Saturday 4 November 2017

Press Meet on 03.11.2017

ప్రచురణార్ధం:                                                                తేదీ:03.11.2017

రాష్ట్ర ప్రభుత్వం విజయవాడలో బలహీన వర్గాలకు ఇళ్ళు నిర్మించటం కోసం నగరపాలక సంస్థ చేత అప్పు చేయించటాన్ని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ వ్యతిరేకిస్తున్నది. విజయవాడలో జె.యన్‌.యన్‌.యు.ఆర్‌.యం.-బి.ఎస్‌.యు.పి పథకం క్రింద బలహీన వర్గాల కోసం జి+3 ఇళ్ళు నిర్మించుటకై రు. 100 కోట్లు అప్పు చేయాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయించింది. ఈ ఋణం తీసుకోవటానికి వడ్డీ రేట్ల వివరాలను తెలియజేయవలసిందిగా బ్యాంకర్లను కోరుతూ ఈనెల 1 వ తేదీన మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఒక దిన పత్రికలో ప్రకటన ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ విజయవాడ నగర పాలక సంస్థ కమీషనర్‌కు ఒక లేఖను వ్రాశింది. 
బలహీన వర్గాలకు ఇళ్ళు నిర్మించటం, పౌరులకు గృహ వసతి కల్పించటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధి. విజయవాడ నగరపాలక సంస్థకు బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికీ సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనికి నగరపాలక సంస్థ అప్పు చేయటం ఏమిటని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆ లేఖలో ప్రశ్నించింది. విజయవాడ నగరపాలక సంస్థ ఆర్ధిక లేమితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ ఋణం నగరపాలక సంస్థకు భారంగా మారనున్నదని ఆలేఖలోస్పష్టం చేసింది. నగరపాలక సంస్థకు సంబంధంలేని పనికి నగరపాలక సంస్థ అప్పుచేయటం నగర ప్రజల నెత్తిన అప్పును రుధ్దటమే అవుతుందని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ఆ లేఖలో స్పష్టం చేసింది. 
వర్షం వస్తే నగరం జలాశయంలా మారటం, డ్రైనేజి వ్యవస్థ అస్థవ్యస్తంగా ఉండటం, పారిశుధ్ధ్యం నానాటికీ దిగజారటం, రోడ్లు అధ్వాన్నంగా తయారవటం, ట్రాఫిక్‌ ఇబ్బందులు నానాటికీ తీవ్రమవటం, ఫుట్‌ పాత్‌లు లేకపోవటం లాంటి అనేక సమస్యల పరిష్కారానికిి నిధులు కావలసి యుండగా, వాటిని వదిలేసి, రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన పనులకు కార్పొరేషన్‌ అప్పులు చేయటం దారుణమని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఈ అప్పును తీర్చవలసింది విజయవాడ నగర ప్రజలేనని, ఈ అప్పు తీర్చటం కోసం భవిష్యత్తులో నగర ప్రజలపై భారాన్ని మోపవలసి వస్తుందని స్పష్టం చేసింది. నగరపాలక సంస్థకు సంబంధంలేని పనికి నగర పాలక సంస్థ అప్పుచేస్తే, దానిని నగర ప్రజలు ఎందుకు భరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ ప్రశ్నించింది. కార్పొరేషన్‌కు, నగర ప్రజలకు భారంగా మారే ఈ ఋణ ప్రతి పాదనను తక్షణమే విరమించుకోవలసినదిగా టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ మున్సిపల్‌ కమీషనర్‌ను కోరింది. 
రాష్ట్ర పౌరులకు గృహవసతి కల్పించటం రాష్ట్ర ప్రభుత్వ భాధ్యత. కనుక బలహీన వర్గాల కోసం నిర్మించే జి+3 ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోనే నిర్మించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేసింది.





విజ‌య‌వాడ న‌గ‌రంలోని ప‌బ్లిక్ స్థ‌లాల ప్రైవేటీక‌ర‌ణ‌పై టాక్స్ పేయ‌ర్స్ అసోసియేష‌న్ విడుద‌ల చేసిన క‌ర‌ప‌త్రం