Monday 24 June 2013

నగర పాలక సంస్థ కు రావలసిన ఆదాయమార్గాలను గురించి సిటిజెన్స్ ఫోరం కమిషనర్ కు వ్రాసిన లేఖ

                                                                                               తేదీ:08.02.2013
గౌరవనీయులైన విజయవాడ నగరపాలక సంస్థ కమీషనర్‌ గారికి
ఆర్యా,
విజయవాడ నగరపాలక సంస్థ నిధుల లేమితో కొట్టు మిట్టాడుతున్న విషయాన్ని మేము గమనిస్తున్నాము. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు చేసే పరిస్థితి లేదు ఫలితంగా అటు ఉద్యోగులు, ఇటు కాంట్రాక్టర్లు ఆంధోళన చేయవలసి వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన పి.ఎఫ్‌,నిధులను సైతం నగరపాలక సంస్థ వాడుకున్నది. చివరకు నిధులకోసం నగరపాలక సంస్థ ఆస్తులను సౖెెతం తాకట్టు పెట్టవలసి వచ్చింది. అభివృధ్ధి పనులు నిలచి పోతున్నాయి. నగరపాలక సంస్థలో జరుగుతున్న ఈ విషయాలను నగరపౌరులుగా గమనిస్తున్నాము. నగరపాలక సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న మేము నగరాభివృధ్ధి కుంటు పడుతూ ఉంటే, మా మీద భారాలు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేము. అందువలననే నగరంలోని వివిధ

నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదలను వ్యతిరేకించండి.


మున్సిపల్‌ కార్పొరేన్‌ నీటి చార్జీలను, డ్రైనేజి చార్జీలను భారీగా పెంచింది. మొదటిసారిగా
ఇంటిపన్ను ఆధారంగా నీటి చార్జీలు నిర్ణయించే క్రొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. అంటే
ఇంటిపన్ను పెరిగితే నీటి చార్జీలు కూడా ఆటోమాటిక్‌గా పెరుగుతాయన్నమాట.
ఇప్పటివరకు మనం వ్యక్తిగత గృహానికి నెలకు  రు.80లు చొప్పున చెల్లిస్తున్నాము.
ఇక మీదట ఈ క్రింది విధంగా చెల్లించాలి.


 ఇంటిపన్ను (అర్థ సం||కు)రు. 
  ప్రస్తుతం నెలకు
చెల్లిస్తున్నది
రు. 
  1.6.2013నుండి
నెలకు చెల్లించవలసింది
రు.
ప్రస్తుతం సం||కి చెల్లిస్తున్నది
రు. 
  1.6.13 నుండిసం||కు చెల్లించవలసింది
రు.
 175లోపు
 50
 70
 600
 840
 176-500
 80
 110
 960
 1320
 501-1000
 80
 175
 960
 2100
 1001-1500
 80
 200
 960
 2400
 1501-5000
 80
 300
 960
 3600
 5001ఆపైన
 80
 400
 960
 4800





 

నిజానికి ఇంటిపన్నుకు నీటి చార్జీలకు ఎలాంటి సంబంధంలేదు. భారీగా ఇంటిపన్ను కట్టే ధనవంతుని గృహానికైనా, అతతక్కువ ఇంటిపన్ను కట్టే పేదవాని గృహానికైనా కార్పొరేషన్‌ అర అంగుళం నీటి కుళాయినే ఇస్తుంది. నీరిచ్చే సమయం కూడా ఇంటిపన్నును బట్టి మారదు. అందరికి ఉదయం సాయంత్రం 1గంట మాత్రమే నీటిని సరఫరా చేస్తారు. ఇంటి పన్ను ఎక్కువ చెల్లించేవారికి, తక్కువ చెల్లించేవారికి సరఫరా చేసే నీటి పరిమాణంలో తేడా ఉండదు. ఒకే పరిమాణంలో ఉంటుంది. అందువలన నీటి సరఫరాకు ఇంటిపన్నుకు సంబంధంలేదు. మరల మరల నీటిచార్జీలు పెంచేపని లేకుండా, ఇంటి పన్ను పెరిగిన ప్రతిసారి నీటి చార్జీలు వాటంతటవే పెరగటానికి వీలుగా కార్పొరేషన్‌ వేసిన ఎత్తుగడే ఇది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఆస్తి పన్ను రివిజన్‌ జరిగే అవకాశం ఉంది.ఆస్తి పన్నుపెరగగానే వాటితో బాటే నీటి చార్జీలు కూడా పెరుగుతాయి.
ఇక అపార్టుమెంట్ల విషయానికి వస్తే, ఇప్పటికే అపార్టుమెంట్లకు నీటి మీటర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు మొదటి 3 కిలో లీటర్లకు 100 రు, ఆ పైన ప్రతి కిలో లీటరుకు రు8.25లు చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు దానిని ఈ క్రింది విధంగా మార్చారు.


