Friday, 23 November 2018
Tuesday, 20 November 2018
"రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం- వంతపాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం"- ఈ క్షణం వెబ్ ఛానల్తో M.V. Anjaneyulu
"రాజ్యాంగ వ్యవస్థలను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం- వంతపాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం"- ఈ క్షణం వెబ్ ఛానల్తో M.V. Anjaneyulu
Monday, 12 November 2018
పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచే జీ.వో 336ను రద్దు చేయాలి- టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ 12.11.2018
ప్రచురణార్ధం
పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచటానికి ఉద్దేశించిన జీ.వో నెం.336ను తక్షణమే ఉపసంహరించు కోవాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. విజయవాడతో సహా రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థలలో వివిధ పనులను చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం రు.12,600 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అందులో 90 శాతం అంటే రు. 11,340 కోట్లు బ్యాంకులనుండి 8 శాతం వడ్డీకి ఋణం తీసుకోబోతున్నది. మిగతా 10 శాతం అంటే రు.1260కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. పట్టణ స్థానిక సంస్థలలో నీటి సరఫరా, సివరేజి మేనేజ్మెంట్, వర్షపునీటి కాలువలు, రోడ్ల పునర్నిర్మాణం, శ్మశానవాటికలు, పార్కుల అభివృధ్ధి- ఈ ఆరుపనులు ఈ ఋణంతో చేస్తారట. నిజానికి మున్సిపల్ నిధులతో ఈ పనులను చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చెల్లించిన పన్నులనుండి స్ధానికాభివృధ్ధికోసం మున్సిపాలిటీలకు నిధులను కేటాయించాలి. ఇవేవి చేయకుండా వేలకోట్లరూపాయలు అప్పులుచేసి ఈ పనులు చేస్తామనటం దారుణం. ఇప్పటికే నీటి కనెక్షన్ ఇవ్వాలన్నా, డ్రైనేజి కనెక్షన్ ఇవ్వాలన్నా డొనేషన్లపేరుతో వాటికయ్యే ఖర్చును వసూలు చేస్తున్నారు. నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు భారీగా పెంచి వాటి నిర్వాహణకు అయ్యే ఖర్చును ప్రజల నుండే వసూలు చేస్తున్నారు. పార్కులు ప్రైవేటువారికి ఇస్తున్నారు. ఒకవైపు నిర్మాణ,నిర్వహణా వ్యయాలను ప్రజలనుండి వసూలు చేస్తూ తిరిగి అవే పనులకు వేలాది కోట్లరూపాయలు అప్పులు తెచ్చి చేస్తామనటంలో ఔచిత్యమేమిటని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది.
అయితే ఈ ఋణం తీసుకునేది ప్రభుత్వమైనా భరించేది ప్రభుత్వం కాదు. ఈ పనులకు చేయటానికి ఏ మున్సిపల్ సంస్థ పరిధిలో ఎంత ఖర్చు చేస్తారో ఆ మొత్తాన్ని ఆ మున్సిపాలిటీ లేదా ఆ మున్సిపల్ కార్పొరేషన్ వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆ జీ.వోలో నిబంధన విధించారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకుండా మున్సిపల్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెడుతున్నదని స్పష్టం అవుతున్నది. ఈ ఋణంలో మొదటి దఫాగా రు.3000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే తీసుకోవాలని నిర్ణయించారు. కేవలం 4 నెలలో కాలంలో రు.3000 కోట్లు విలువగలిగిన పనులు ఎలా అవుతాయని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది. విజయవాడలో వర్షపునీటి కాలువల నిర్మాణం కోసం కేంద్రం నుండి రు.461 కోట్లు వచ్చి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నా, నేటికీ పనులు అరకొరగా జరుగుతున్నాయే తప్ప పూర్తికాలేదు. ఎన్నికలలోపు పూర్తయ్యే అవకాశంకూడా కనుపించటం లేదు. మూడేళ్ళలో రు.461 కోట్ల విలువ కలిగిన పనులు చేయలేని ప్రభుత్వం, 4 నెలల కాలంలో రు.3000 కోట్లు ఖర్చు చేసి పనులు చేస్తామనటం కేవలం ప్రజలను మభ్యపెట్టడమేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. మరో 5 నెలలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉండగా రు.3000 కోట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే తీసుకోవటం మున్సిపాలిటీలలో పనులు చేయటానికి కాదని, ఆ డబ్బును వేరే అవసరాలకు మళ్ళించటానికి వేసిన ఎత్తుగడ అని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేసే అప్పును పట్ణణాలు, నగరాలలోని ప్రజలే భరించాలి. దానికోసం మున్సిపల్ సంస్థలు పట్టణ ప్రజలపై పన్నుల భారం వేసే అవకాశం ఉంది. ఇది ప్రజలకు భారంగా మారబోతున్నది. అదే విధంగా భవిష్యత్తులో స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను శాశ్వితంగా ఎగ్గొట్టడానికి ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ కారణాలన్నింటి రీత్యా రాష్ట్ర ప్రభుత్వం ఋణం కోసం విడుదల చేసిన ఈ జీ.