే.
 మ‌రి ఈ డ‌బ్బంతా ఏమైంది?   రాష్ట్రంలోని 129 ప‌ట్ట‌ణాల‌ను బ‌లిపెట్టి ఆ ఒక్క హైద‌రాబాద్ మీద‌నే ఖ‌ర్చు చేసి అభివృధ్ధి చేశారు.  ఈవిష‌యాన్ని టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ స్ప‌ష్టం చేస్తూ వ‌స్తున్న‌ది. ఇప్పుడ‌ది ఋజువైంది. ఎలా ఋజువైందో 08.11.2013 న ప‌త్రిక‌ల‌లో వ‌చ్చిన ఈ క్రింది వార్త‌ల‌ను చూడండి.
                                      ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
   రాష్ట్ర విభజన నేపథ్యంలో హైద్రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం ద్వారానే ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేసినట్లవుతుందని సీమాం ధ్ర మంత్రులు కేంద్రానికి వివరిస్తున్నారు. హైద్రాబాద్‌ను యుటిగా మారిస్తే విభజనకు ఏ విధమైన అడ్డంకులూ ఉండబోవని హామీ ఇస్తున్నారు. ఈమేరకు జీఓంలో సభ్యులుగా ఉన్న కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, చిదంబరంతో కాంగ్రెస్‌ సీమాంధ్ర కేంద్ర మంత్రులు గురువారమిక్కడ సమావేశమయ్యారు.   కేంద్ర మంత్రులు కావూరు సాంబశివరావు, చిరంజీవి, పురంధేశ్వరి, జెడి శీలం తొలుత మొయిలీతోను, తర్వాత చిదంబరంతోనూ విడివిడిగా సమావేశమయ్యారు. మొయిలీతో భేటీ అనంతరం మంత్రి జెడి శీలం విలేకరులతో మాట్లాడుతూ...తెలుగు ప్రజలు ప్రాంతాలుగా విడిపోయినా, ప్రజలుగా కలిసి ఉండాలన్నదే తమ అభిమతమని వ్యాఖ్యానించడం గమనార్హం. ' విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాలకూ న్యాయం చేయాలని మొయిలీని కోరాం. ముఖ్యంగా హైద్రాబాద్‌ నగర భవితవ్యం, నదీజలాల పంపకంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశాం. గత నలభై ఏళ్లుగా తెలుగు ప్రజలందరూ కలిసి హైద్రాబాద్‌ను అభి వృద్ధి చేశారు. గత ఎనిమిదేళ్లలో హైద‌రాబాద్  నగర అభివృద్ధి కోసం 55 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. దేశంలోనే ఎక్కడా లేని విధంగా 280 కి.మీ రింగురోడ్డు ఏర్పరిచాం. 456 ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వాటి అనుబంధ సంస్థలూ నగరంలో ఉన్నాయి. ఫలితంగా ఇటీవలి కాలంలో అదనంగా 35 లక్షల మంది సీమాంధ్రులు కొత్తగా నగరానికి వచ్చారు. అందువల్లే నియోజకవర్గాల పునర్విభజనలో సీమాంధ్రలో 12 అసెంబ్లీ సీట్లు తగ్గగా, హైద్రాబాద్‌లో 10 సీట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే హైద్రాబాద్‌ అందరిదీ అన్న భరోసా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం ' అని శీలం వివరించారు.


                                    ఆంధ్ర‌జ్యోతి-న్యూఢిల్లీ, నవంబర్ 7 :
 సీమాంధ్ర కేంద్ర మంత్రు లు కుండబద్దలు కొట్టారు. నిన్నటివరకు సమైక్యవాణి వినిపించగా నేడు విడిపోయి కలిసుందామని పిలుపునిచ్చారు. విభజన సమస్యల పరిష్కారంపై స్పష్టత ఇస్తే ప్రజలను శాంతపరుస్తామని జీవోఎంకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథార్టీ (హెచ్ఎండీఏ) పరిధిని కేంద్రపాలిత ప్రాంతం చేయాలని కోరారు. ఈ మేరకు గురువారం జీవోఎం సభ్యులు చిదంబరం, వీరప్ప మొయిలీని కావూరు సాంబశివరావు, చిరంజీవి, జేడీ శీలం, పురందేశ్వరి కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
సీమాంధ్ర కేంద్ర మంత్రుల ప్రధాన డిమాండ్లు..

-రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 40 ఏళ్లలో ఏ నగరాన్నీ అభివృద్ధి చేయలేదు. ఈ ఎనిమిదేళ్లలోనే హైద‌రాబాద్ లో  రూ.50 వేల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించారు. 280 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్‌గల హైదరాబాద్‌వంటి నగరాలు ప్రపంచంలో మరో నాలుగు మాత్రమే. అదే జాతీయంగా అయితే హైదరాబాద్ ఒక్కటే. ఇక్కడ పేరొందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు 456 ఉన్నాయి. ప్రపంచంలోని 150 దేశాలకు మందులు పంపే ఫార్మా కంపెనీలున్నాయి. దీంతో హైదరాబాద్ అందరిదీ అని ప్రజలు భావిస్తున్నారు. తెలంగాణకు ఈ నగరాన్ని ఇచ్చేస్తే మిగతావారిని అన్యాయం చేసినట్లే. కాబట్టి, హైదరాబాద్‌ను యూటీ చేయాలి.

- రాష్ట్రం విడిపోతే నదీజలాల సర్దుబాటు ఎలా చేస్తారనే భయం రైతులను వెంటాడుతోంది. విభజన తర్వాత నీటి సర్దుబాట్లు ఎలా ఉండాలనేదానిపై స్పష్టమైన ప్రణాళికను ముందుగానే వెల్లడించాలి.

-నియోజకవర్గాల పునర్విభజనతో సీమాంధ్రలో 12 స్థానాలు తగ్గి తెలంగాణలో పెరిగాయి. ఒక్కో నియోజకవర్గానికి 2.58 లక్షల మంది ప్రజలని భావించినా 25 లక్షల మంది, అంతకు ముందు నుంచి నివసిస్తున్న వారు మరో 10 లక్షలమంది సీమాం«ద్రులు హైదరాబాద్‌లో ఉన్నారు. వారికి భరోసా ఇవ్వాలంటే యూటీ చేయడమే పరిష్కారం. హైకమాండ్‌ను ఇదే కోరిక కోరామని మరో కేంద్రమంత్రి కిల్లి కృపా రాణి కూడా శ్రీకాకుళం జిల్లా పాలకొండలో చెప్పారు.

        టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్  చెప్పింది నిజ‌మ‌ని మంత్రులే ఋజువు చేశారు.


Wednesday 30 October 2013

Feed Back Given to Group of Ministers on Division of Andhra Pradesh

                                                                  Date 27.10.2013
To
The Group of Ministers (GOM) for the bifurcation of the state of Andhra Pradesh and formation of a new state of Telangana
Ministry of Home Affaires
Government of India.
New Delhi

Respected Sirs

    Sub: Feedback on Terms of Reference of the GOM

    Before going to our feed back on Terms of Reference of the GOM, we would like to state that we demand not to divide the linguistic States basing on the movements of one side demand, that too of Vested interests, denigrating the other side opinions and hence we oppose the division of state and demand to retain the state as it is.
    Further we state that the Cabinet of Ministers of GOI (herein after called Cabinet) did not see the difference between a political party and Government.  Who asked the Cabinet to divide the Andhra Pradesh in to two? The cabinet decided to divide the state on the basis of letters given by the political party leaders.
 It is true that political parties will have its role in the present democracy. At the same time a political party is a group of people with certain Kind of Principles, policies and Ideologies. While some people like those Principles, policies and Ideologies, others may dislike. So Letters given by the political parties will not depict the opinions of all the people on this issue.
A person elected by the people with majority Votes polled for Assembly or Parliament will be the representative of the people of the constituency.

