Thursday 13 December 2018

రాష్ట్రంలో అర్హులైన ప్ర‌తి పౌరుడిని ఓట‌రుగా న‌మోదు చేయ‌టం ఎన్నిక‌ల క‌మీష‌న్ బాధ్య‌త‌- ప‌క్కా ఓట‌రులిస్టు త‌యారైన త‌ర్వానే 2019 ఎన్నిక‌ల‌కు వెళ్లాలి- టాక్స్ పేయ‌ర్స్ అసోసియేస‌న్ డిమాండ్‌


ప్రచురణార్ధం:                                                                    తేదీ:13.12.2018


2019 ఎలక్షన్ల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో అర్హుడైన ఏ పౌరుడు ఓటు లేకుండా ఉండకూడదని, అందుకోసం పక్కా ఓటర్‌ లిస్టులను తయారు చేసి ఎన్నికలకు వెళ్లాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల అధికారులను డిమాండు చేసింది. ఆమేరకు రాష్ట్ర ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఆర్‌.పి. సిసోడియాకు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఒక లేఖ వ్రాశింది. ఇటీవల తెలంగాణా ఎన్నికలలో ప్రతి నియోజక వర్గంలో వేలాది ఓట్లు గల్లంతయ్యాయని ప్రజలు గగ్గొలు పెట్టారని, అక్కడి ఛీప్‌ ఎలకక్షన్‌ ఆఫీసర్‌ ప్రజలను క్షమాపణకోరవలసి వచ్చివందని అలాంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్‌లో తల్తెకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వెల్లడించిన ఓటర్‌లిస్టులో అనేక మంది ఓట్లు గల్లంతయ్యాయి. అనేకమంది ఓటుకోసం మరల దరఖాస్తు చేసుకున్నారు. కొంతమందికికి తమ ఓటు ఉన్నదో లేదో కూడా తెలియదు. కొంతమంది తమకు ఓటరు కార్డు ఉంది కనుక తమ ఓటు ఖచ్చితంగా లిస్టులో ఉంటుందన్న ధీమాతో ఉన్నారు. కాని ఓటరు కార్డు ఉన్నప్పటికీ, ఓటరు లిస్టులో పేరులేని వారు గణనీయంగా ఉన్నారన్న విషయాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ దృష్టికి తెచ్చింది. అలాంటివారు ఎన్నికల సమయంలో మాత్రమే తమ ఓటు లేదన్న విషయాన్ని గ్రహిస్తారని, కాని అప్పుడు చేయగలిగిందేమీ లేదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. ఒకే డోర్‌ నెంబర్‌ లో ఉన్న వారి ఓట్లను వివిధ బూతులకు కేటాయించటంతో వారికి తమ ఓటు ఉన్నదో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని, అందువలన ఒకే డోర్‌ నెంబర్‌లో ఉన్న వారందరి ఓట్లును ఒకే బూతుకు కేటాయించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరింది. 
ఓట్ల వెరిఫికేషన్‌ను రాజకీయ పార్టీలకు వదలి వేయటం సరి కాదని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. ఇటీవల రాష్ట్ర ముఖ్య మంత్రి నుండి తమ పాలన సంతృప్తిగా ఉన్నదా లేక అసంతృప్తిగా ఉన్నదా తెలుపమని ఫోన్లు వస్తున్నాయని, తాము అసంతృప్తిగా ఉన్నదని చెప్పటం వలననే తమ ఓట్లు తొలగిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ దృష్టికి తెచ్చింది. ఈ విషయంలో ప్రజలలో ఎన్నికల కమీషన్‌ మీద విశ్వాసం కన్నా అధికార పార్టీ పట్ల భయం ఎక్కువగా ఉన్నదని, ఎన్నికల యంత్రాంగం అధికార పార్టీ కనుసన్నలలో పని చేస్తున్నదన్న భావన వారిలో నెలకొని ఉండటమే దీనికి కారణమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ స్పష్టం చేసింది. అర్హులైన పౌరులందరి పేర్లను ఓటరు లిస్టులో చేర్చటం ద్వారా ప్రజలలో విశ్వాసం కల్పించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ కోరింది. 2019 ఎన్నికల సమయానికి ఇంకా 3 నెలల సమయం ఉన్నందున ఈ 3 నెలల కాలంలో ఎన్నికల యంత్రాంగాన్ని రంగంలోకి దించి ఇంటింటికీ తిరిగి ఓట్లు వెరిఫికేషన్‌ చేయించాలని, ఓట్లు గల్లంతయిన వారి ఓట్లును తిరిగి చేర్పించాలని, పక్కా ఓటరు లిస్టులతో ఎన్నికలకు వెళ్లాలని ఛీప్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌ చేసింది.

వి.సాంబిరెడ్డి                                                       యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు                                                                కార్యదర్శి