వోను టాక్స్ పేయర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తున్నది. పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచటానికి, ప్రజలపై భారాలను మోపటానికి ఉద్దేశించిన ఈ జీ.వో ను తక్షణమే ఉప సంహరించుకోవాలని, నగరాలలో పట్టణాలలో ఈ ఆరు పనులకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
వి.సాంబి రెడ్డి యం.వి. ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి
పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచటానికి ఉద్దేశించిన జీ.వో నెం.336ను తక్షణమే ఉపసంహరించు కోవాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. విజయవాడతో సహా రాష్ట్రంలోని 110 పట్టణ స్థానిక సంస్థలలో వివిధ పనులను చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం రు.12,600 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించింది. అందులో 90 శాతం అంటే రు. 11,340 కోట్లు బ్యాంకులనుండి 8 శాతం వడ్డీకి ఋణం తీసుకోబోతున్నది. మిగతా 10 శాతం అంటే రు.1260కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుతుంది. పట్టణ స్థానిక సంస్థలలో నీటి సరఫరా, సివరేజి మేనేజ్మెంట్, వర్షపునీటి కాలువలు, రోడ్ల పునర్నిర్మాణం, శ్మశానవాటికలు, పార్కుల అభివృధ్ధి- ఈ ఆరుపనులు ఈ ఋణంతో చేస్తారట. నిజానికి మున్సిపల్ నిధులతో ఈ పనులను చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చెల్లించిన పన్నులనుండి స్ధానికాభివృధ్ధికోసం మున్సిపాలిటీలకు నిధులను కేటాయించాలి. ఇవేవి చేయకుండా వేలకోట్లరూపాయలు అప్పులుచేసి ఈ పనులు చేస్తామనటం దారుణం. ఇప్పటికే నీటి కనెక్షన్ ఇవ్వాలన్నా, డ్రైనేజి కనెక్షన్ ఇవ్వాలన్నా డొనేషన్లపేరుతో వాటికయ్యే ఖర్చును వసూలు చేస్తున్నారు. నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు భారీగా పెంచి వాటి నిర్వాహణకు అయ్యే ఖర్చును ప్రజల నుండే వసూలు చేస్తున్నారు. పార్కులు ప్రైవేటువారికి ఇస్తున్నారు. ఒకవైపు నిర్మాణ,నిర్వహణా వ్యయాలను ప్రజలనుండి వసూలు చేస్తూ తిరిగి అవే పనులకు వేలాది కోట్లరూపాయలు అప్పులు తెచ్చి చేస్తామనటంలో ఔచిత్యమేమిటని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది.
అయితే ఈ ఋణం తీసుకునేది ప్రభుత్వమైనా భరించేది ప్రభుత్వం కాదు. ఈ పనులకు చేయటానికి ఏ మున్సిపల్ సంస్థ పరిధిలో ఎంత ఖర్చు చేస్తారో ఆ మొత్తాన్ని ఆ మున్సిపాలిటీ లేదా ఆ మున్సిపల్ కార్పొరేషన్ వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆ జీ.వోలో నిబంధన విధించారు. దీనిని బట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధులివ్వకుండా మున్సిపల్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెడుతున్నదని స్పష్టం అవుతున్నది. ఈ ఋణంలో మొదటి దఫాగా రు.3000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలోనే తీసుకోవాలని నిర్ణయించారు. కేవలం 4 నెలలో కాలంలో రు.3000 కోట్లు విలువగలిగిన పనులు ఎలా అవుతాయని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రశ్నిస్తున్నది. విజయవాడలో వర్షపునీటి కాలువల నిర్మాణం కోసం కేంద్రం నుండి రు.461 కోట్లు వచ్చి సుమారు 3 సంవత్సరాలు అవుతున్నా, నేటికీ పనులు అరకొరగా జరుగుతున్నాయే తప్ప పూర్తికాలేదు. ఎన్నికలలోపు పూర్తయ్యే అవకాశంకూడా కనుపించటం లేదు. మూడేళ్ళలో రు.461 కోట్ల విలువ కలిగిన పనులు చేయలేని ప్రభుత్వం, 4 నెలల కాలంలో రు.3000 కోట్లు ఖర్చు చేసి పనులు చేస్తామనటం కేవలం ప్రజలను మభ్యపెట్టడమేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. మరో 5 నెలలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు ఉండగా రు.3000 కోట్లు ఈ ఆర్ధిక సంవత్సరంలోనే తీసుకోవటం మున్సిపాలిటీలలో పనులు చేయటానికి కాదని, ఆ డబ్బును వేరే అవసరాలకు మళ్ళించటానికి వేసిన ఎత్తుగడ అని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేసే అప్పును పట్ణణాలు, నగరాలలోని ప్రజలే భరించాలి. దానికోసం మున్సిపల్ సంస్థలు పట్టణ ప్రజలపై పన్నుల భారం వేసే అవకాశం ఉంది. ఇది ప్రజలకు భారంగా మారబోతున్నది. అదే విధంగా భవిష్యత్తులో స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన నిధులను శాశ్వితంగా ఎగ్గొట్టడానికి ఇది మార్గాన్ని సుగమం చేస్తుంది. ఈ కారణాలన్నింటి రీత్యా రాష్ట్ర ప్రభుత్వం ఋణం కోసం విడుదల చేసిన ఈ జీ.