Monday 23 September 2013

Letter written to Chief Minister of AP on Information Technology Investment Region

                                                                   తేదీ: 23.09.2013

గౌరవనీయులైన ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ యన్‌. కిరణ్‌ కుమార్‌ రెడ్డి గారికి,

ఆర్యా,

హైదరాబాద్‌ నగరంలో ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐ.టి.ఐ.ఆర్‌) ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో ఐ.టి., ఐటి ఆధారిత సేవలు మరియు ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలు వస్తాయని. వీటిద్వారా రు. 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, ప్రత్యక్షంగా 15 లక్షల మందికి, పరోక్షంగా 55.9 లక్షలమందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇంత భారీగా ఉపాధి లభించే పరిశ్రమలు రాష్ట్రానికి వస్తే ఆహ్వానించదగినదే. కాని ఈ పరిశ్రమలను హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేయటాన్ని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము వ్యతిరేకిస్తున్నాము. రాష్ట్రంలోని ఇతర నగరాలలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాము. మా డిమాండ్‌కు గల కారణాలను మీముందుంచుతున్నాము.

సంస్కరణలపేరుతో గత తెలుగుదేశం ప్రభుత్వంనుండి నేటి మీ నాయకత్వంలో నడుస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం వరకు కేంద్రీకృత ఆర్ధిక విధానాలనే అమలు జరుపుతూవచ్చారు. ఫలితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పట్టణాలను బలిపెట్టి హైదరాబాదును అభివృధ్ధి చేశారు. రాష్ట్రం లోకి వచ్చిన పరిశ్రమలను, కేంద్ర ప్రభుత్వ సంస్ధలను అన్నింటినీ హైదరాబాదులోనే కేంద్రీకరించారు. ఈ పరిశ్రమలకోసమని మౌలిక సదుపాయాలను సైతం హైదరాబాదులోనే అభివృధ్ధి చేశారు. కేంద్రీయ యూనివర్శిటీలతో బాటుగా అనేక ముఖ్యమైన యూనివర్శిటీలను హైదరాబాదులోనే నెలకొల్పారు. చివరకు తెలుగు యూనివర్శిటీని సైతం ఉర్దూ ప్రాంతమైన హైదరాబాదులోనే నెలకొల్పారు. ఇప్పుడు మరల హైదరాబాదును ఎడ్యు కేషన్‌ హబ్‌గా తయారు చేస్తామని ప్రకటించారు. ఏ క్రొత్త పరిశ్రమ వచ్చినా దానిని హైదరాబాదుకే ఆహ్వానించటం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఫలితంగా పరిశ్రమల కేంద్రీకరణ, విద్య కేంద్రీకరణ, సౌకర్యాల కేంద్రీకరణ, సంపద కేంద్రీకరణ అంతా హైదరాబాదులోనే జరిగింది. రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాలు పారిశ్రామిక ఎడారులుగా మారాయి. ప్రపంచీకరణలో భాగంగా మీరనుసరించిన విధానాలవలన అప్పటివరకు రాష్ట్రంలో ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, చేతివృత్తులు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఫలితంగా రాష్ట్రంలోని అన్నిపట్టణాలలో ఉపాధి తీవ్రంగా దెబ్బతిన్నది. పరిశ్రమలు, విద్య, సంపద, సౌకర్యాలు అన్నీ హైదరాబాదులో కేంద్రీకరించటం మూలంగా ఉపాధి అవకాశాలు హైదరాబాదులోనే పెరిగాయి. దీనితో ఉపాధి వెతుక్కుంటూ రాష్ట్రంలోని అన్ని పట్టణాలనుండి విద్యాధికులు, చేతివృత్తులవారు, కార్మికులు అందరూ హైదరాబాదుకు రావలసివచ్చింది. ఫలితంగా హైదరాబాదులో స్థలం చాలక చుట్టు ప్రక్కల ఉన్న మున్సిపాలిటీలను, గ్రామాలను కలిపి గ్రేటర్‌ హైదరాబాదు చేయవలసివచ్చింది. దీనిని స్వార్ధపరులు అవకాశంగా తీసుకొని తమకు ఉపాధి లేకపోవటానికి కారణం మరో ప్రాంతంవారేనని తెలంగాణా ప్రజలను రెచ్చ గొట్టారు. ఫలితంగా విభజన వాదం తలెత్తింది. రాష్ట్రం విడిపోతే తమ విద్య ఉపాధి పరిస్తితేమిటని కోస్తా రాయలసీమ ప్రాంత వాసులకు భయంపట్టుకున్నది. ఫలితంగా రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది. రాష్ట్రంలోని అన్ని పట్టణాలను అభివృధ్ధి చేసినట్లయితే ఈ పరిస్థితి ఏర్పడి ఉండేదికాదు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృధ్ది కలిస్తే రాష్ట్రాభివృధ్ది అభివృధ్ధి అవుతుంది తప్ప, కేవలం హైదరాబాదు అభివృధ్ధే రాష్ట్రాభివృధ్ది కాదన్న విషయం మీకు తెలియందికాదు. తెలుగు దేశం, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అనుసరించిన ఈ కేంద్రీకరణ విధానాల వలననే రాష్ట్రానికి ఈ దుర్గతి దాపురించింది. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం ఈ కేంద్రీకరణ విధానాలు విడనాడి, పారిశ్రామిక వికేంద్రీకరణ, సౌకర్యాల వికేంద్రీకరణ. విద్యావికేంద్రీకరణ జరపాలని, రాష్ట్రంలోని 181 మున్సిపల్‌ పట్టణాలలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని టాక్స్‌పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము డిమాండు చేస్తున్నాము. దీనివలన అన్ని పట్టణాలలో ఎక్కడివారికి అక్కడే ఉపాధి లభిస్తుందని, తద్వారా విభజన ఉద్యమాలు సమసిపోతాయని స్పష్టం చేస్తున్నాము.

