Tuesday 28 January 2014

మంచినీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదల, ఆస్తిపన్ను పెంచుతూ మున్సిపల్‌ చట్టాలకు చేసిన సవరణలను వ్యతి రేకిస్తూ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు 27.01.2014 న ధర్నా.




మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమీషనర్‌ కు స‌మ‌ర్పించిన‌ మెమొరాండం.
తేదీ :27. 1. 14

గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి
ఆర్యా,
విషయం:- మంచినీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదల, ఆస్తిపన్ను పెంచుతూ మున్సిపల్‌ చట్టాలకు చేసిన సవరణలను వ్యతి రేకిస్తూ ఈ రోజు మీ కార్యాలయం ముందు జరిగిన ధర్నా సందర్భంగా సమర్పిస్తున్న మెమొరాండం.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ మంచినీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను విపరీతంగా పెంచింది. అదేవిధంగా ఆస్తిపన్ను పెంచుతూ GHMC Act 1955  కు రాష్ట్రప్రభుత్వం సవరణలు చేసింది. ఈ రెండింటిని వ్యతిరేకిస్తూ విజయవాడనగర ప్రజలు టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ రెండు అంశాలను వ్యతిరేకించడానికిగల కారణాలను మీముందుంచుతున్నాము.
మంచినీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదలపై మా వ్యతిరేకతకుగల కారణాలు 

01. చార్జీలను పెంచేటప్పుడు ముందుగా వినియోగదారులమైన మాకు తెలియపరచాలని, మానుండి అభ్యంతరాలేమైనా ఉంటే స్వీకరించి వాటిని పరిశీలించాలన్న విషయాలను పట్టించుకోకుండా, ఏకపక్షంగా చార్జీలను పెంచి, ఆస్తిపన్ను నోటీసులలో కలిపి పంపటం పట్ల మేము అభ్యంతరం తెలియజేస్త్తున్నాము. ఇది ప్రజాస్వామ్యవ్యతిరేకమని, నిరంకుశవిధానమని మేము తెలియ జేస్తున్నాము. అంతేకాకుండా నీటి చార్జీలకు ఇంటిపన్నును ఆధారంగా చేయటం, నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు పెంచటంలాంటి విధానపరమైన నిర్ణయాలు