వోను టాక్స్ పేయర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తున్నది. పట్టణ స్థానిక సంస్థలను అప్పులలో ముంచటానికి, ప్రజలపై భారాలను మోపటానికి ఉద్దేశించిన ఈ జీ.వో ను తక్షణమే ఉప సంహరించుకోవాలని, నగరాలలో పట్టణాలలో ఈ ఆరు పనులకు అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది.
వి.సాంబి రెడ్డి యం.వి. ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి
Friday, 3 August 2018
మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని అప్రజాస్వామికంగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయటంపై గళం విప్పిన టాక్స్ పేయర్స్ అసోసియేషన్
03.08.2018 న టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రెస్మీట్లో విడుదలచేసిన ప్రెస్ నోట్
ప్రచురణార్ధం: తేదీ:03.08.2018
విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ తీర్మానాన్ని రద్దు చేసి మున్సిపల్ కార్పొరేషన్ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.వో. ను తక్షణమే ఉపసంహరించుకోవాలని టాక్స్పేయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి లేఖ వ్రాశింది. విజయవాడ నగరంలో బృందావన్ కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 1052.86చ.గ.ల స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి కేటాయించాలని కోరుతూ గత ఏప్రిల్లో మున్సిపల్ కమీషనర్ నగరపాలక సంస్థ కౌన్సిల్లో ప్రతిపాదన ప్రవేశపెట్టారు. ఆ ప్రతిపాదనను నగరపాలక సంస్థ కౌన్సిల్ తిరస్కరిస్తూ తీర్మానించింది. ఆస్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ కడితే కార్పొరేషన్కు ఆదాయం వస్తుందని కౌన్సిల్ తీర్మానించింది. ప్రతిపాదనను తిరస్కరిస్తూ కౌన్సిల్ తీర్మానించిన విషయాన్ని కమీషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని రద్దు చేస్తూ, ఆ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి కేటాయిస్తూ 23.07.2018న జీ.వో.నెంబరు 707ను జారీ చేసింది. ఈ విషయంలో మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని టాక్స్పేయర్స్ అసోసియేషన్ ఆలేఖలో పేర్కొన్నది.
మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలంటే కౌన్సిల్ తీర్మానం మున్సిపల్ చట్టాన్ని గాని, ఇతర చట్టాలనుగాని అతిక్రమించేదిగా ఉండాలి. లేదా ఆతీర్మానం కార్పొరేషన్కు నష్టం కలిగించేదిగా ఉండాలి. లేదా ప్రజలకు, ప్రజారోగ్యానికి, ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించేదిగా ఉండాలి. ఈ స్థలం విషయంలో కౌన్సిల్ చేసిన తీర్మానం కార్పొరేషన్కు నష్టంగాని, ప్రజలకు, ప్రజారోగ్యానికి, ప్రజల భద్రతకు ప్రమాదం కలిగించేదిగాలేదు. పైగా కార్పొరేషన్కు లాభం చేకూర్చేదిగా ఉంది. అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీ.వో వలన కార్పొరేషన్కు నష్టం కలుగుతుంది. కౌన్సిల్ తీర్మానించిన విధంగా షాపింగ్ కాంపెక్స్ కడితే కార్పొరేషన్కు ఆదాయం వస్తుంది. శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇస్తే వచ్చే ఆదాయంపోగా, ఆ స్థలాన్ని కార్పొరేన్ శాశ్వితంగా కోల్పోతుంది. ఇది కార్పొరేషన్కు తీరని నష్టం. ఈ విషయాన్ని టాక్స్పేయర్స్ అసోసియేషన్ ఈ లేఖ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. కౌన్సిల్ చేసిన తీర్మానం మున్సిపల్ చట్టాన్నిగాని, ఇతర చట్టాన్నిగాని అతిక్రమించటంలేదు. ఈ విషయంలో చట్టాన్ని అతిక్రమించింది రాష్ట్ర ప్రభుత్వం తప్ప మున్సిపల్ కౌన్సిల్ కాదు. అందువలన జీ.వో.చట్టవిరుధ్ధమని టాక్స్పేయర్స్ అసోసియేషన్ ఆలేఖలో పేర్కొన్నది.