ఇప్పటికే హైదరాబాదులో ఐటీ పరిశ్రమ ఉన్నది. లక్షల సంఖ్యలో ఉద్యోగులు వాటిలో పని చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి రాబోతున్న ఇన్ఫర్‌మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐ.టి.ఐ.ఆర్‌) ప్రత్యక్షంగా పరోక్షంగా మరో 70 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. ఈ సంఖ్య హైదరాబాదులో ప్రస్తుతం ఉన్న జనసంఖ్యతో సమానం. ఇన్ని లక్షల మంది మరల హైదరాబాదుకు చేరితే హైదరాబాదుతో బాటుగా రాష్ట్రం మరింత ధ్వంసం అవుతుందని స్పష్టం చేస్తున్నాము.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఐ.టి.ఐ.ఆర్‌ పేరుతో రాష్ట్రానికి రానున్న ఐ.టి., ఐటి ఆధారిత సేవలు మరియు ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలను ఒకే చోట కాకుండా, విభజించి, హైదరాబాద్‌లో కాకుండా రాష్ట్రంలోని ఇతర 18 మున్సిపల్‌ కార్పొరేషన్‌ నగరాలలో ఏర్పాటు చేసేవిధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నాము.

ఇక మీదట ఏ పరిశ్రమ వచ్చినా హైదరాబాదులో కాకుండా రాష్ట్రంలోని ఇతర మున్సిపల్‌ పట్టణాలు,నగరాలలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. కొన్ని కేంద్ర ప్రభుత్వ ముఖ్య కార్యాలయాలను రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన ప్రాంతాలకు తరలించాలని కోరుతున్నాము.

విజయవాడలో ఐ.ఐ.టీ ని ఏర్పాటుచేయాలని, గన్నవరం ఐ.టి. పార్కును అభివృద్ధి చేయాలని, విజయవాడ పరిసర ప్రాంతాలలో ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌ మాన్యుఫాక్చరింగ్‌ పరిశ్రమలను ఏర్పాటుచేయాలని డిమాండు చేస్తున్నాము.
                          అభివందనాలతో
(వి.సాంబిరెడ్డి)                                    (యం.వి.ఆంజనేయులు)
అధ్యక్షులు                                                  కార్యదర్శి