 మీటర్‌ రీడింగ్‌
 చార్జీ రు.లలో
 ఇప్పటివరకు చెల్లించినది రు.లలో
 1.6.13నుండి  చెల్లిం చవలసినది రు.లలో
 0-9 కిలో లీ||
 300
 100.00-149.50
 300
 10-18కిలో లీ||
 300+ప్రతి కిలోలీటర్‌కు రు12లు
 157.75-223.75
 312-408
 19-25కిలో లీ||
 408+ప్రతి కిలోలీటర్‌కు రు15లు
 232.00-281.50
 423-513
 26-50కిలో లీ||
 513+ప్రతి కిలోలీటర్‌కు రు20లు
 289.75-487.75
 533-1013
 50 కిలో లీ|| పైన
 1013+ప్రతి కిలోలీటర్‌కు రు50లు
 496.00 ఆపైన
 1063ఆపైన
 

దీనిని బట్టి అపార్టుమెంట్లకు కూడా నీటి చార్జీల పెంపుదల రెట్టింపుకు పైగా ఉందని స్పష్టమవుతున్నది.పైధరలను పరిశీలించినప్పుడు నగరంలోని అన్నిరకాల నివాసగృహాలపై విపరీతమైన భారాన్ని మోపారని స్పష్టమవుతున్నది.

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి చార్జీలను నివాసగృహాలకు ఒక్కొక్క మరుగు దొడ్డికి రు 15లనుండి రు 30లకు పెంచారు. అంటే ఇక మీదట రెట్టింపు చెల్లించాలన్నమాట. ఈ చార్జీలను చెల్లించేకన్నా లెట్రిన్‌ బావులను ఉపయోగించడమే చౌక అవుతుంది.
ఈ చార్జీల పెపుదలకు కార్పొరేషన్‌ చెప్పేవాదన కూడా అసంబధ్దంగా ఉంది.మంచినీటి చార్జీల నిర్వహణ కోసం కార్పొరేషన్‌కు రు 34 కోట్లు ఖర్చు అవుతుండగా, పెంచిన ధరల ప్రకారం కూడా ఆదాయం రు25.9 కోట్లు మాత్రమే వస్తుందని, ఇంకాలోటు రు8.1కోట్లు ఉంటుందని కార్పొరేషన్‌ వాదిస్తున్నది. అదేవిధంగా డ్రైనేజీ నిర్వహణకు రు9.6 కోట్లు ఖర్చు అవుతుండగా పెంచిన చార్జీల ప్రకారం కూడా ఆదాయం రు5 కోట్లు మాత్రమే రానున్నదని, ఇంకాలోటు రు4.6 కోట్లు ఉంటుందని కార్పొరేషన్‌ అధికారులు చెబుతున్నారు. చార్జీలు పెంచిన తర్వాత కూడా ఈ రెండిటి మీద లోటు ఇంకా రు12.7 కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు.
మంచినీరు, డ్రైనేజి, శానిటేషన్‌ నిర్వహణకు అయ్యేఖర్చును ఎవరు భరించాలన్నదే ప్రశ్న. మొత్తం ప్రజలే భరించాలని కార్పొరేషన్‌ అధికారులు వాదిస్తున్నారు. ఈ ఆలోచనలో భాగంగానే నీటి చార్జీలు డ్రైనేజి చార్జీలు పెంచారు. అందుకు భిన్నంగా ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌గా మేము భావిస్తున్నాము. కారణాలు

01. రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లలో మంచినీటికి, శానిటేషన్‌కు నిధులు ప్రతి ఏటా కేటాయిస్తుంది. గత ఏడాదికూడా కేటాయించింది. ఆ కేటాయింపులనుండి విజయవాడ నగరంలో మంచినీటికి, శానిటేషన్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలి.

02.అంతేకాకుండా మంచినీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణ, శానిటేషన్‌ ప్రజారోగ్యంలో భాగం. ప్రజారోగ్య నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వబాధ్యత. అందువలన విజయవాడ నగరంలో మంచినీటి సరఫరా, డ్రైనేజి నిర్వహణ, శానిటేషన్‌లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖచ్చితంగా కేటాయించాలి.

03. రాష్ట్రాభివృధ్ధి కోసం మనం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాము. వాటినుండి స్థానికాభివృధ్ధికోసం స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాలి. వాటిలో విజయవాడ అభివృధ్దికి రావలసిన మొత్తాన్ని ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులు ఇచ్చి, అవి చాలక పోతే అప్పుడు పన్నులు పెంచినా అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఇవ్వవలసిన నిధులను ఇవ్వకుండా దారిమళ్ళిస్తూ, స్థానికావసరాల కోసం మరల ప్రజలమీద భారాలు మోపుతుంటే ఆభారాన్ని మనం ఎందుకు మోయాలి?

ఈ 3 కారణాల రీత్యా నగరపాలక సంస్థకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని అంటున్నాము. అంతేగాకుండా నీటి చార్జీలకు ఇంటిపన్నును ఆధారంగా చేయటం, నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు పెంచటంలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిపై సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజల తరఫున చర్చ జరపడానికి ఎన్నికైన కౌన్సిల్‌ లేదు.ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లేరు.ఎన్నికైన కౌన్సిల్‌ లేని సమయంలో కేవలం కొద్దిమంది అధికారులు కూర్చొని విధాన పరమైన నిర్ణయాలు చేయటం ప్రజాస్వామ్య విరుధ్దం. దీనిని మనం వ్యతిరేకించాలి.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను భారీగా పెంచింది. రవాణా చార్జీలను పెంచింది. దీనితో అన్నిరకాల సరుకుల ధరలు విపరీతంగా పెరిగి పోయాయి. భూముల విలువలనుపెంచింది. ఇప్పుడు నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను పెంచి మనలను భరించమంటున్నారు.ఎంతవరకు మనం భరించగలం?
అందుకే నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదలను ప్రారంభంలోనే మనం ఎదుర్కోవాలి. దీనికై టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ చేసే కృషిలో మీరూ భాగస్వాములు కావలసిందిగా కోరుతున్నాము.