మున్సిపల్ కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని రద్దు చేసి, ఆ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినకారణాన్ని కూడా టాక్స్పేయర్స్ అసోసియేషన్ ఆక్షేపించింది. ''క్రొత్తగా ఏర్పడిన రాష్ట్రం ముందు ఉన్న సవాళ్లను దృష్టిలో పెట్టుకొని, శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని విజయవాడలో ఏర్పాటుచేయటం ద్వారా దైవాశీస్సులు పొందటం సముచితంగా ఉంటుందని ఈ స్థలాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి ఇవ్వాలని నిర్ణయించామని'' రాష్ట్ర ప్రభుత్వం ఆ జీ.వో.లో పేర్కొన్నది. వ్యక్తులకు సంబంధించిన నమ్మకాలను, ప్రభుత్వం ప్రజలపై రుద్దటం తప్పని ఆ లేఖలో పేర్కొన్నది. ప్రభుత్వం అనేది ప్రజాస్వామ్య లౌకిక సూత్రాల ఆధారంగా ఏర్పడిన భారత రాజ్యాంగ విలువలను పెంపొందించేదిగా ఉండాలే తప్ప, వ్యక్తిగత నమ్మకాలకోసం పనిచేసేదిగా ఉండరాదని ఆలేఖలో స్పష్టం చేసింది. ప్రజోపయోగమైన మున్సిపల్ స్థలాన్ని మత సంస్థలకు ఇవ్వటం లౌకిక తత్వానికి వ్యతిరేకమని టాక్స్పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.వో ప్రజాస్వామ్య విరుధ్ధమని, రాజ్యాంగ విరుధ్దమని, చట్ట విరుధ్ధమని టాక్స్పేయర్స్ అసోసియేషన్ ఆలేఖలో స్పష్టం చేసింది. తక్షణమే ఈ జీ.వోను ఉపసంహరించు కోవాలని, కౌన్సిల్ చేసిన తీర్మానాన్ని పునరుధ్దరించాలని టాక్స్పేయర్స్ అసోసియేషన్ డిమాండు చేసింది. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ రాష్ట్రప్రభుత్వం కౌన్సిల్ తీర్మానాన్ని రద్దు చేయటంపై స్పందించాలని ఎం.ఎల్.ఏలకు, కార్పొరేటర్లకు, రాజకీయ పార్టీలకు టాక్స్పేయర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేస్తున్నది.
వి.సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి
Thursday, 19 July 2018
19.07.2018 న టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ప్రెస్మీట్లో విడుదలచేసిన ప్రెస్ నోట్
విజయవాడ నగరంలో పెంచిన నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నగరపాలక సంస్థ పాలకులను డిమాండు చేస్తున్నది. నగరంలో నీటి చార్జీలు డ్రైనేజి చార్జీలు గత 5 ఏళ్ల కాలంలో 40 శాతం పెరిగాయి. 5 ఏళ్ల క్రితం స్పెషలాఫీసర్ పాలనలో నీటి చార్జీలను ఆస్తి పన్నుతో లింకు పెట్టారు. అపార్టుమెంట్లకు నీటి శ్లాబులు మార్చారు. రేట్లు పెంచారు. ఒక్కొక్క మరుగుదొడ్డికి రు.15లుగా ఉన్న డ్రైనేజి చార్జీనిరు.30లకు పెంచారు. ఇది చాలదన్నట్టు మరల మరల పెంచే పని లేకుండా ఏటా 7 శాతం ఆటోమేటిక్గా పెెరిగే నిబంధనను పెట్టారు. ఇప్పుడది తడిచి మోపెడై 40 శాతానికి పెరిగింది. రాబోయేకాలంలో ఇంకా వేగంగా పెరుగుతుంది. ఇప్పటికే భారం అనుకుంటుంటే మరల నీటి చార్జీలను పెంచటానికి రాష్ట్ర ప్రభుత్వమే జి.వో. నెం. 159 ని విడుదల చేసింది. ఈ జి.వో ఆధారంగా త్వరలో నీటి చార్జీలు ఇంకా పెంచబోతున్నారు. ఈ జి.వో ప్రకారం నీటి చార్జీలు వ్యక్తిగత నివాస గృహాలకు ఆస్తి పన్ను నెలకు రు.250/-ల లోపుఉంటే 50 శాతం, నెలకురు.250/-లకు పైన ఉంటే 100 శాతం, అపార్టుమెంట్లకు 150 శాతం పెంచబోతున్నారు. పరిశ్రమలకు 150 శాతం, వాణిజ్య సముదాయాలకు 200శాతం పెంచబోతున్నారు.