Friday 23 August 2013

విజయవాడ నగరాభివృద్ధి-పౌర ఎజండా Vijayawada City Development-Citizen’s Agenda


విజయవాడ నగరాభివృద్ధి-పౌర ఎజండా

Vijayawada City Development-Citizen’s Agenda

విజయవాడనగరం అభివృద్ది చెందవలసిన రీతిలో అభివృధ్ధి చెందటంలేదు. ఎక్కడనుండో వచ్చిన అధికారులు తమకు తోచిన చర్యలు తీసుకుని ఇదే అభివృధ్ధి అనుకోమంటున్నారు. ప్రజల అభిప్రాయానికి చోటు లేకుండా పోతున్నది. మనం కూడా సమస్య వచ్చినప్పుడు ఆంధోళన చేయటం, ఆతర్వాత మిన్నకుండటం జరుగుతున్నది. నగర సమగ్రాభివృధ్ధికి ఏమి కావాలో సూచించే ఎజండా లేదు. అదికారులుగాని, పాలకులుగాని ఆపనికి పూనుకోలేదు. ఉడా లాంటి సంస్థలు రూపొందించిన మాస్టర్‌ ప్లాను కేవలం ప్రభుత్వాలు తలపెట్టిన ప్రైవేటీకరణవిధానాలను అమలు జరపడం, ప్రజల మీద భారలను మోపడానికి ఉద్దేశించినదే తప్ప నగరాభివృద్ధికి ఏమాత్రం దోహదపడేది కాదు. ఈవిషయాలను దృష్టిలో పెట్టుకొని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విజయవాడ నగర సమగ్రాభివృధ్ధికి ఒక ఎజండా ముసాయిదాను తయారు చేసింది. ఈ ముసాయిదాను పబ్లిక్‌ అభిప్రాయాల కొరకు చర్చకు పెడుతున్నది.
ఈ ఎజండా ముసాయిదా పూర్తిగా ఆ సైట్‌లో పోస్టు చేయటానికి సాధ్యపడదు. అందువలన గూగుల్‌ లింక్‌ ఈ దిగువ నిస్తున్నాము. ఈ లింకును మీ బ్రౌజరులోని అడ్రసు బార్‌లో కాపీ చేసి ఎంటర్‌ కొడితే ముసాయిదా ఒపేన్‌ అవుతుంది. మీరు దానిని చదివి మీ అభిప్రాయాలను మాకు ఈ మెయిల్‌ ద్వారా పంపండి


ముసాయిదా లింక్‌
https://docs.google.com/file/d/0B25Ypk7Mlc0qRkw5cUJCX2pBU2M/edit?usp=sharing


అభిప్రాయాలు పంపవలసిన ఈ మెయిల్‌ అడ్రస్‌ 
veeranjaneyulumatcha@gmail.com



Monday 24 June 2013

నగర పాలక సంస్థ కు రావలసిన ఆదాయమార్గాలను గురించి సిటిజెన్స్ ఫోరం కమిషనర్ కు వ్రాసిన లేఖ

                                                                                               తేదీ:08.02.2013
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి
ఆర్యా,
విజయవాడ నగరపాలక సంస్థ నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్న విషయాన్ని మేము గమనిస్తున్నాము. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు చేసే పరిస్థితి లేదు ఫలితంగా అటు ఉద్యోగులు, ఇటు కాంట్రాక్టర్లు ఆంధోళన చేయవలసి వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన పి.ఎఫ్‌,నిధులను సైతం నగరపాలక సంస్థ వాడుకున్నది. చివరకు నిధులకోసం నగరపాలక సంస్థ ఆస్తులను సౖెెతం తాకట్టు పెట్టవలసి వచ్చింది. అభివృధ్ధి పనులు నిలచి పోతున్నాయి. నగరపాలక సంస్థలో జరుగుతున్న ఈ విషయాలను నగరపౌరులుగా గమనిస్తున్నాము. నగరపాలక సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న మేము నగరాభివృధ్ధి కుంటు పడుతూ ఉంటే, మా మీద భారాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. అందువలననే నగరంలోని వివిధ

నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదలను వ్యతిరేకించండి.


మున్సిపల్‌ కార్పొరేన్‌ నీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను భారీగా పెంచింది. మొదటిసారిగా
ఇంటిపన్ను ఆధారంగా నీటి చార్జీలు నిర్ణయించే క్రొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే
ఇంటిపన్ను పెరిగితే నీటి చార్జీలు కూడా ఆటోమాటిక్‌గా పెరుగుతాయన్నమాట.
ఇప్పటివరకు మనం వ్యక్తిగత గృహానికి నెలకు  రు.80లు చొప్పున చెల్లిస్తున్నాము.
ఇక మీదట ఈ క్రింది విధంగా చెల్లించాలి.


 ఇంటిపన్ను (అర్థ సం||కు)రు. 
  ప్రస్తుతం నెలకు
చెల్లిస్తున్నది
రు. 
  1.6.2013నుండి
నెలకు చెల్లించవలసింది
రు.
ప్రస్తుతం సం||కి చెల్లిస్తున్నది
రు. 
  1.6.13 నుండిసం||కు చెల్లించవలసింది
రు.
 175లోపు
 50
 70
 600
 840
 176-500
 80
 110
 960
 1320
 501-1000
 80
 175
 960
 2100
 1001-1500
 80
 200
 960
 2400
 1501-5000
 80
 300
 960
 3600
 5001ఆపైన
 80
 400
 960
 4800





 

నిజానికి ఇంటిపన్నుకు నీటి చార్జీలకు ఎలాంటి సంబంధంలేదు. భారీగా ఇంటిపన్ను కట్టే ధనవంతుని గృహానికైనా, అతతక్కువ ఇంటిపన్ను కట్టే పేదవాని గృహానికైనా కార్పొరేషన్‌ అర అంగుళం నీటి కుళాయినే ఇస్తుంది. నీరిచ్చే సమయం కూడా ఇంటిపన్నును బట్టి మారదు. అందరికి ఉదయం సాయంత్రం 1గంట మాత్రమే నీటిని సరఫరా చేస్తారు. ఇంటి పన్ను ఎక్కువ చెల్లించేవారికి, తక్కువ చెల్లించేవారికి సరఫరా చేసే నీటి పరిమాణంలో తేడా ఉండదు. ఒకే పరిమాణంలో ఉంటుంది. అందువలన నీటి సరఫరాకు ఇంటిపన్నుకు సంబంధంలేదు. మరల మరల నీటిచార్జీలు పెంచేపని లేకుండా, ఇంటి పన్ను పెరిగిన ప్రతిసారి నీటి చార్జీలు వాటంతటవే పెరగటానికి వీలుగా కార్పొరేషన్‌ వేసిన ఎత్తుగడే ఇది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఆస్తి పన్ను రివిజన్‌ జరిగే అవకాశం ఉంది.ఆస్తి పన్నుపెరగగానే వాటితో బాటే నీటి చార్జీలు కూడా పెరుగుతాయి.
ఇక అపార్టుమెంట్ల విషయానికి వస్తే, ఇప్పటికే అపార్టుమెంట్లకు నీటి మీటర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మొదటి 3 కిలో లీటర్లకు 100 రు, ఆ పైన ప్రతి కిలో లీటరుకు రు8.25లు చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు దానిని ఈ క్రింది విధంగా మార్చారు.


 మీటర్‌ రీడింగ్‌
 చార్జీ రు.లలో
 ఇప్పటివరకు చెల్లించినది రు.లలో
 1.6.13నుండి  చెల్లిం చవలసినది రు.లలో
 0-9 కిలో లీ||
 300
 100.00-149.50
 300
 10-18కిలో లీ||
 300+ప్రతి కిలోలీటర్‌కు రు12లు
 157.75-223.75
 312-408
 19-25కిలో లీ||
 408+ప్రతి కిలోలీటర్‌కు రు15లు
 232.00-281.50
 423-513
 26-50కిలో లీ||
 513+ప్రతి కిలోలీటర్‌కు రు20లు
 289.75-487.75
 533-1013
 50 కిలో లీ|| పైన
 1013+ప్రతి కిలోలీటర్‌కు రు50లు
 496.00 ఆపైన
 1063ఆపైన
 

దీనిని బట్టి అపార్టుమెంట్లకు కూడా నీటి చార్జీల పెంపుదల రెట్టింపుకు పైగా ఉందని స్పష్టమవుతున్నది.పైధరలను పరిశీలించినప్పుడు నగరంలోని అన్నిరకాల నివాసగృహాలపై విపరీతమైన భారాన్ని మోపారని స్పష్టమవుతున్నది.