2014 ఎన్నికలకు ముందు నీటిచార్జీలు, డ్రైనేజి చార్జీలు పెంచటం ఘోరమని,ఆస్తి పన్నుతో లింకు పెట్టడం తప్పని, ఏటా 7 శాతం పెంచటం మరీ అన్యాయమని తెలుగు దేశంవారు ఆందోళనలు చేశారు. వీధులలో బ్యానర్లు పట్టుక తిరిగారు. తాము అధికారంలోకి వస్తే ఈ పెంపుదలను రద్దు చేసి, స్పెషలాఫీసర్ పాలనకు ముందున్న రేట్లనే అమలు చేస్తామన్నారు. నమ్మి ఓట్లేయమన్నారు. జనం ఓట్లేశారు. వారు అధికారంలోకి వచ్చారు. అంతే నేటివరకు పెంపుదల విషయంలో ఒక్క అంశంకూడా మార్చలేదు. మార్చమని కౌన్సిల్ ఎజెండాలో పెడితే ఏదో విధంగా దాటేశారు తప్ప తగ్గించటానికి కనీసం తీర్మానం కూడా చేయలేదు. నీటి చార్జీలను ఆస్తి పన్నుతో లింకుపెట్టడాన్ని అలాగే అపార్టుమెంట్లకు నీటి శ్లాబులు మార్చటం, రేట్లు పెంచటంలాంటివాటిని రద్దుచేయటంమాట అటుంచి కనీసం ఏటా 7 శాతం పెంపుదల నిబంధనను కూడా రద్దు చేయలేదు. ఇది చాలదన్నట్లు నేటి తెలుగు దేశం ప్రభుత్వమే నీటి చార్జీలను పెంచటానికి జి.వో. నెం. 159 ని విడుదల చేశారు. ఇది ఓట్లేసిన జనాన్ని దగా చేయటమేనని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ స్పష్టం చేస్తున్నది.
ఇప్పటివరకు నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీలు స్థానిక సంస్థలు నిర్ణయిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే రంగంలోకి దిగి నీటి చార్జీల ధరల నిర్ణయాన్ని తన చేతులలోకి తీసుకుంటున్నది. త్వరలోనే డ్రైనేజి చార్జీలను కూడా రాష్ట్ర ప్రబుత్వమే లాగేసుకో బోతున్నది. ఇప్పటికే ఆస్తిపన్నును రాష్ట్ర ప్రభుత్వం తన చేతులలోకి తీసుకున్నది. ఇది స్థానిక సంస్థల హక్కులను హరించటమే అవుతుంది. ఇది ప్రజాస్వామ్యవిరుధ్ధం.
ఇప్పటికైనా సరే నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల పెంపుదలను ఉపసంహరించుకోవాలని, స్పెషలాఫీసర్ పాలనకు ముందున్న చార్జీలనే వర్తింప జేయాలని, నీటి చార్జీలను ఆస్తిపన్నుతో ముడిపెట్టే విధానాన్ని రద్దు చేయాలని, బిల్లులు ఏడాదికి ఒకేసారి కాకుండా గతంలో మాదిరిగానే ప్రతి 6 నెలలకొకసారి ఇవ్వాలని, జి.వో. నెం. 159 ని రద్దు చేయాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ డిమాండు చేస్తున్నది. ఆస్తిపన్నులు, నీటి చార్జీలు, డ్రైనేజి చార్జీల నిర్ణయాధికారం కార్పొరేషన్కే ఉంచేవిధంగా పోరాడాలని టాక్స్ పేయర్స్ అసోసియేషన్ నగర మేయర్, కార్పొరేటర్లను, ఎం.ఎల్.ఏలను కోరుతున్నది.
వి.సాంబిరెడ్డి యం.వి.ఆంజనేయులు
అధ్యక్షులు కార్యదర్శి
Sunday, 10 June 2018
Subscribe to:
Posts (Atom)