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి చార్జీలను నివాసగృహాలకు ఒక్కొక్క మరుగు దొడ్డికి రు 15లనుండి రు 30లకు పెంచారు. అంటే ఇక మీదట రెట్టింపు చెల్లించాలన్నమాట. ఈ చార్జీలను చెల్లించేకన్నా లెట్రిన్‌ బావులను ఉపయోగించడమే చౌక అవుతుంది.
ఈ చార్జీల పెపుదలకు కార్పొరేషన్‌ చెప్పేవాదన కూడా అసంబధ్దంగా ఉంది.మంచినీటి చార్జీల నిర్వహణ కోసం కార్పొరేషన్‌కు రు 34 కోట్లు ఖర్చు అవుతుండగా, పెంచిన ధరల ప్రకారం కూడా ఆదాయం రు25.9 కోట్లు మాత్రమే వస్తుందని, ఇంకాలోటు రు8.1కోట్లు ఉంటుందని కార్పొరేషన్‌ వాదిస్తున్నది. అదేవిధంగా డ్రైనేజీ నిర్వహణకు రు9.6 కోట్లు ఖర్చు అవుతుండగా పెంచిన చార్జీల ప్రకారం కూడా ఆదాయం రు5 కోట్లు మాత్రమే రానున్నదని, ఇంకాలోటు రు4.6 కోట్లు ఉంటుందని కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. చార్జీలు పెంచిన తర్వాత కూడా ఈ రెండిటి మీద లోటు ఇంకా రు12.7 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు.
మంచినీరు, డ్రైనేజి, శానిటేషన్‌ నిర్వహణకు అయ్యేఖర్చును ఎవరు భరించాలన్నదే ప్రశ్న. మొత్తం ప్రజలే భరించాలని కార్పొరేషన్‌ అధికారులు వాదిస్తున్నారు. ఈ ఆలోచనలో భాగంగానే నీటి చార్జీలు డ్రైనేజి చార్జీలు పెంచారు. అందుకు భిన్నంగా ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము భావిస్తున్నాము. కారణాలు

01. రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లలో మంచినీటికి, శానిటేషన్‌కు నిధులు ప్రతి ఏటా కేటాయిస్తుంది. గత ఏడాదికూడా కేటాయించింది. ఆ కేటాయింపులనుండి విజయవాడ నగరంలో మంచినీటికి, శానిటేషన్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి.

02.అంతేకాకుండా మంచినీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణ, శానిటేషన్‌ ప్రజారోగ్యంలో భాగం. ప్రజారోగ్య నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వబాధ్యత. అందువలన విజయవాడ నగరంలో మంచినీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణ, శానిటేషన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖచ్చితంగా కేటాయించాలి.

03. రాష్ట్రాభివృధ్ధి కోసం మనం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాము. వాటినుండి స్థానికాభివృధ్ధికోసం స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలి. వాటిలో విజయవాడ అభివృధ్దికి రావలసిన మొత్తాన్ని ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇచ్చి, అవి చాలక పోతే అప్పుడు పన్నులు పెంచినా అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన నిధులను ఇవ్వకుండా దారిమళ్ళిస్తూ, స్థానికావసరాల కోసం మరల ప్రజలమీద భారాలు మోపుతుంటే ఆభారాన్ని మనం ఎందుకు మోయాలి?

ఈ 3 కారణాల రీత్యా నగరపాలక సంస్థకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అంటున్నాము. అంతేగాకుండా నీటి చార్జీలకు ఇంటిపన్నును ఆధారంగా చేయటం, నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు పెంచటంలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిపై సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజల తరఫున చర్చ జరపడానికి ఎన్నికైన కౌన్సిల్‌ లేదు.ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేరు.ఎన్నికైన కౌన్సిల్‌ లేని సమయంలో కేవలం కొద్దిమంది అధికారులు కూర్చొని విధాన పరమైన నిర్ణయాలు చేయటం ప్రజాస్వామ్య విరుధ్దం. దీనిని మనం వ్యతిరేకించాలి.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచింది. రవాణా చార్జీలను పెంచింది. దీనితో అన్నిరకాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. భూముల విలువలనుపెంచింది. ఇప్పుడు నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను పెంచి మనలను భరించమంటున్నారు.ఎంతవరకు మనం భరించగలం?
అందుకే నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదలను ప్రారంభంలోనే మనం ఎదుర్కోవాలి. దీనికై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ చేసే కృషిలో మీరూ భాగస్వాములు కావలసిందిగా కోరుతున్నాము.